-
రివర్స్ గేర్
ఇంజినీరింగ్ పనుల్లో దండిగా సంపాదించే అవకాశాలెన్నో.. పనికి అంచనాలు వేయడం నుంచి టెండర్ల పని పూర్తయి తుది చెల్లింపుల వరకు రకరకాల పేర్లలో ప్రజల డబ్బు కాజేస్తున్నారు. అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఇంజినీరింగ్ శాఖల నుంచి ఏటా రూ.కోట్లలోనే ప్రజల డబ్బు పక్కదారి పడుతోంది. ఇక నుంచి కాంట్రాక్టర్ల అక్రమాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చెక్ పెట్టనుంది. టెండర్లలో కూటమి కట్టకుండా, సిఫార్సులకు పీట వేయకుండా అడ్డగోలు ధరలు వేయకుండా, అస్మదీయులు పని దక్కించుకొనే విధానానికి చెల్లు చీటీ ఇస్తూ టెండర్ విధానంలో సమూల మార్పులు తీసుకురాబోతోంది. సంస్కరణల దిశగా తొలి అడుగు వేసింది. ఈ అడుగు విప్లవాత్మక మార్పు దిశగా పయనిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒంగోలు సిటీ: జిల్లాలో పలు శాఖల్లో ఏటా రూ.కోట్లలోనే పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల పనులు జిల్లా నుంచి జరుగుతున్నాయి. రోడ్లు భవనాలు, జల వనరులు, పంచాయతీరాజ్, నీటి పారుదల ప్రాజెక్టులు, మురుగు నీటి పారుదల ప్రాజెక్టులు ఇలా ఒకటేంటి సుమారు 74 శాఖల్లో పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో నాబార్డు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వచ్చే నిధులు, కేంద్ర గ్రాంటులు, విదేశీ సంస్థల రుణాల సహకారంతో జరిగే పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటులు, అభివృద్ధి నిధులు, బడ్జెటరీ నిధులతో పనులు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక శాఖలో టెండర్లు జరుగుతూనే ఉంటాయి. ఇంజినీరింగ్ శాఖలు, ఇంజినీరింగ్ పనుల్లోనే రూ.కోట్లలోనే అవినీతి జరుగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ అవినీతి వ్యవహారాలు, అక్రమాలు, టెండర్లలో అడ్డగోలుతనాన్ని ప్రొత్సహించింది. ఈ అవినీతి విధానం ఇంజినీరింగ్ పనుల్లో వేళ్లూనుకుంది. ఈ వ్యవస్థలో సమూలంగా మార్పులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘రింగ్’ రాకెట్కు చెక్.. టెండర్లలో కూటమి కట్టడం ఇక్కడ బాగా ప్రసిద్ధి. పోటీదారులు టెండర్లలో పాల్గొనకుండా చేస్తారు. ఇందులో అధికారులను ప్రలోభపెడతారు. జిల్లాలో ఏళ్ల నుంచి కొనసాగుతున్న తంతు ఇదే. ఏటా జిల్లాలో జరుగుతున్న వివిధ ఇంజినీరింగ్ పనుల టెండర్ల ద్వారానే సుమారు రూ.2 వేల కోట్లకుపైగా ప్రజల డబ్బులు గుత్తేదారులు, అవినీతికి పాల్పడే అధికారుల జేబులు నింపుతున్నాయి. బినామీల పేరుతో కొందరు అధికారులు ఇక్కడ టెండర్లు వేయడం.. అవకాశం ఉన్న కాడికి దండుకోవడం నిత్యకృత్యం. టెండర్లలో పోటీదారులు వస్తే కూటమి (రింగ్) కట్టడడమే. ఇక అన్ని స్థాయిల్లో నిఘా.. వివిధ ఇంజినీరింగ్ శాఖల్లో పనులకు ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్(ఈపీసీ) పద్ధతి ఒకటి కాగా.. రెండో పద్ధతి లంప్సమ్ ఓపెన్ విధానం. ఈపీసీ విధానం ప్రకారం పనులకు కాంట్రాక్టర్ డిజైన్ రూపొందించాలి. పని పూర్తయ్యాక ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. అంచనా విలువ కన్నా ఎక్కువ ఖర్చు చేశానని ఆ మేరకు అదనపు బిల్లు ఇవ్వాలని కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉండదు. కాంట్రాక్టర్ కోట్ చేసిన ధరల ఆధారంగానే వర్గీకరించి హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపుతారు. అందరి కన్నా తక్కువ కోట్ చేసిన గుత్తేదారునికి అప్పగించేలా హై పవర్ కమిటీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇక టెండర్ల విధానంపై అన్ని స్థాయిల్లోనూ నిఘా ఏర్పడనుంది. నష్టం వచ్చే ద్వారాలకు మూత.. ఇంజినీరింగ్ పనుల్లో ఎక్కడా నష్టం రాకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగానే ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోబోతోంది. ఇప్పటి వరకు కాంట్రాక్టు పనుల్లో కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలు అడ్డగోలుగా తుంగలో తొక్కారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై టెండర్ల విధానాన్నే అపహాస్యం చేశారు. కొన్ని పనులకు పరిపాలనా అనుమతులు తీసుకోకుండానే పని అంచనా వ్యయాలను భారీగా పెంచేసి టెండర్ల నోటిఫికేషన్లు జారీ చేయించారు. జిల్లాలో వెలుగొండ పనులకు అడ్డగోలుగా అంచనాలు పెంచి ఎస్ఆర్ ధరలను పెంచి చంద్రబాబు ప్రభుత్వం వేరే సంస్థకు పనులు కట్టబెట్టడంతో పాత కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. దీంతో వెలుగొండ పరిధిలోని కొన్ని ప్యాకేజీల్లో పనులు ముందుకు పోకుండా నిలిచాయి. ఖజానాకు భారీగా నష్టం వచ్చింది. 2017లో హైపవర్ కమిటీని రద్దు చేయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది. తమ కాంట్రాక్టు పనులకు కొన్ని నిబంధనలు అడ్డు వస్తున్నాయని రద్దు చేయించారు. ఇక పనుల్లో అడ్డగోలు తనం పెరిగింది. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టు పనుల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. అక్రమాలకు కళ్లెం.. ఇక నుంచి అస్మదీయులకే పని విధానానికి కాలం చెల్లనుంది. కమీషన్లు, అదనపు చెల్లింపులు ఉండవు. ముఖ్యమంత్రి జగన్ తన తొలి సంతకంతోనే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు. రూ.వందల కోట్ల అవినీతికి ఆలవాలంగా మారిన ఇంజినీరింగ్ పనుల్లో ప్రక్షాళనకు రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఖజానాపై క్రమేణా భారం తగ్గుతుంది. ఇక టెండర్లలో అడ్డగోలు తనం ఉండదు. టెండర్ల స్థాయిలోనే అన్ని రకాల అక్రమాలకు చెక్ పడనుంది. హైకోర్టు జడ్జి నేతృత్వంలో జుడీషియర్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ సిఫార్సు మేరకు టెండర్లు పిలుస్తారు. భారీగా ఆదాయం.. టెండర్ల విధానంలో రానున్న మార్పుల నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది. ఇటీవల ఆర్ అండ్ బి నుంచి నిర్వహించిన టెండర్లలోనే తక్కువ ధర కోట్ చేసిన కాంట్రాక్టర్లను విడిచిపెట్టి అధిక ధరలను కోట్ చేసిన వారికి పని ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమారు రూ.10 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. ఇక జలయజ్ఞం పనుల్లో అయితే పెద్ద ఎత్తున ఖజానా ఆదాయానికి గండి పడింది. జిల్లాలో జరుగుతున్న రూ.వందల కోట్ల పనుల్లో పెద్ద ఎత్తునే ప్రజల డబ్బు పక్కదారి పడుతోంది. టెండర్ల విధానంలో రానున్న సమూల మార్పుల నేపథ్యంలో వచ్చే ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం పేదల సంక్షేమానికే ఖర్చుచేయనుంది.ఆదా అయ్యే నిధులతో పేదల సంక్షేమానికి వినియోగిస్తారు. ఈ కొత్త వి«ధానం వినూత్న మార్పుకు ప్రగతి అడుగు అన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. కాంట్రాక్టర్లలో గుబులు.. జిల్లాలో పెద్ద కాంట్రాక్టర్లు 32 మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగే పనులకు అర్హత ఉన్న కాంట్రాక్టర్లు కేవలం 9 మందే. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే పనులు చేస్తున్నారు. జలవనరులశాఖ, ఆర్అండ్బీ, ప్రజారోగ్యశాఖ, వైద్య ఆరోగ్యం, మానవవనరులు, పరిశ్రమలు ఇతర శాఖల్లో టెండర్లలో పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నాయి. అవినీతి జరిగిన టెండర్లను రద్దు చేయనున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. అర్హులైతేనే పని.. జిల్లాలో అనర్హులు ఎందరో ఆర్ అండ్ బీ, నీటి పారుదల తదితర ఇంజినీరింగ్ శాఖల్లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. హాట్ మిక్స్ ప్లాంట్, మినషనరీ ఇతర యంత్రాలు, అర్హతలు అన్ని సరిపోతేనే పని చేసేందుకు కాంట్రాక్టర్కు అర్హత ఉంటుంది. జిల్లాలో చేస్తున్న పనులకు పలువురు కాంట్రాక్టర్లకు పనికి సంబంధించి అర్హత లేకున్నా టీడీపీ ప్రజాప్రతినిధులు సిఫార్సులు చేశారు. జిల్లాలో కొన్ని రకాల పనులకు సాంకేతిక పరమైన అర్హతలు లేని కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు. కొప్పోలు రోడ్డు పనిని కూడా అర్హత లేని కాంట్రాక్టర్ చేశాడు. -
అక్రమ కేసుల్ని సహించం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో ఫ్లెక్సీ ఏర్పాటు సందర్భంగా తలెత్తిన చిన్నపాటి వివాదాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేందుకు అధికార పార్టీ యత్నిస్తున్న నేపథ్యంలో వైఎస్సా ర్ సీపీ నాయకుల బృందం జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ను గురువారం ఆయన కార్యాలయానికి వెళ్లి కలిసింది. బృందంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు తదితరులు ఉన్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై చోటుచేసుకున్న ఘర్షణ విషయంలో ప్రతిపక్షంపై కక్షగట్టినట్టు వ్యవహరించడం సరికాదని వారు ఎస్పీకి వివరించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడలేని వ్యక్తితో ఫిర్యాదు చేయించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని ఎస్పీకి వివరిం చారు. అక్కడ పోలీసులకు సంబంధించిన సీసీ కెమేరాలు ఉన్నాయని, ఘటనను పూర్తిగా పరిశీలించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మంత్రి మాణిక్యాలరావు డీఎస్పీ సమక్షంలో సీఐని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో అందచేశారు. ఇంత దారుణమా అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకుని హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.అధికార పార్టీ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఘటనను చూస్తే అర్థం అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యేపైనే అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధపడితే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని నేతలు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హోదాను మరిచి చిన్న వివాదంలో తలదూర్చి మాజీ ఎమ్మెల్యే కొట్టుపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయిం చడం దారుణమన్నారు. కొట్టు సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని పోలీసు శాఖను కోరామన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్జగ¯ŒSమోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న ఘటనను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తే భయపడి పారిపోయేది లేదన్నారు. అధికార పార్టీ ఆగడాలను ఎదుర్కొంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వ్యక్తి ఘటనా స్థలంలోనే లేడని, చిన్నపాటి ఘటనను 307, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల వరకూ తీసుకువెళ్లారన్నారు. ఇలా అరాచకాలు చేసిన వారు చరిత్రలో చాలామంది గతించిపోయారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్న ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తే పోలీస్ యంత్రాంగం స్పందించడం లేదని, అధికార పార్టీ కేసు పెడితే మాత్రం క్షణాల్లో స్పందిస్తోందని అన్నారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలడం దురదృష్టకరమన్నారు. -
అక్రమ కేసుల్ని సహించం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో ఫ్లెక్సీ ఏర్పాటు సందర్భంగా తలెత్తిన చిన్నపాటి వివాదాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేందుకు అధికార పార్టీ యత్నిస్తున్న నేపథ్యంలో వైఎస్సా ర్ సీపీ నాయకుల బృందం జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ను గురువారం ఆయన కార్యాలయానికి వెళ్లి కలిసింది. బృందంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు తదితరులు ఉన్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై చోటుచేసుకున్న ఘర్షణ విషయంలో ప్రతిపక్షంపై కక్షగట్టినట్టు వ్యవహరించడం సరికాదని వారు ఎస్పీకి వివరించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడలేని వ్యక్తితో ఫిర్యాదు చేయించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని ఎస్పీకి వివరిం చారు. అక్కడ పోలీసులకు సంబంధించిన సీసీ కెమేరాలు ఉన్నాయని, ఘటనను పూర్తిగా పరిశీలించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మంత్రి మాణిక్యాలరావు డీఎస్పీ సమక్షంలో సీఐని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో అందచేశారు. ఇంత దారుణమా అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకుని హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.అధికార పార్టీ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఘటనను చూస్తే అర్థం అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యేపైనే అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధపడితే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని నేతలు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హోదాను మరిచి చిన్న వివాదంలో తలదూర్చి మాజీ ఎమ్మెల్యే కొట్టుపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయిం చడం దారుణమన్నారు. కొట్టు సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని పోలీసు శాఖను కోరామన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్జగ¯ŒSమోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న ఘటనను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తే భయపడి పారిపోయేది లేదన్నారు. అధికార పార్టీ ఆగడాలను ఎదుర్కొంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వ్యక్తి ఘటనా స్థలంలోనే లేడని, చిన్నపాటి ఘటనను 307, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల వరకూ తీసుకువెళ్లారన్నారు. ఇలా అరాచకాలు చేసిన వారు చరిత్రలో చాలామంది గతించిపోయారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్న ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తే పోలీస్ యంత్రాంగం స్పందించడం లేదని, అధికార పార్టీ కేసు పెడితే మాత్రం క్షణాల్లో స్పందిస్తోందని అన్నారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలడం దురదృష్టకరమన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement