-
పాట్నా పేలుళ్ల బాధితులను పరామర్శించనున్న మోడీ
పాట్నా నగరంలో ఆదివారం చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడిన వారిని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ శనివారం పరామర్శించనున్నారని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ బుధవారం ఇక్కడ వెల్లడించారు. అందుకోసం శనివారం ఉదయం నరేంద్ర మోడీ పాట్నా చేరుకుంటారని చెప్పారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శిస్తారని తెలిపారు. అలాగే ఆ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలను మోడీ కలుస్తారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో హూంకార్ ర్యాలీ నిర్వహంచారు. ఆ ర్యాలీకి కొన్ని గంటల ముందు పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు సంభవించింది. అనంతరం గాంధీ మైదాన్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లలో ఆరుగురు మరణించారు. 82 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ బాంబు పేలుళ్లపై ఇప్పటివరకు ఎన్ఐఏ అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. -
పాట్నాలో మరో రెండు బాంబులు వెలికితీత!
పాట్నాలోని గాంధీ మైదానంలో మరో రెండు బాంబులను మంగళవారం పోలీసులు నిర్వీర్యం చేశారు. సంఘటనా స్థలాన్ని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సందర్శించి.. పేలుడు ప్రదేశాన్ని పరిశీలించారు. గోస్వామి సంఘటనా స్థలానికి వెళ్లడానికి రెండు గంటల ముందు రెండు బాంబులను పోలీసులు కనుగొన్నారు. తొలి బాంబును గాంధీ మైదానానికి 50 మీటర్ల దూరంలోని ఎస్కే మోమోరియల్ హాల్ వద్ద, రెండవ బాంబును గాంధీ మైదానంలోనే పోలీసులు నిర్వీర్యం చేశారు. గాంధీ మైదానంలో ఇంకొన్ని బాంబులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎలాంటి వస్తువులైనా.. అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇప్పటి వరకు పోలీసులు మొత్తం ఆరు బాంబులు గాంధీ మైదానం వద్ద కనుగొన్నారు. ఆదివారం గాంధీ మైదానంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ హుంకార్ ర్యాలీని నిర్వహించిన సమయంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లకు కారణమని అనుమానిస్తున్న మహమ్మద్ ఇంతియాజ్ అన్సారీని పాట్నాలోని జుడిషియల్ కస్టడీకి తరలించగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
పాట్నా గాంధీ మైదాన్లో మరో బాంబు
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ఈ రోజు ఉదయం మరో బాంబును కనుగొన్నట్లు నగర పోలీసు ఉన్నతాధికారి మను మహారాజ్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. దాంతో బాంబును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు, బాంబు నిర్వీర్య దళం హుటాహుటిన గాంధీ మైదానం చేరుకుని, ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు చర్యలు చేపట్టారని వివరించారు. అందులోభాగంగా ఆ సమీపంలోని ప్రజలను నివాసాల నుంచి ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం గాంధీ మైదాన్లో పాదచారులు నడుస్తున్న సమయంలో ఆ బాంబును కనుగొని, పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమైనట్లు తెలిపారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్లో హూంకార్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ ప్రారంభానికి కొన్ని గంటల ముందు పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 8 మంది మరణించారు. మరో 82 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆ వరుస బాంబు పేలుళ్ల వెనక ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
నాడు సుభాష్ చంద్రబోస్, జేపీ, జిన్నా.. నేడు మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో పాల్గొన్న హూంకార్ ర్యాలీ వేదిక గాంధీ మైదాన్కు చారిత్రక నేపథ్యముంది. ఇదే వేదికపై గతంలో పలు ముఖ్యమైన ర్యాలీలు నిర్వహించారు. స్వాతంత్రోద్యమ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నోరాజకీయ మార్పులకు వేదికగా నిలిచింది. సుభాష్ చంద్రబోస్, మహ్మద్ అలీ జిన్నా, జయప్రకాశ్ నారాయణ్ వంటి మహానీయులు ఇదే వేదికపై నుంచి ప్రసంగించారు. తాజాగా గాంధీ మైదాన్లో లక్షలాది మంది పాల్గొన్న ర్యాలీలో మోడీ ఉద్వేగ ప్రసంగంతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. సభ ఆరంభానికి కొన్ని గంటల ముందు బాంబు పేలుళ్లు జరిగినా ర్యాలీ దిగ్విజయంగా ముగిసింది. రాజకీయంగా తనను తీవ్రంగా వ్యతిరేకించే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోటలో మోడీ తొలి బహిరంగ సభ విజయవంతమైంది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement