-
జిల్లాగా ‘పేట’ జగదీశ్రెడ్డి ఘనతే..
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ‘గత ఎన్నికల్లో సూర్యాపేటకు వచ్చి జగదీశ్రెడ్డిని గెలిపించాలని కోరా.. అతను గెలిస్తే మామూలు ఎమ్మెల్యేగా ఉండడని.. మంత్రి అవుతాడని చెప్పిన.. ఆ ప్రకారం నేను అతడ్ని మినస్టర్ను చేశా.. ఆయన పెరిగి నేను ఇచ్చిన మాట నిలబెట్టి, ఇవ్వాళ సూర్యాపేటను జిల్లా కేంద్రం చేయించుకున్నాడు. ఈ ఘనత జగదీశ్రెడ్డికి దక్కింది’అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధ్యక్షత వహించగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జగదీశ్రెడ్డి మంత్రిగా లేకపోతే, కేసీఆర్ సీఎం కాకపోతే, తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈ జన్మల కూడా సూర్యాపేట జిల్లా అయ్యేది కాదన్నారు. మెడికల్ కాలేజీ ఇవ్వడంతో పాటు ఆస్పత్రిని 600 బెడ్లకు పెంచామని.. ఇవన్నీ మీ కళ్ల ముందే ఉన్నాయని ప్రజలనుద్దేశించి అన్నారు. జిల్లా కేంద్రం కావడంతో అన్నీ ఒకటి తర్వాత ఒకటి అవే పరుగెత్తుకుంటూ వస్తాయన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 40 కొత్త గ్రామ పంచాయతీలను చేసుకున్నారని, అందులో 35 తండాలు పంచాయతీలయ్యాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల కింద శిథిలమైన ముసీ ప్రాజెక్టును ఆధునికీకరించడంతో చివరి భూములకు మూసీ నీళ్లు పోతున్నాయన్నారు. సూర్యాపేట చైతన్య వంతమైన ప్రాంతం అని, జిల్లా వాసి వేణుగోపాల్రెడ్డి లాంటి వారి ఆత్మత్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుచేశారు. నాకన్నా దొడ్డుగున్న వారు కరెంట్ ఎందుకు తేలేదు..? నల్లగొండ జిల్లాలో మనుషులు లేరా..? నా కన్నా రెండింతల దొడ్డుగ ఉన్నరు.. నాకన్నా పిడికెడు ఎత్తు ఉన్నరు.. వాళ్లు తెలంగాణను ఎందుకు తేలే. కరెంట్ను ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. ఈ సభను చూస్తే పెద్ద మెజార్టీతో జగదీశ్రెడ్డి గెలిచిపోయిండని అర్థమైందని, ఇందులో ఎవ్వరికి అనుమానం లేదన్నారు. ఓటు వేసే ముందు నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఏం జరిగిందో దాన్ని చూసి వేయాలని కోరారు. చీకట్లను పారదోలిన ఘనత జగదీశ్రెడ్డిదే: రాష్ట్రంలో చిమ్మచీకట్లను పారదోలిన ఘనత జగదీశ్రెడ్డికే దక్కిందని కేసీఆర్ కొనియాడారు. విద్యుత్చ్ఛక్తి రంగంలో తెలంగాణ ఆ ప్రగతి సాధించిందంటే నాకు ఎంత గౌరవం దొరుకుతదో అంతే సమానంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డికి కూడా లభిస్తుందని పేర్కొన్నారు. రాత్రిబవళ్లు తిరిగి కష్టపడ్డాడడని.. కొన్ని సందర్భాల్లో హెలికాప్టర్ ఇస్తానన్నా వద్దని రోడ్డమీదనే పోయాడని చెప్పారు. రాత్రింబవళ్లు కష్టపడితే ఈ రోజు ముఖం తెలివికి వచ్చినం అని అన్నారు. కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. తెలంగాణ అయితే మీకు తెలివి తక్కువని మాట్లాడిండడని.. పరిపాలన చేయరాదని, రాష్ట్రం చీమ్మచీకటి అయితదన్నడని గుర్తుచేశారు. వచ్చే జూన్ తర్వాత కాళేశ్వరం నీళ్లు.. వచ్చే జూన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు స్విచ్ఆన్ అవుతుందని.. సూర్యాపేటకు రెండు పంటలకు నీళ్లు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. గతంలో ఉన్నవాళ్లు సూర్యాపేట పట్టణ వాసులకు మూసీ మురికినీళ్లు తాగించారని, కానీ జగదీశ్రెడ్డి మిషన్ భగీరథతో స్వచ్ఛమైన నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన శుద్ధజలం ఇక్కడి వాసులకు అందిస్తున్నారని చెప్పారు. ఆటోనగర్, ఇండ్రస్టీయల్ పార్కును సూర్యాపేటకు తెచ్చిపెడతామని, సూర్యాపేటకు డ్రైపోర్టు వచ్చే అవకాశం ఉందన్నారు. మళ్లీ కారు గుర్తుకు ఓటేసి జగదీశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళ్లికప్రకాశ్, నాయకులు వర్దెల్లి శ్రీహరి, కాకి కృపాకర్రెడ్డి, గండూరి ప్రకాష్, కాకి దయాకర్రెడ్డి, శనగాని రాంబాబుగౌడ్, డాక్టర్ వూర రామ్మూర్తియాదవ్, నేరెళ్ల లక్ష్మి, నంద్యాల దయాకర్రెడ్డి, వూర గాయత్రి, పుట్ట కిషోర్, నాతి సవీందర్, నేరెళ్ల మధు, బైరు దుర్గయ్యగౌడ్, నర్సింహారెడ్డి, రాజా, రాములు, రంగారెడ్డి, భిక్షం, నాగిరెడ్డి, నర్సయ్యయాదవ్, ఉప్పల ఆనంద్, లచ్చిరాంనాయక్, శ్రీనివాస్గౌడ్, నాగిరెడ్డి, వన జ, ఇంద్రసేనారావు, రమేష్, ఉపేందర్రావు, షేక్ తాహేర్పాషా, కిరణ్, నర్సింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ : జగదీశ్రెడ్డి అన్ని సంక్షేమ పథకాల అమలుతో నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటిస్థానంలో కొనసాగుతుందంటే అది కేసీఆర్ ఘనతేనని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. 58 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ సూర్యాపేటను కూడా సిద్దిపేటతో సమానంగా అభివృద్ధి చేస్తానని.. ఇక్కడ జగదీశ్రెడ్డిని శాసనసభ్యుడిగా చేస్తే.. అనుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు సూర్యాపేటకు వచ్చిన సందర్భంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని సూర్యాపేటను తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దేలా సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అధ్వానంగా ఉన్న రోడ్లకు రూ.500 కోట్లకు పైగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశామని, రూ.75 కోట్లతో గ్రామీణ అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. రూ. 3,800 కోట్లు తెచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని.. ఇది కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమైందన్నారు. నాయకుడు కాదు.. సేవకుడు : ఎంపీ బడుగుల తాళ్లగడ్డ/దురాజ్పల్లి (సూర్యాపేట) : జగదీశ్రెడ్డి నాయకుడు కాదు.. ప్రజా సేవకుడు అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ప్రస్తుతం సూర్యాపేట ప్రజలు గుండెమీద చెయ్యి వేసుకుని నిద్రపోతున్నారంటే అది టీఆర్ఎస్, మంత్రి జగదీశ్రెడ్డి పాలనలోనే అని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్నగర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఎంపీ బడుగుల మాట్లాడారు. జిల్లా ఏర్పాటు దగ్గర నుంచి జిల్లాలో నూతన కలెక్టరేట్ నిర్మాణం, మినీ ట్యాంక్బండ్, మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, మెడికల్ కళాశాల నిర్మాణాలు జరుగుతున్నాయంటే అది కేవలం జగదీశ్రెడ్డి వల్లే అని చెప్పారు. -
రాజకీయంగా ఎదిగేందుకు ప్రోత్సాహం
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవులు రాజకీయంగా ఎదగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహం అందించిందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట, పెన్పహాడ్ మండలాల్లోని కేసారం, నారాయణగూడెం, కాసరబాద గ్రామాలకు చెందిన వివిధపార్టీల నాయకులు, కార్యకర్తలు మంగళవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడారు. గత పాలకుల వల్ల కానీ విధంగా యాదవులను గుర్తించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మొండికత్తి వెంకటేశ్వర్లు, సంకరమద్ది రమణారెడ్డి, సైదులు, మండలి కృష్ణ, అచ్చాలు పాల్గొన్నారు. అభివృద్ధే.. మంత్రిని గెలిపిస్తుంది నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని గెలిపిస్తాయని మంత్రి సతీమణి గుంటకండ్ల సునీతజగదీశ్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 2వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళికతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గండూరి పావని, వూర గాయత్రి, సల్మా, రాచూరి రమణ, కరుణ, శనగాని అంజమ్మ, అన్నపూర్న, వెంకటమ్మ పాల్గొన్నారు. విజయాంజనేయస్వామి ఆలయంలో పూజలు మంత్రి జగదీశ్రెడ్డిభారీ మెజారిటీతో గెలుపొందాలని కోరుతూ 7వ వార్డులో విజయాంజనేయస్వామి దేవాలయంలో ఆ వార్డు అధ్యక్షుడు కొండపెల్లి దిలీప్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణ, దాసరికిరణ్, మాధవి, చంద్రకళ, సైదులు, వెంకటేష్ పాల్గొన్నారు. భారీ మెజారిటీతో గెలవడం ఖాయం.. మంత్రి జగదీశ్రెడ్డిని గెలిపించాలని కోరుతూ 8వ వార్డులో కౌన్సిలర్ నిమ్మల వెంకన్న ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆయన వెంట రామకృష్ణ, సతీష్, సత్యనారాయణ, సత్యం, వెంకటేష్, రాజేష్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిక సూర్యాపేటరూరల్ : మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో అలకుంట్ల లింగయ్య, శివరాత్రి యాదగిరి, రూపాని పెద్ద మల్లయ్య, సతీష్, నర్సింహా, గుర్రం వెంకటేశ్వర్లు, వెంకటేశ్, శేఖర్తో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్, వంగాల శ్రీనువాస్రెడ్డి, రామసాని శ్రీనువాస్నాయుడు, మామిడి తిరుమల్, నరేష్, మోతీలాల్, తదితరులు పాల్గొన్నారు. చివ్వెంల : టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారంగుంపుల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో నెమ్మాది భిక్షం, ఊట్కూరి సైదులు, నారాయణ రెడ్డి పగడాల లింగయ్య, ఎసోబ్, నాతాల శేఖర్రెడ్డి, కోలా శ్రీనివాస్, నాగయ్య, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ రెడ్డి మధు పాల్గొన్నారు. ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి పెన్పహాడ్ : ఈ నెల 23న సూర్యాపేటలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం అనంతారం క్రాస్ రోడ్డు వద్ద విలేకర్లతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య పద్మ, జెడ్పీటీసీ పిన్నెని కోటేశ్వర్రావు, నర్సింహ్మరెడ్డి, వెంకటేశ్వర్లు, భిక్షం, ఇంద్రసేనారావు, సీతారాంరెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణ, శ్రీనివాస్, కర్ణాకర్రెడ్డి పాల్గొన్నారు. -
గురుకులాల్లోని పార్ట్టైం టీచర్ల వేతనాలు రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, కళాశాల పార్ట్టైం ఉద్యోగుల వేతనాలు రెట్టింపయ్యాయి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీతోపాటు మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకులాల సొసైటీ పరిధిలోని గురుకులాల్లో పనిచేస్తున్న 7 కేటగిరీలకు చెందిన 935 మంది పార్ట్టైం ఉద్యోగుల వేతనాలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గురుకుల టీచర్ల సమస్యలపై ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జి. జగదీశ్రెడ్డితో చర్చల అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ స్టాఫ్ సొసైటీ నేతలు కె. వెంకటరెడ్డి, ఎ.వి. రంగారెడ్డి, అర్జున, ప్రమోద్కుమార్ తెలిపా రు. సర్కారు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement