-
రైలు ఢీకొని గ్యాంగ్మన్ మృతి
యలమంచిలి : రైలు గేటు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని ఆదివారం రైల్వే గ్యాంగ్మన్ మృత్యవాత పడ్డాడు. యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్దపల్లి రైల్వేగేటు వద్ద గేటు వేసి ఉన్న సమయంలో పట్టాలు దాటుతుండగా రామ్నగర్కు చెందిన రైల్వే ఉద్యోగి ఎం.నాగేష్ (32)రైలు ఢీకొని మృతిచెందాడు. మృతుడు యలమంచిలి రైల్వేస్టేషన్ పరిధిలో గ్యాంగ్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఇతను సెలవులో ఉన్నట్టు మృతుడి బందువులు తెలిపారు. ఆదివారం రామ్నగర్లోని తన ఇంటి నుంచి మిలట్రీ కాలనీలోని బంధువుల ఇంటికి బయలుదేరిన నాగేష్ గేటు వేసి ఉన్న సమయంలో రైలుపట్టాలు దాటుండగా ప్రమాదానికి గురయ్యాడు. అప్లైన్లో వచ్చిన రైలును చూసి దానిని తప్పించుకునే సమయంలో డౌన్లైనులో వచ్చే మరో రైలు ఢీకొంది. దీంతో నాగేష్ మృతదేహం నుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడికి రెండేళ్లక్రితం వివాహమైంది. ఒక బాబు ఉన్నాడని బంధువులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంధువులు శోకసంద్రంలో మునిగారు. శవపంచనామా అనంతరం మృదేహాన్ని మృతుడి స్వగ్రామం అయిన రేగుపాలెం గ్రామానికి తరలించారు. తుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెచ్సీ మూర్తి తెలిపారు. -
పట్టా.. ఫట్ ఫట్
గుంతకల్లు : శీతాకాలం వస్తుందంటే రైల్వే శాఖలో వణుకు పుడుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టడంతో వెల్డింగ్ చేసిన చోట రైలు కమ్మీలు విరిగిపోతుంటారుు. మధ్యలో చిన్న పాటి క్రాక్ మొదలై.. ఎక్కువ బరువు ఉన్న వ్యాగన్లు నెమ్మదిగా వెళ్లిన తర్వాత కమ్మీ విరిగిపోతోంది. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు గ్యాంగ్మెన్లు గమనించి లోపాలను సరిదిద్ది ప్రమాదాలు జరగకుండా నివారిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లరేగడి, చెరువుల సమీపంలో ఉన్న ట్రాక్ల వద్ద ఈ సమస్య అధికంగా ఉంటుంది. వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల మధ్య రైలు కమ్మీలు చలి తీవ్రతకు బ్రేక్ అవుతుంటాయి. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పని చేస్తుంటారు. రైల్వే లోకో సిబ్బంది (రైళ్ల డ్రైవర్లు, సహ డ్రైవర్లు) అప్రమత్తంగా లేకపోతే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. లోకో రన్నింగ్ సిబ్బంది ఏమాత్రం అజాగ్రత్త వహించినా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం తథ్యం. గుంతకల్లు డివిజన్ మొత్తం మీద 1354.27 కిలోమీటర్ల రైలు మార్గం విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని పర్యవేక్షించడానికి డివిజన్ పరిధిలో 23 ఇంజనీరింగ్ డిపోలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. అయినప్పటికీ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత ఐదేళ్లలో వేలాది మంది పదవీ విరమణ చేశారు. ఖాళీ పోస్టుల భర్తీ మాత్రం అంతంత మాత్రమే. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 6,031 పోస్టులు ఉండాల్సి ఉంది. డివిజన్ వ్యాప్తంగా చూస్తే 5,034 మంది మాత్రమే పని చేస్తున్నారు. 997పోస్టులు ఖాళీ ఉన్నాయని అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. అసలే సిబ్బంది కొరత ఉన్న ఇంజనీరింగ్ విభాగంలో కొందరు సిబ్బంది గ్యాంగ్ల్లో పని చేయడం చేతకాక అధికారుల నివాస గృహాల్లో ఇంటి పనులు చేస్తూ సర్వీస్ను కొనసాగిస్తున్నారు. ఇలా డివిజన్ మొత్తం మీద 200 మంది ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పైస్థాయి అధికారుల గృహాల్లో పని చేస్తున్నట్లు సమాచారం. దురదృష్టవశాత్తు రైలు ప్రమాదాలు సంభవిస్తే ఎవరూ బాధ్యత తీసుకోరని సీనియర్ పర్యవేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షిస్తూ పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తూ రైలు ప్రమాదాలు నివారించాలంటే రైల్వేబోర్డు నిబంధనల ప్రకారం తగినంత సిబ్బందిని నియమించాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement