-
ట్రెజరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు సిద్ధం
- రాష్ట్రవ్యాప్తంగా 436 పెండింగ్ పోస్టులను భర్తీచేయాలి - ఉన్న ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం - విలేకర్ల సమావేశంలో ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ ఒంగోలు టూటౌన్: రాష్ట్రంలో ట్రెజరీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రెండు నెలల్లో పరిష్కరించకపోతే ఆందోళనలకు వెనుకాడేదిలేదని ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికుమార్ హెచ్చరించారు. సంంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనటానికి జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రెజరీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా నేటికీ చర్యలు తీసుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రాష్ట్రమొత్తం మీద అన్ని జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 436 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న ఉద్యోగులకు పనిభారం ఎక్కువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఒక్కొక్క ట్రెజరీ కార్యాలయంలో 14 అటెండర్ పోస్టులకుగాను కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజ్కుమార్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పార్ట్టైం మసాల్జీలు(చిన్న ఉద్యోగులు)అతితక్కువ వేతనంతో పనిచేస్తూ ఆర్ధిక ఇబ్బందులు పడుతుంటే నేటికీ కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. కనీస వేతనం రోజుకి రూ.300 ఇవ్వాలని చట్టం చెబుతున్నా దానిని అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహధ్యక్షులు గురుమూర్తి, ఉపాధ్యక్షుడు టీవీ రవీంద్ర, రాష్ట్ర కోశాధికారి హరికుమార్, వెస్ట్ గోదావరి అధ్యక్షుడు డి.కృష్టంరాజు, ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కె అహ్మద్, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మూడు ఈఎస్ఐ వైద్యశాలల ఏర్పాటు
మార్కాపురం(ప్రకాశం జిల్లా): త్వరలో రాష్ట్రంలో ఈఎస్ఐ వైద్యశాలలను విజయనగరం, గుంటూరు, కాకినాడల్లో ఏర్పాటు చేస్తున్నామని ఈఎస్ఐ వైద్యశాలల జాయింట్ డైరెక్టర్ జి.రవికుమార్ తెలిపారు. స్థానిక ఈఎస్ఐ వైద్యశాలను మంగళవారం తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విజయనగరంలో 200 పడకలు, కాకినాడ, గుంటూరుల్లో వంద పడకల వైద్యశాలలు కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఏపీలో 75 ఈఎస్ఐ వైద్యశాలలున్నాయని, వీటిల్లో 50 వైద్యశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, రెవెన్యూ అధికారులు స్థలాలు కేటాయిస్తే వెంటనే భవనాలు నిర్మించుకుంటామని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో డయాగ్నోసిస్ సెంటర్లు ఉన్నాయని, 10 పడకలు మాత్రమే ఇక్కడ ఉంటాయన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలలో ప్రాంతీయ వైద్యశాలలు ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 10 మంది సభ్యులకు గాను ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉంటారని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement