-
ఇంటింటా కన్నీరు
ఉన్న ఇళ్లు పీకేసుకున్నాం.. కొత్త ఇళ్లకు దిక్కులేదు.. రేషన్ కార్డు లేదు, పింఛను తొలగించేశారు గడప గడపలో సమస్యల చిట్టా సౌకర్యాలు మాట దేవుడెరుగు కనీసం ఉండటానికి గూడు కూడా ఇవ్వని సర్కార్ తీరుపై జనం ఆగ్రహంతో ఉన్నారు. పాత ఇళ్లు పీకేసుకుని ఎదురుచూస్తుంటే, కొత్త ఇళ్లు ఇవ్వకపోవడంతో బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. జిల్లాలో 11 నియోజకవర్గాల్లో జరిగిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ఇళ్లు లేక, ప్రభుత్వం రుణాలు మంజూరు చేయక ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు ఏకరవుపెట్టారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడ ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో పక్కా గృహాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో పూరిల్లే దిక్కయ్యాయని పట్టపగలు మధు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట మండలం గుర్రప్పాలెంలో ఇళ్లకు రుణాలు ఇస్తామని చెప్పి కాళ్లరిగేలా తిప్పుకున్నా, తాటాకింటిలో అవస్థలు తప్పడం లేదని పాలిశెట్టి భవాని చెప్పారు. అర్హత కలిగినా పింఛను ఇవ్వడం లేదని తాడిపూడి సింహాచలం పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ హుకుంపేట, బొమ్మూరులో ఆధార్, రేషన్, పింఛను వీటిలో ఏ ఒక్కటి ఇవ్వలేదని హుకుంపేట వరలక్ష్మికాలనీకి చెందిన పచ్చిపులుసు సత్యవతి అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా, ఇల్లు ఇవ్వలేదని, రేషన్కార్డు లేదని నల్లగుంట్ల రూప వాపోయింది. వర్షం వస్తే రోడ్లు మునిగిపోతున్నాయని పామర్తి గోవిందు, బొమ్మూరు నవభారత్నగర్లో ఖాళీ స్థలాలతో దోమలు పెరిగిపోయాయని ఎన్.చంటి తెలిపాడు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని ఎ.లక్ష్మణరావు చెప్పాడు. కల్లుగీత కార్మికుడి కంటతడి మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం నేలటూరులో కార్పొరేషన్ల రుణాలు అధికార పార్టీ వారికే కట్టబెట్టుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. కల్లుగీత కార్మికునిగా గుర్తింపు కార్డు ఉన్నా ప్రయోజనం లేదని చోడేlశ్రీనివాస్ కంటతడిపెట్టాడు. ఇప్పనపాడులో వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెయినేజీలు లేక అపరిశుభ్రత తాండవిస్తోందని, దోమల బెడద అధికంగా ఉందని కాలనీలో లాజరు గోడు వెళ్లగక్కాడు. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం పంచాయతీ శివారు కిత్తమూరుపేటలో మహానేత వైఎస్ హయాంలో ఇచ్చిన పింఛన్లను ఇప్పుడు తొలగించారని గ్రామస్తులు మొరబెట్టుకున్నారు. చాలా మంది పింఛన్లుlతొలగించారని తమడాల వెంకాయమ్మ బావురుమంది. రెండేళ్లుగా అడుగుతున్నా రోడ్లు వేయలేదని మోడేజు రాజేశ్వరి గ్రామస్తుల సమస్యను ఏకరవుపెట్టింది. వైఎస్ హయాంలో రూ.200 పింఛను ఇచ్చేవారని, కాలు, చేయి పనిచేయదని వైద్యుల సర్టిఫికెట్ ఉన్నా పింఛను మాత్రం ఇవ్వడం లేదని మాడేం కాసులమ్మ కన్నీరుమున్నీరైంది. రైతుల అవస్థలు పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం క్రాపలో పకృతి వైపరీత్యాలతో నష్టపోయి 200 ఎకరాల్లో గత్యతరం లేక పంట విరామం ప్రకటించామని పలువురు రైతులు వివరించారు. పకృతి వైపరీత్యాల వల్ల ఏటా పంట నష్టపోతున్నా, పరిహారం అందడం లేదని రైతు ఎం.సూర్యభాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్దాపురం నియోజకవర్గం కట్టమూరులో మంత్రి చేతులతో రుణమాఫీ పత్రం తీసుకున్నా, ఇప్పటికీ మాఫీ కాలేదని పెద్ది నాగేశ్వరరావు అనే రైతు ఘొల్లుమన్నాడు. భర్త చనిపోయి రెండేళ్లయినా, ఇప్పటివరకూ వింతంతు పింఛను ఇవ్వలేదని గోనాతి సూర్యావతి కంటతడిపెట్టింది. మహిళలు కన్నీటిపర్యంతం అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడిలో వికలాంగ పింఛను రావటం లేదని జాలెం సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశాడు. హౌసింగ్ రుణం ఇవ్వలేదని పడమటి గోపాలరావు, డ్వాక్రా రుణమాఫీ కాలేదని పి.గంగామణి వాపోయారు. పిఠాపురం పట్టణం రథాలపేటలో డ్రెయినేజీలు అస్తవ్యస్థంగా మారాయని కొత్తపల్లి బేబీ తెలిపింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం రాజేంద్రనగర్లో రేషన్కార్డు ఇచ్చారు కానీ, స్లిప్లు ఇవ్వకపోవడంతో రేషన్ ఇవ్వడం లేదని పరుచూరి నూకరత్నం ఆవేదన వ్యక్తం చేసింది. రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయలేదని కుండా భద్రావతి కన్నీటిపర్యంతమైంది. -
ప్రజలే తిరగబడేరోజులు వస్తాయి
– చంద్రబాబు సీయం అయితే కరువు కాటకాలే – గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమంలో పీఏసీ చైర్మన బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అంబాపురం (బేతంచెర్ల): రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, ప్రజలే ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం గడపగడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని అంబాపురంలో మద్దిలేటిస్వామి ఆలయ మాజీ చైర్మన్ బాలీశ్వర్రెడ్డి, గ్రామ సర్పంచ్ యాదగిరి వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్రెడ్డితో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తన మాటల గారడితో ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిన చంద్రబాబు, తరువాత ఇచ్చిన హామీలను మరిచాడన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం కరువు కాటకాలేనని విమర్శించారు. అప్పులు పుట్టక రైతుల అవస్థలు... రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకులో అప్పులు పుట్టక రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితులు దాపురించాయన్నారు. నిరుద్యోగభతి, రైతు, పొదుపు రుణాలు, మహిళలకు సెలఫోన్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, 60 సంవత్సరాలు నిండిన వారికి వద్ధాప్య ఫించన్ ఇస్తామని హామీఇచ్చి విస్మరించారన్నారు. ప్రస్తుతం ప్రజా సాధికార సర్వే పేరుతో సంక్షేమ పథకాలకు తూట్లు పొడవమే కాకుండా, బ్రతకడానికి ద్విచక్రవాహనం తెచ్చుకున్నా.. సంక్షేమ పథకాలు నిలిపివేసే ప్రమాదం నెలకొందన్నారు. 100 హామీలో ఏ ఒక్కటీ నేరవేర్చలేని అబద్దాల సీఎం చంద్రబాబు అని అన్నారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడి, మోసపూరిత హామీలను వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయలేదని, లేకుంటే ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి అయ్యేవాడన్నారు. కావున పాలక పక్షంపై ఎదురు తిరిగేందుకు ప్రజలను చైతన్యం చేసేందుకు గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమానికి ఆయా కాలనీల్లో అనూహ్య స్పందన లభించింది. కాలనీల్లోని మహిళలు, యువకులు నాయకులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా కమిటీ సభ్యుడు మూర్తుజావలి, బాబుల్రెడ్డి, ఖాజా హుసేన్, రామంచంద్రుడు, నాగేశ్వరరావు, నక్కరవి, ఎద్దులన్న తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement