-
పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్
* రూ.8వేల కోట్లతో ఉజ్వల యోజన * మూడేళ్లలో 5 కోట్ల మందికి లబ్ధి * కేబినెట్ పచ్చజెండా న్యూఢిల్లీ: నిరుపేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్లను అందించేందుకు ఉద్దేశించిన రూ.8 వేల కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈమేరకు ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’కు పచ్చజెండా ఊపిందని ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ మీడియాకు చెప్పారు. ఈ నిధులను మూడేళ్లలో వినియోగిస్తామన్నారు. దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న మహిళలకు యుద్ధప్రాతిపదికన గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయడం దీని ఉద్దేశం. ఒక్కో కనెక్షన్కు రూ. 1,600 ఆర్థిక సాయం లభిస్తుంది. దీనిపై 2016-17 బడ్జెట్లో జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 1.5 కోట్ల మందికి, మూడేళ్లలో మొత్తం 5 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు గ్యాస్కనెక్షన్లు ఇస్తామన్నారు. * బంగాళా ఖాతం తీర దేశాలైన బిమ్స్టెక్ (బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్లాండ్)లో నేరపరమైన అంశా ల్లో న్యాయ సహాయం ఇచ్చిపుచ్చుకునే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. * బహుళ పోషక ఫెర్టిలైజర్ అయిన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉత్పాదకతను ప్రోత్సహించేం దుకు ప్రస్తుతమున్న కనీస సామర్థ్య వినియోగం నిబంధనను కేబినెట్ ఎత్తివేసింది. దీంతో ఎస్ఎస్పీని ఉత్పత్తి చేసే చిన్న కంపెనీలూ సబ్సిడీని పొందేందుకు వీలవుతుంది. గతంలో గుర్తించిన ఉత్పత్తి సామర్థ్యంలో కనీసం 50 శాతం ఉత్పత్తి చేసే కంపెనీలకే రాయితీ పొందే అర్హత ఉండేది. దీంతోచిన్న కంపెనీలకు కష్టంగా ఉండేది. చౌక రసాయన ఎరువుల్లో ఒకటైన ఎస్ఎస్పీ.. పప్పుధాన్యాలు, ఆయిల్ సీడ్స్, కూరగాయలు, చెరకు వంటి పంటలకు అనువుగా ఉంటుంది. -
గ్యాస్ కనెక్షన్ల జాతర
♦ ఎంపికలోనూ మారని తీరు ♦ జన్మభూమి కమిటీలదే పెత్తనం ♦ నెలాఖరులోగా ఎంపిక ప్రక్రియ పూర్తి ఒకవైపు ఉచితం..మరొక వైపు దీపం..జిల్లాకు గ్యాస్ కనెక్షన్లు భారీ సంఖ్యలో మంజూరయ్యాయి. అదేస్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. కానీ వీటి ఎంపికలో మాత్రం ఒక వైపు జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తుంటే..మరొక వైపు అధికారులు, కమిటీలు చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : జిల్లాకు సామాజిక బాధ్యత పథకం(సీఎస్ఆర్) కింద 1.2లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం సంకల్పించింది. ఉచిత కనెక్షన్ల కోసం ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే చేపట్టారు. వీటికోసం 1,31,518 దరఖాస్తులు వచ్చాయి. జీవీఎంసీ,ఇతర మున్సిపాల్టీలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 1,17,171 దరఖాస్తులను ఏఎస్వో, సీఎస్డీటీలు పరిశీలించారు. ఇంకా 54,210 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. 1132 దరఖాస్తులను తిరస్కరించారు. ఏజెన్సీ పరిధిలో 42,910 దరఖాస్తులకు15,735 దరఖాస్తులను ఆమోదించారు. సాంకేతికకారణాలతో ఉన్నతాధికారులకు సిఫారసు చేసిన దరఖాస్తులు 14,347 ఉన్నాయి. ఏఎస్వో, సీఎస్డీటీలు అప్రూవ్ చేసిన 59,376 దరఖాస్తుదారులకు ఇప్పటికే వారి సెల్ఫోన్ నంబర్లకు మెసేజ్లు కూడా పంపుతున్నారు. వారికి ఏ ఏజెన్సీ పరిధిలో గ్యాస్కనెక్షన్ మంజూరైంది..ఎప్పటిలోగా తీసుకోవాలన్నది తెలియజేస్తూ ఈ మెసేజ్లు వస్తున్నాయి. వీటి విషయంలో జా యింట్ కలెక్టర్ జనార్దనన్ నివాస్ ప్ర త్యేక శ్రద్ధతో 60శాతం ఎంపిక పారదర్శకంగానే సాగింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు స్థానిక అధికారులు ఆన్లైన్లో వారే స్వయంగా దరఖాస్తులను అప్లోడ్ చేసి ఆమోదించారన్న వాదన ఉంది. గ్యాస్కనెక్షన్లేకపోవడం..తెలుపుకార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండడం దీనికి ప్రామాణికంగా పెట్టారు. జిల్లాలో కార్డులు...వాటి పరిధిలో ఉన్న యూనిట్ల సంఖ్యను బట్టి చూస్తే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతితో పాటు ఉన్నత వర్గాలకు చెందిన వేలాది మందికితెలుపుకార్డులున్నాయి. దీంతో పలువురు అధికారుల అండదండలతో ఉచిత కనెక్షన్లు పొందినట్టు తెలుస్తోంది. ఇలా సుమారు 30 శాతం పక్కదారి పట్టే పరిస్థితి చోటుచేసుకుంది. నెలాఖరులోగా ఉచితగ్యాస్ కనెక్షన్ల కోసం ఎంపికతో పాటుమంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం జిల్లాకు 25వేల దీపం కనెక్షన్లను మంజూరు చేసింది. నర్సీపట్నానికి 3,500, అనకాపల్లి, చోడవరానికి 1500 చొప్పున, యలమంచలి, గాజువాక, పెందుర్తి నియోజక వర్గాలకు వెయ్యేసి చొప్పున అదనంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత కనెక్షన్ల జారీ కొంత వరకు పారదర్శకంగా జరిగిన ప్పటికీ దీపం కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక మాత్రం అంతాలోపభూయిష్టంగా సాగుతోంది. ఇది తెలుగుతమ్ముళ్లకు వరంగా మారింది. పేరుకు ఏఎస్వో,రెవెన్యూఅధికారులకు ఎంపిక బాధ్యత ఇచ్చినప్పటికీ జన్మభూమి కమిటీల ఆమోదంతోనే ఎంపిక చేయాలన్న మెలికతో పెత్తనమంతా వారి చేతిలో పెట్టినట్టయింది. మార్చి నెలాఖరులోగానే వీటి ఎంపిక పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో ఎంపికలో చోటు చేసుకుంటున్న రాజకీయాల వల్ల తీవ్ర జాప్యంజరుగుతోంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలకు జన్మభూమికమిటీలు ఆమోద ముద్ర వేస్తుండడంతో అధికారుల ఎంపిక చేసిన జాబితాలు బుట్టదాఖలవుతున్నాయి. జన్మభూమి కమిటీల మితిమీరిన జోక్యం వల్ల అధికారులుతీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అర్హత ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే చెప్పారు.. చేయాల్సిందే దోరణిలో ఈ కమిటీలు పెత్తనంతో ఎంపికలో అధికారులు మిన్నకుండిపోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేయాలన్న పట్టుదలతో అధికారులు పనిచేస్తున్నప్పటికీ కమిటీలు గంటకో జాబితాతో గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు అధికారులు ఎంపికలో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
- Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
- ఏడాదిన్నరలో నాలుగోసారి..
- సెల్ఫోన్తో హై బీపీ!
- ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు
- అనంత్నాగ్–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి
- పద్ధతి ప్రకారం పరిహారం
Advertisement