-
Priya Chhetri: ప్రియమైన విజయం
రెండేళ్ల కిందట ... ప్రియా ఛత్రి ఒక నిస్సహాయ మహిళ. ఢిల్లీ, గుర్గావ్లో ఓ క్లినిక్ ముందు నిలబడి అగమ్యగోచరంగా ఉన్న భవిష్యత్తును ఊహించుకుంటూ కన్నీళ్ల పర్యంతమైంది. భర్త తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పరీక్ష చేసిన డాక్టరు రాసిచ్చిన మందుల చీటీ ఆమె చేతిలో ఉంది. చీటీ అనడం అలవాటైన మాట, కానీ ఆమె చేతిలో ఉన్నది మందుల జాబితా. ఆ మందులు వాడాలంటే తను, భర్త సంపాదిస్తున్న డబ్బు చాలదు. మందులకు ఖర్చు చేస్తే ఇల్లు గడవదు. ఇల్లు గడిస్తే వైద్యం అందదు. తనేమో నాలుగు ఇళ్లలో పనులు చేస్తుంది. భర్త సంజీత్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి నుంచి బతుకుదెరువు కోసం దేశ రాజధాని బాట పట్టిన అనేక కుటుంబాల్లో ప్రియ కుటుంబం ఒకటి. ఇరవై నాలుగేళ్ల వయసులో జీవితం ఆమెకి పెట్టిన పరీక్ష అది. ఆ పరీక్షలో నెగ్గిన ప్రియ ఇప్పుడు సిలిగురిలో తోటి మహిళలకు రోల్ మోడల్ అయింది. ఇంతకీ ఆమె చేసిన పనేంటి అంటే... మనదేశంలో పండని పండ్లను, గింజలను ఇంటింటికీ చేర్చడమే. తాజాగా, నాణ్యంగా ఉన్న పండ్లను ఇస్తుందన్న విశ్వాసాన్ని చూరగొన్నది. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ వారి వారి పనులు చేసుకుంటూనే పండ్ల వ్యాపారం చేస్తూ నెలకు ముఫ్పైవేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇందుకు ఆమె పెట్టుబడి తన శ్రమ మాత్రమే. ఆమెకు అండగా నిలిచింది ఆమె పని చేస్తున్న ఇంటి యజమాని రాశి సోమన్ గొప్ప మనసు. జీవితం పండింది ప్రియ తన పండ్లు, గింజల వ్యాపారానికి తాను పని చేసే ఇళ్ల నుంచే కస్టమర్లను వెతుక్కుంది. తొలి ప్రయత్నంగా ఢిల్లీ మండి నుంచి పది అవకాడోలు తెచ్చింది. మూడు వందల ఆదాయం వచ్చింది. ‘‘రాశి అక్క నాకు ఢిల్లీలోని ఆజాద్పూర్ మండీకి తీసుకెళ్లి చూపించింది. మన దేశంలో అరుదుగా లభించే పరదేశీ పండ్ల గురించి వివరించింది. సాధారణంగా ఒక పండు హోల్సేట్ మార్కెట్ నుంచి తినేవారి చేతికి వచ్చే మధ్యలో ఎన్నో చేతులు మారుతుంది. అనేక దఫాలు రవాణా అవుతుంది. పండ్ల దుకాణానికి చేరి పండ్లు కొనేవారికి అందేలోపు వాడిపోయేవి, కుళ్లిపోయేవి ఎన్నో. దుకాణదారులు ఆ నష్టాలను కూడా బాగున్న పండ్ల మీదనే రాబట్టుకోవాలి. నేను మండీ నుంచి కొనే గింజలు, పండ్లు తక్కువ మోతాదులో ఉంటాయి. అవి కూడా నా కస్టమర్లకు అవసరమైన పండ్లనే తెస్తాను. కాబట్టి నా దగ్గర నిల్వ ఉండవు. తెచ్చిన రోజే కస్టమర్లకు చేరుస్తాను. అలాగే నాణ్యమైన పండ్లను మాత్రమే తెస్తాను. ఏరోజుకారోజు తాజా పండ్లను తినే వెసులుబాటును కల్పిస్తున్నాను. కాబట్టి నా దగ్గర క్రమం తప్పకుండా పండ్లు తెప్పించుకునే వాళ్లు 250 మంది ఉన్నారు. అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చాను. వారానికి ఒకసారి తెప్పించుకునే వాళ్లు ఆదివారం రోజు గూగుల్ ఫార్మ్లో వాళ్లకు అవసరమైనవి తెలియచేస్తారు. గురువారం వాళ్లకు అందచేస్తాను. ఇవి కాకుండా తాజా పండ్లు రోజూ తెప్పించుకునే వాళ్లకు అలాగే అందిస్తున్నాను. పండ్ల దుకాణంలో దరకంటే చాలా తక్కువగా లభిస్తుండడంతో నా ప్రయత్నం విజయవంతమైంది. రెడ్ గ్లోబ్ గ్రేప్స్, బ్లూ బెర్రీ, మాండేరియన్స్, గోల్డెన్ కివీ, గ్రీన్ కివీ వంటి పండ్లతోపాటు వాల్నట్స్, ఫిగ్, విదేశీ ఖర్జూరాలు, హాజిల్నట్, క్రాన్బెర్రీ, మంచి జీడిపప్పు, బాదం వంటివి 30 రకాలు అందిస్తున్నాను. నేను, సంజీత్ మా ఉద్యోగాలు చేసుకుంటూ ఈ వ్యాపారం చేస్తున్నాం. దీనిని వ్యాపారం, లాభాలు అనాలా లేక నేను అందిస్తున్న సర్వీస్కి లభిస్తున్న చార్జ్ అనాలో తెలియదు. కానీ నా పిల్లలు కూడా ప్యాకింగ్, డెలివరీ వంటి పనుల్లో సాయం చేస్తున్నారు. నాకు పద్దెనిమిదేళ్లకే పెళ్లయింది. దాంతో పదకొండవ తరగతితోనే చదువు ఆగిపోయింది. నాకున్న కొద్దిపాటి చదువుతో, నా శ్రమను పెట్టుబడి పెట్టాను. పెద్ద చదువులు చదివిన వాళ్లకంటే తక్కువేమీ కాదని ఈ ఏడాది మహిళాదినోత్సవం రోజు నా గురించి పేపర్లో రాశారు. అంతా మా యజమాని రాశి అక్క సహాయమే’’ అన్నది ప్రియా ఛత్రి. జీవితం ప్రతి ఒక్కరికీ పరీక్షలు పెట్టి విజేతలుగా నిలబెట్టాలని చూస్తుంది. ఆ పరీక్షలో విజయవంతమైన వాళ్లు విజేతలుగా నిలుస్తారు. పరీక్ష నుంచి పారిపోయిన వాళ్లు పరీక్షతోపాటు జీవితేచ్ఛను కూడా పోగొట్టుకున్న పరాజితులుగా మిగులుతారు. ప్రియా ఛత్రి తన జీవితానికి తానే రక్షణ గొడుగు పట్టుకుంది. -
అంజీర సాగుతో 16 లక్షల ఆదాయం
-
పాపం పండుతుందా!
రసాయనాలతో కాయలు మాగబెడుతున్న వ్యాపారులు తింటే ప్రమాదకరమైన రోగాలు అమ్మతనమూ కోల్పోయే ప్రమాదం హైకోర్టు ఆదేశాలతోనైనా అధికారుల్లో కదలిక వచ్చేనా? జిల్లాలో పండ్ల వ్యాపారం అనారోగ్యానికి కేంద్రంగా మారింది. వ్యాపారులు విషపూరిత రసాయనాలను కలిపి 24 గంటల్లోనే పచ్చటి కాయల్ని పండ్లుగా మార్చేస్తున్నారు. డబ్బిచ్చి కొనుక్కున్న పాపానికి వినియోగదారుడికి అనారోగ్యాన్ని అంటగడుతున్నారు. వీటిని తింటే రోగాలే రావడమే కాకుండా అమ్మతనమూ కోల్పోయే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. పండ్లలో రసాయనాలు కలపడంపై హైకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న రసాయన పండ్ల అమ్మకాలపై స్పెషల్ ఫోకస్.. పలమనేరు: మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే రోజువారీ ఆహారంలో పండ్లు తినాలని నిపుణులు చెబుతుంటారు. ఇదంతా గతం. ఇప్పుడు జిల్లాలోని పండ్ల మార్కెట్లో దొరికే కొన్ని రకాల పండ్లను తింటే మనిషికి ఆరోగ్యమేమో గానీ అనారోగ్యం మాత్రం తప్పదు. పచ్చికాయలను సైతం రసాయనాలతో మాగ బెట్టేస్తుండడంతో ఇవి ప్రజల పాలిట శాపంగా మారాయి. ప్రస్తుతం జిల్లాలోని పలు పట్టణాల్లో ఇదే తంతు. పలురకాల కాయలను పండ్లుగా చేసి జనానికి అమ్మేస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, పలమనేరు, వి.కోట, కుప్పం, పుంగనూరు, మదనపల్లె తదితర పట్టణాల్లో పచ్చి కాయలను రసాయనాలతో మాగబెట్టే గోడౌన్లు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై నుంచి వ్యాపారులు ఇక్కడికి కాయలను తీసుకొస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని ఈ గోడౌన్కు తరలించి వాటిని మాగబెట్టడానికి నిర్ణీత రుసుం చెల్లిస్తారు. 24 గంటల్లోపు కాయలు పండ్లుగా మారుతున్నాయి. వీటిని పట్టణాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కాయలను ఊదర ప్రక్రియ, బోధ కసువులో పెట్టి మాగబెట్టడం లాంటి పాత పద్ధతులు ఇప్పుడు కనిపించడం లేదు. ఇదీ తతంగం.. గోడౌన్కు తరలించిన అరటి, మామిడి కాయలను మొదట మ్యాంకోజబ్-45 (ఎం.-45), అనే పౌడర్ను ఒక లీటరు నీటికి ఒక మిలీ చొప్పున వేస్తారు. ఆ నీటిలో ఈ పచ్చి కాయలను ముంచి పక్కన బెడతారు. తర్వాత ఇథాలీన్ అనే బిళ్లలను నీటిలో వేస్తే దాని నుంచి గ్యాస్ వస్తుంది. ఓ గదిలో కాయలను ఉంచి ఈ గ్యాస్ను వదిలి ఆ గదిలోకి గాలిపోకుండా చేస్తారు. మరోవైపు వేపర్ ట్రీట్మెంట్ పేరిట కాయలను బందీ చేసిన గదుల్లోకి విషపూరితమైన మిథైల్ గ్యాస్ను వదిలి పెడతారు. దీంతో 20 నుంచి 24 గంటల్లోనే పచ్చి కాయలు రంగు మారి పండ్లుగా తయారవుతాయి. మామిడి కాయలను అపాయకర కాల్షియం కార్భైట్లతో మాగబెడతారు. పండ్లు పూర్తి విషపూరితంగా మారుతున్నాయి. ఎక్కువ మోతాదులో ఈ పండ్లను తిన్న నాలుగైదు గంటల్లోపు వాంతులు, విరేచనాలు అవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానికి తోడు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలకు వ్యాధులుసోకే అవకాశం ఎక్కువని వైద్యులు అంటున్నారు. పట్టించుకునే నాథుడే లేరు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ విషపూరితమైన రసాయనాలతో కాయలను మాగబెట్టి జిల్లాలోని వివిధ కేంద్రాల్లో పెద్దఎత్తున విక్రయిస్తున్నారు. పట్టణాల్లోని మున్సిపల్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆహార కల్తీ నిరోధక శాఖ ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ వారు స్పందించడం లేదు. మదనపల్లె, చిత్తూరు, తిరుపతిల్లో ఉండే ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి తనిఖీ చేసిన దాఖలాలు అస్సలు లేవు. పండ్లలో రసాయనాల కలపడంపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర హైకోర్టు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని గట్టిగా ఆదేశించింది. దీంతోనైనా అధికారులు స్పందిస్తారేమో చూడాలి.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement