-
ఎస్ఐపై గల్లా అనుచరుల దాడి
►నలుగురు యువకుల బరితెగింపు ►రాజీ కోసం తీవ్రంగా కృషిచేసిన సీఐ ►ఇన్స్పెక్టర్ తీరుపై రగిలిపోతున్న పోలీసులు తిరుచానూరు: తిరుచానూరు ఎస్ఐపై బుధవారం రాత్రి గల్లా అరుణకుమారి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ రామాంజనేయులు రాత్రి సింధూ జంక్షన్ వైపు వెళుతుండగా నలుగురు యువకులు ఓ ఆటో డ్రైవర్తో గొడవ పడుతుండ డాన్ని గమనించి వారిని వారించే యత్నం చేశారు. ఆ యువకులకు, ఎస్ఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్ఐ ఓ యువకుడిపై చేయి చేసుకోవడంతో ఆ నలుగురు కలసి ఎస్ఐపై దాడిచేసి పారిపోయారు. వారు టీడీపీకి చెందిన సునీల్, అతని అనుచరులని అక్కడున్నవారు తెలిపారు. ఎస్ఐ స్టేషన్కు వచ్చి సీఐకి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారు అధికార పార్టీకి చెందినవారు కావడంతో ‘‘ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా చూడాలి. నువ్వు కొత్తగా వచ్చావు. అధికార పార్టీ నాయకులను చూసీ చూడనట్టు వ్యవహరించాలి’’ అని సీఐ సలహా ఇచ్చారు. దీంతో ఎస్ఐ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. సాక్షాత్తూ ఎస్ఐపై దాడిచేస్తే కేసు నమోదు చేయకుండా రాజీ యత్నం చేయడంతో సీఐపై పోలీసులు రగిలిపోతున్నారు. ఎస్పీ అయినా స్పందించాలని కోరుతున్నారు. -
‘గల్లా’కు భూ నజరానా!
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన, ప్రధానమైన ప్రాంతంలో ఉన్న భూమిని కారుచౌకగా ధారాదత్తం చేసింది. కడప-తిరుపతి రహదారిలోని కరకంబాడిలో దాదాపు రూ.43.38 కోట్ల విలువైన భూమిని రూ.4.88 కోట్లకే మంగల్ ఇండస్ట్రీస్కు కట్టబెట్టింది. ఈ మేరకు ఎకరా రూ.22.50 లక్షల ధరతో 21.69 ఎకరాలను మంగల్ ఇండస్ట్రీస్కు కేటాయించినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు. కరకంబాడి ప్రాంతం దాదాపుగా తిరుపతి నగరంలో కలసిపోయింది. రేణిగుంట విమానాశ్రయానికి, తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లకు, తిరుపతి బస్టాండుకు, మంగళం బస్సు డిపోకు చాలా దగ్గరగా ఉండి బాగా అభివృద్ధి చెందుతున్న కరకంబాడి ప్రాంతంలో భూమి దొరకడమే కష్టం. ఇంత కీలకమైన ప్రాంతంలో కనిష్టంగా లెక్కేసుకున్నా బహిరంగ మార్కెట్లో ఎకరా విలువ రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్ల వరకూ ఉంటుందని అధికార వర్గాల అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం మంగల్ ఇండస్ట్రీస్కు ఎకరా రూ.22.50 లక్షలకే కట్టబెట్టడం గమనార్హం. ఎన్నికల్లో చేసిన సాయానికి...: రాష్ట్రం విడిపోయేవరకూ కాంగ్రెస్లో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తన కుమారుడు గల్లా జయదేవ్ను గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీకి దించడంద్వారా రాజకీయ అరంగేట్రం చేయించారు. ఆమెకు చంద్రగిరి అసెంబ్లీ టికెట్, కుమారుడికి గుంటూరు లోక్సభ టికెట్ ఖరారు చేసినందుకు ప్రతిగా ఎన్నికల ఖర్చులకోసం పార్టీకి ‘గల్లా’ ఇండస్ట్రీస్ గ్రూపు భారీగానే సొమ్ము ముట్టజెప్పిందని పార్టీ వర్గాలంటున్నాయి. ‘కీలకమైన ఎన్నికల్లో పార్టీకి సాయం చేసినందుకు నజరానాగా ఇప్పుడు విలువైన భూమిని కారుచౌకగా మంగల్ ఇండస్ట్రీస్కు కేటాయించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేవలం నెలన్నర రోజు ల్లోనే భూకేటాయింపుల ప్రక్రియను పూర్తిచేసి ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీచేసింది’ అని టీడీపీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించడం గమనించాల్సిన అంశం. కేవలం 42 రోజుల్లో...: కేవలం 42 రోజుల్లోనే ఈ భూకేటాయింపుల ప్రక్రియ పూర్తవడాన్నిబట్టే ఫైలు ఎంత శరవేగంగా కదిలిందో అర్థమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 21న చిత్తూరు జిల్లా కలెక్టర్ మంగల్ ఇండస్ట్రీస్కు భూ కేటాయింపులకోసం ఫైలు పంపించారు. అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ(ఏపీఎల్ఎంఏ) దాన్ని ఆమోదించింది. అక్కడినుంచి ఆగమేఘాలపై రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ మంత్రి, సీఎం ఆమోదం పొందిన ఈ ఫైలు ఈ నెల 2న రాష్ట్ర మంత్రివర్గ ఎజెండాలో చేరిపోయింది. మంగల్ ఇండస్ట్రీస్కు భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు రెవెన్యూశాఖ జీవో ఇచ్చింది. ‘‘భూకేటాయింపులకోసం వందలాది ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోతుంటాయి. అయితే ఇది అధికారపక్షానికి చెందిన కీలక నేతకు సంబంధించింది కావడంతో రాకెట్ వేగంతో వెళ్లి కేవలం 42 రోజుల్లోనే కేబినెట్ ఆమోదం పొందింది’’ అని రెవెన్యూశాఖకు చెందిన కిందిస్థాయి అధికారి ఒకరు అన్నారు. మంత్రిగా ఉండగా సాధ్యం కాని పని.. గల్లా అరుణకుమారి గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విలువైన భూమిపై కన్నేశారు. పారిశ్రామిక అవసరాలు సాకుగా చూపించి దీన్ని కైవసం చేసుకోవాలని అప్పట్లోనే ఆమె నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ నుంచి 2009 అక్టోబర్ 22వ తేదీనే భూ కేటాయింపులకోసం ప్రతిపాదన తెప్పించుకున్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న కె.రోశయ్య, తదుపరి సీఎంగా వచ్చిన ఎన్.కిరణ్కుమార్రెడ్డి ఈ భూకేటాయింపునకు మౌఖికంగా అంగీకరించలేదు. దీంతో ఈ ప్రతిపాదన రెవెన్యూశాఖలో పక్కన పడిపోయింది. టీడీపీ అధికారంలోకి రా వడంతో మళ్లీ కలెక్టర్ నుంచి ఈ భూమికోసం ప్రతిపాదన తెప్పించుకున్న ‘గల్లా’.. సీఎంతో మాట్లాడి ఆగమేఘాలపై ఫైలు నడిపించి ఓకే చేయించారు. -
అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం
♦ ఫ్లెక్సీల ఏర్పాటు పేరుతో పచ్చనేతల బరితెగింపు ♦ ఆటో డ్రైవర్లపై దాడి, స్టేషన్లో ఫిర్యాదు పాకాల : ఆటోస్టాండ్లో ఫ్లెక్సీ ఏర్పాటుకు అడ్డు చెప్పారన్న అక్కసుతో ఆటో డ్రైవర్లపై టీడీపీ ఛోటా నాయకులు దాడికి పాల్పడ్డారు. మాకే అడ్డు చెబుతారా అంటూ విచక్షణా రహితంగా డ్రైవర్లపై పిడిగుద్దులు కురిపించారు. అక్కడితో వదలకుండా ఆటోస్టాండ్ను జేసీబీతో ధ్వంసం చేశారు. నేరుగా పోలీస్టేషన్కు వెళ్లి బాధితులైన ఆటోడ్రైవర్లపైనే ఫిర్యాదు చేసిన సంఘటన పాకాలలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు... పాకాల పట్టణం రైల్వే స్టేషన్ సమీపం, చిత్తూరు సర్కిల్లో శ్రీ వరసిద్ధి వినాయక ఆటోస్టాండ్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పాకాలకు వస్తున్నారు. దీంతో ఆమెకు స్వాగతం పలికేందుకు ఆటోస్టాండ్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు బుధవారం సాయంత్రం ప్రయత్నించారు. అయితే ఇక్కడ వినాయక చవితికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కొద్దిగా జరిపి ఫ్లెక్సీలు పెట్టుకోవాలని టీడీపీ నాయకులకు ఆటోడ్రైవర్లు వేడుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నాయకులు ఆటోడ్రైవ ర్లు నాగూర్పై దాడికి దిగారు. బాధితులు తమపై దాడి చేసిన టీడీపీకి చెందిన నాగరాజ నాయుడు, కిషోర్,హర్ష, రమేష్,సాయి, రావిళ్ల మోహన్లపై పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కూడా బాధిత ఆటోడ్రైవర్లు నాగూర్, కపిల్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. సానుభూతి పరులు కావడం వల్లే దాడులు... ఆటోస్టాండ్ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేశారన్న విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నంగా బాబు రెడ్డి పోలీస్టేషన్కు చేరుకుని బాధితులకు అండగా నిలి చారు. తమ పార్టీకి ఆటోస్టాండ్ నాయకులు సానుభూతి పరులుగా మారడాన్ని జీర్ణించుకోలేక పోయిన టీడీపీ నాయకులు ఫ్లెక్సీల పేరుతో దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. 40 కుటుంబాలకు చెందిన పేదలు ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటే వారిపై దాడికి దిగడం దారుణం అన్నారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పాకాల సీఐ చల్లని దొర తెలిపారు. -
లాబీయింగ్ చేస్తేనే టీడీపీలో పదవులు
గల్లా అరుణ సంచలన వ్యాఖ్య చిత్తూరు: కష్టపడి పనిచేయకుండా.. షో చూపించి హైదరాబాద్ స్థాయిలో లాబీయింగ్ చేసుకున్న వారికే తెలుగుదేశం పార్టీలో పదవులు దక్కుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు గల్లా అరుణకుమారి వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పదవులు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో మంగళవారం జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఆమె మాట్లాడుతూ.. పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పనిచేసే కార్యకర్తలకు పదవులు ఇచ్చేలా చూడాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కోరారు. -
చిత్తూరు షుగర్స్పై సీఎం రమేష్ కన్ను?
లీజు కోసం కదులుతున్న పావులు పోటీ పడుతున్న మాజీ మంత్రి 15 నాటికి అధ్యయన కమిటీ రిపోర్ట్ ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మికులు చిత్తూరు: చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని లీజు పేరుతో దక్కించుకునేందుకు ఎంపీ సీఎం రమేష్ పావులు కదుపుతున్నట్లు అధికార పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సైతం పోటీపడుతున్నట్లు సంకేతాలున్నాయి. మొత్తంగా ఇద్దరు నేతలు చిత్తూరు చక్కెర కర్మాగారం కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇరువురు నేతలు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల మద్దతు కోసం తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధ్యయన కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాతనే ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టాలా? లేక లీజుకు అప్పగించాలా ? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. ఎలాగైనా * 800 కోట్ల విలువైన ఫ్యాక్టరీని దక్కించుకొనేందుకు ఇటు ఎంపీ అటు మాజీ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చారిత్రక చిత్తూరు షుగర్స్లో ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేశారు. ఈ కర్మాగారం పరిధిలో 16 నెలలుగా 400 మంది కార్మికులకు ప్రభుత్వం జీతాలు చెల్లించకపోగా మూడేళ్లుగా చెరుకు రైతులకు సైతం కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించాల్సి వుంది. బకాయిలు చెల్లించి చక్కెర కర్మాగారాన్ని నడిపిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తరువాత మంగళం పాడారు. ఫ్యాక్టరీని తన అనుచరుల పరం చేసేందుకు బాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి చాపకింద నీరులా పావులు కదుపుతోంది. ఇందులో భాగం గా చక్కెర కర్మాగాల నిర్వహణపై అధ్యయన కమిటీ అంటూ ఐదుగురు ప్రైవేటు వ్యక్తులతో కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కర్మాగారాలపై నిర్ణయం తీసుకుంటామంటూ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నాటికి అధ్యయన కమిటీ నివేదిక రానున్నట్లు సమాచారం. 2002లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు *18 కోట్లకు చక్కెర కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టారు. అప్పట్లో రైతులు, కార్మికులు కోర్టుకు వెళ్లి ఫ్యాక్టరీని దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అధికారం చేపట్టిన బాబు తన హయాంలోనే మరోసారి కర్మాగారాన్ని అమ్మకానికి పెడితే సొంతజిల్లా వాసుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లీజుకు అప్పగించడమే మేలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. చిత్తూరు కర్మాగారం పరిధిలో 84.5 ఎకరాల విలువైన స్థలం ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం మొత్తం స్థలాన్ని అమ్మితే * 800 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ స్క్రాప్ అమ్మితే రూ.10 కోట్లకు పైగా వస్తుంది. తొలుత లీజు పేరుపెట్టి ఆ తరువాత కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఫ్యాక్టరీని లీజుకు లేదా అమ్మకానికి పెట్టే పక్షంలో ఆందోళనలు ఉధృతం చేయడంతో పాటు మరో మారు కోర్టుకు వెళ్తామని కర్మాగారం కార్మికులు, శాంతియుత ఉద్యమనేత వెంకటాచలంనాయుడు హెచ్చరిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement