-
మూడ్రోజుల్లో మూడు ఏనుగులు మృతి
బలరాంపూర్: ఛత్తీస్గఢ్లోని సుర్గుజా డివిజన్ అడవిలో గురువారం మరో ఏనుగు విగత జీవిగా మారింది. మంగళ, బుధవారాల్లో రెండు ఏనుగులు మరణించాయి. వీటిలో ఒకటి గర్భంతో ఉంది. ఈ రెండూ సూరజ్ పూర్ జిల్లాలోని ప్రతాప్పూర్ ఫారెస్ట్ రేంజ్లో కనిపించాయి. మరణించిన మూడూ ఆడ ఏనుగులే కావడం గమనార్హం. అన్నింటి మరణం ఒకేలా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే అది సాధారణం కాదని, విషం వల్ల మరణించి ఉండవచ్చని చెబుతున్నారు. మహువా పూలను అధికంగా తినడంగానీ లేదా యూరియా మందును తిని ఉండవచ్చని భావిస్తున్నారు. ఏనుగుల మీద ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. విషప్రయోగం జరిగిందేమో తెలుసుకోవ డానికి అడవిలోని నీటిని పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గజరాజుకు పరీక్ష రాజస్తాన్ రాజధాని జైపూర్లో ఏనుగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం -
అమ్మకోసం.. గుక్కపెట్టి ఏడ్చింది
చెన్నై: అనారోగ్యంతో తల్లి మరణించడంతో ఓ గున్న ఏనుగు కన్నీరు కారుస్తూ.. తల్లి శరీరానికి కాపలా కాస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంగళవారం సాయంత్రం కోయంబత్తూరుకు దగ్గరలోని నర్సిపురం గ్రామంలో ఓ 20 సంవత్సారాల ఆడ ఏనుగు అనారోగ్యంతో కన్నుమూసింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు షాకయ్యారు. ఆ తల్లి కోసం పిల్ల ఏనుగు కన్నీరు కారుస్తూ దాని శవం పక్కనే నిలబడి ఉంది. గత 15 రోజులలో తమిళనాడు అడవుల్లో వరుసగా ఐదు ఏనుగులు అనారోగ్య కారణాలతో మరణించాయి. అటవీశాఖ అధికారులు ఏనుగుల అకాల మరణాలపై పరిశోధనలు చేయాలని జంతుప్రేమికుడు మోహన్ రాజ్ కోరారు. అటవీ ప్రాంతాన్ని వదలి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగలను పట్టుకునేందుకు ప్రయత్నించడం కన్నా ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలన్నారు. సహజ కారణాల వల్ల ప్రతి ఏటా రెండు శాతం ఏనుగులు దేశంలో మరణిస్తున్నాయని ప్రముఖ బయాలజిస్ట్ రామన్ సుకుమార్ అన్నారు. 2012 లెక్కల ప్రకారం తమిళనాడులో 4,000 ఏనుగులు ఉన్నాయని, వీటిలో 2,400 ఆడ ఏనుగులని చెప్పారు. 20 సంవత్సరాల వయసులో ఓ ఏనుగు మరణించిందంటే అందుకు సహజసిద్ధమైన కారణాలే ఎక్కువగా ఉంటాయని అన్నారు. 2015 కరువు సంవత్సరం కావడంతో ఆ ప్రభావంతో కూడా ఏనుగులు మరణించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నగరాల్లోని వ్యర్ధాలను అక్రమంగా తరలించి అడవుల్లో పడేయడం వల్ల వాటిని ఆహారంగా తీసుకుని ఏనుగులు అనారోగ్యానికి గురై మరణించొచ్చని చెప్పారు. గుడలూరు అటవీ ప్రాంతంలో ఏనుగులు తిరిగే ప్రదేశాల్లో వ్యర్ధాలను డంప్ చేసినట్లు పర్యావరణవేత్తలు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement