-
మోసాలను ఎండగడితే తట్టుకోలేకున్నారు
రాయదుర్గం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ప్రజలు ఎత్తి చూపుతుంటే టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం రాయదుర్గం పట్టణంలోని 18వవార్డులో నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గడప గడపకూ వైఎస్సార్ జరిగిన ప్రతి చోటా విశేష ఆదరణ వస్తోందన్నారు. దీంతో భయం చుట్టుకున్న అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా అన్యాయం చేశారని ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. -
వైఎస్సార్ సీపీ పరిశీలకుల నియామకం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ నియోజకవర్గాల పరిశీలకులుగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన లో తెలిపింది. పరిశీలకులుగా నియమితులైన నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని ఆధ్వర్యంలో పనిచేస్తారని పేర్కొంది. నియోజకవర్గం పరిశీలకుని పేరు ఏలూరు మాజేటి సురేష్కుమార్ దెందులూరు ముప్పిడి సంపత్కుమార్ ఉంగుటూరు గంటా ప్రసాదరావు పోలవరం గన్నమని జనార్దనరావు చింతలపూడి బండి పట్టాభి రామారావు (అబ్బులు) కొవ్వూరు పోతుల రామతిరుపతి రెడ్డి గోపాలపురం పోల్నాటి శ్రీనివాస్ బాబు (బాబ్జి) నిడదవోలు ఊదరగొండి చంద్రమౌళి తణుకు మేడపాటి చంద్రమౌళీశ్వర్రెడ్డి తాడేపల్లిగూడెం చెలికాని రాజమోహనరావు (రాజాబాబు) ఆచంట రుద్రరాజు బాల సూర్యనారాయణరాజు (పీడీ రాజు) నరసాపురం చెల్లెం ఆనందప్రకాష్ పాలకొల్లు బలగం సేతుబంధన సీతారామ్ భీమవరం నడపన చినసత్యనారాయణ ఉండి వి.సూర్యనారాయణరాజు (కనకరాజు సూరి) -
‘ఉత్తుత్తి హామీలతో వంచించారు’
పెనుకొండ రూరల్ : చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ వంచనలేనని గోనిపేట గ్రామస్తులు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ వద్ద వాపోయారు. శుక్రవారం మండలంలోని గోనిపేట గ్రామంలో శంకరనారాయణ గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ‘ప్రభాకర్ అనే మతి స్థిమితం లేని వ్యక్తికి గతంలో రూ. 200 పింఛన్ వచ్చేది. టీడీపీ అధికారంలోకి రాగానే అతనికి పింఛన్ తొలగించార’ని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా పింఛన్లు, పక్కాగృహాలు, ఇంటికో ఉద్యోగం, డ్వాక్రా రుణాలు తదితర సమస్యలను గ్రామస్తులు ఏకరవు పెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్రెడ్డి, అనితాశ్రీనివాసరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరుబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు గాలికి
విడపనకల్లు: ప్రజాసమస్యల ను గాలికి వదిలే సి కృష్ణా పుష్కరాల పేరిట హంగు, ఆర్భాటాలకు మాత్ర మే ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విడపనకల్లులో విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రుణమాఫీ చేయకుండా మభ్యపెడుతున్నారంటూ ప్రభుత్వ తీరుపై రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు మండిపడుతున్నారన్నారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. ఎంతో మంది పత్తి రైతులు నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి నష్ట పోయినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇంత వరకు ఒక్క నిరుపేదకు కూడా పక్కాగృహం నిర్మించి ఇవ్వలేదని ప్రభుత్వానికి చురకలంటించారు. -
పేదలపై కనికరం లేని ప్రభుత్వం
గడప గడపకూ వైఎస్సార్లో తండావాసుల ఆవేదన పుట్టపర్తి అర్బన్: పింఛన్లు, రేషన్ సరుకులు అందక పేదల బతుకులు భారమైనా ఈ కనికరం లేని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నగరపంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండాకు చెందిన శాంతాబాయి, నారాయణమ్మ బాయి, సోనీబాయి, లకే్ష్మనాయక్ తదితరులు పుట్టపర్తి నియోజకవర్గ సమన్వకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఎదుట వాపోయారు. ఆదివారం నగర ‡పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండా,బ్రాహ్మణపల్లి గ్రామాల్లో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఇంటింటి వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తండాకు చెందిన శాంతమ్మ బాయి తన సమస్యను వివరిస్తూ తన కొడుకులందరూ ఉపాధి కోసం వలస పోయారని, ఎవరూ దిక్కులేని తనకు పింఛన్ ఇవ్వడం లేదని వాపోయింది. దరఖాస్తు చేసుకుని అలసిపోయానని, నాయకులు కూడా తనపై కనికరం చూపలేదన్నారు తండాలో అపరిశుభ్రత వల్ల రోగాలు ప్రబలుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. అర్హతలు ఉన్నా రుణమాఫీ దక్కలేదని, డ్వాక్రా రుణాలు కూడా మాఫీ కాలేదని ఈ ప్రభుత్వాన్ని నమ్మి పూర్తిగా మోసపోయామని బ్రాహ్మణపల్లికి చెందిన పలువురు రైతులు, మహిళలు శ్రీధర్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ హరికృష్ణ, పుట్టపర్తి మండల, పట్టణ, కొత్తచెరువు కన్వీనర్లు గంగాద్రి, మాధవరెడ్డి, జగన్మోహన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, నాయకులు లింగాల భాస్కర్రెడ్డి, సాయిరాంరెడ్డి, సోము, గంగాద్రి, బాబుల్రెడ్డి, మనోహర్రెడ్డి, దాదాపీరా, రా>మస్వామినాయక్, కిషోర్నాయక్, రాజేష్నాయక్, సాయినాథ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement