-
కాంగ్రెస్లో చేరనున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరగనున్నాయి. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్, నిజామాబాద్ మాజీ మేయర్, ఎంపీ డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, భూపాలపల్లి జిల్లా బీజేపీ నేత గండ్ర సత్యనారాయణలు త్వరలోనే కాంగ్రెస్లో చేరనున్నారు. మంగళవారం ఉదయం ఈ ముగ్గురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాము త్వరలోనే కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రకటించారు. కొండాతో రేవంత్ ఏకాంత చర్చలు రేవంత్రెడ్డి మంగళవారం చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో భేటీ అయ్యారు. కొండా నివాసానికి వెళ్లిన రేవంత్ ఏకాంతంగా సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. కొండా రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీకేనని, పార్టీ సిద్ధాంతాలకు కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలోకి రావొచ్చునన్నారు. విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావాలని అటు పార్టీలో, ఇటు బయట చాలా కొట్లాడానని చెప్పారు. ఆయన పీసీసీ అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతాననేది త్వరలోనే చెబుతానని కొండా అన్నారు. కాంగ్రెస్లో అందరికీ న్యాయం: రేవంత్ కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మున్నూరుకాపు, ముదిరాజ్, వెలమ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు నేతలు తమ పార్టీలోకి రావడం సంతోషదాయకమన్నారు. ఇతర పార్టీల నేతలు చాలామంది టచ్లోకి వస్తున్నారని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని తెలిపారు. -
ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థి.. వేలు నరుక్కున్న వీరాభిమాని
సాక్షి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో తాను ఎంతగానో అభిమానించే నేత ఓటమిపాలవ్వడం, మిగతా పార్టీకి చెందిన వారు హేళనగా మాట్లాడటం భరించలేక ఓ యువకుడు వేలు నరుక్కున్నాడు. ఈ సంఘటన చిట్యాల మండలంలోని జెడల్ పేట గ్రామం భీష్మానగర్లో చోటుచేసుకుంది. భూపాలపల్లి నియోజవర్గంలో గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 69,918 ఓట్లు సాధించి గెలుపొందారు. గండ్ర సత్యనారాయణ(సత్తన్న) ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున( టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా) పోటీ చేసి 54,283 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి 53,567 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే చిట్ల మల్లేష్ అనే యువకుడు గండ్ర సత్యనారాయణ వీరభిమాని. సత్తన్న మీద అభిమానంతో మల్లేష్ బుధవారం టీషర్టు వేసుకుని తిరుగుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎగతాళి చేశారు. ఇంకా సత్తన్న టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నావా అంటూ హేళనగా మాట్లాడారు. దీంతో గ్రామస్తులందరూ చూస్తుండగానే సత్తన్న కోసం ప్రాణం అయినా ఇస్తా అంటూ గొడ్డలితో వేలునరుక్కున్నాడు. -
నమ్మించి మోసం చేశారు: గండ్ర
సాక్షి, భూపాలపల్లి: ‘‘రెండు పర్యాయాలు విజయం ముంగిట్లో ఓడిపోయా.. టికెట్ ఇస్తారనే భరోసాతో టీఆర్ఎస్లో చేరా.. నన్ను నమ్మించి గొంతుకోశారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా’’అని జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ అసంతృప్తనేత గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. టీఆర్ఎస్లో చేరి దాదాపు 10 నెలలైందని తెలిపారు. గడిచిన రాజ్యసభ ఎన్నికల్లో భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేను రాజ్యసభకు నామినేట్ చేస్తామని, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారని వాపోయారు. రెండు సార్లు కేటీఆర్, ఒకసారి కేసీఆర్ టికెట్పై హామీ ఇవ్వడంతో టీఆర్ఎస్లో చేరానని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజలు మద్దతు ఇస్తున్నారని, ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తానన్న విశ్వాసం వ్యక్తం చేశారు. -
టీటీడీపీకి దెబ్బ మీద దెబ్బ
సాక్షి, భూపాలపల్లి: తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న కాంగ్రెస్ గూటికి పలువురు నేతలు చేరగా.. ప్రస్తుతం కారు ఎక్కేందుకు పలువురు సిద్దమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవికి గండ్ర సత్యనారాయణ రావు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపినట్టు సత్యనారాయణ తెలిపారు. కాగా బుధవారం గండ్ర టీఆర్ఎస్లో చేరనున్నారు. గండ్ర సత్యనారాయణ గత 30 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్నారు. సర్పంచ్, జెడ్పీటీసీ గా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజక వర్గం నుంచి టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. అంతే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు కూడా వలసల బాట పడుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పేర్యాల (కిమ్స్) రవీందర్రావు, మంథని నియోజకవర్గ ఇన్చార్జి కర్రు నాగయ్య టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవలే రేవంత్రెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు కాంగ్రెస్తో చేయి కలిపిన విషయం తెలిసిందే. -
టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా సాంబయ్య
వరంగల్ : తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన హన్మకొండ సాంబయ్యను నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా సాంబయ్యతో 73 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శులుగా ఓరం సమ్మయ్య(భూపాలపల్లి), చంటి సిద్దులు(జనగామ), వడ్డేపల్లి కృష్ణ(నర్సంపేట), ఉపాధ్యక్షులుగా భూపతి జనార్థన్(ములుగు), సంపభీష్మ(మహబూబాబాద్), మాడ కొండయ్య(నర్సంపేట), బిర్రు అనిల్కుమార్(స్టేన్ ఘ), బరిగెల ఏలియా(వరధన్నపేట), సింగారపు దేవేందర్రాజు(వరంగల్ తూర్పు), ప్రచార కార్యదర్ళులుగా చింతల బుచ్చయ్య, ఎ.లక్ష్మయ్య, మల్లెపాక సాయిలు(వర్థన్నపేట), అ«ధికార ప్రతినిధులుగా పులి యాకయ్య, మునిగాల వెంకన్న, కందుకూరి ప్రభాకర్, కోశాధికారిగా ర త్న మల్లేష్ను నియమించామని తెలిపారు. ఇంకా కమిటీలో 15మంది కార్యనిర్వాహక కార్యదర్శులును, 22మంది కార్యదర్శులను, 19మందిని కార్యవర్గ సభ్యులుగా నియమించామని సత్యనారాయణరావు వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement