-
తెలుగమ్మాయికి గేట్స్ కేంబ్రిడ్జి స్కాలర్షిప్
లండన్: ప్రతిష్టాత్మక గేట్స్ కేంబ్రిడ్జి స్కాలర్షిప్–2017కుగాను తెలుగు రాష్ట్రాలకు చెందిన అఖిల దెందులూరి ఎంపికయ్యారు. ఈమెతోపాటు భారత్ నుంచి మరో ఇద్దరు విద్యార్థులు సలోని అటల్(ముంబై), యైకోమ్బా ముతుమ్ (మణిపూర్)లు స్కాలర్షిప్కు ఎంపికైనట్లు కేంబ్రిడ్జి యూనివర్సిటి ప్రకటించింది. అఖిల హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో బయో మెడికల్ ఇంజనీరింగ్ (2009–11)లో డిగ్రీ విద్యను అభ్యసించారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మరో రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీని కొనసాగించారు. తర్వాత 2013–15 మధ్య ‘ది జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ’నుంచి బయో మెడికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుత స్కాలర్షిప్లో భాగంగా కెమిస్ట్రీలో పీహెచ్డీ విద్యను అభ్యసించనున్నట్లు ఆమె తెలిపారు. భారతదేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణకు దోహదపడేందుకు గాను సైకాలజీలో పీహెచ్డీ చేయ నున్నట్లు మరో విద్యార్థి సలోని అటల్ తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో విద్యనభ్యసించిన ముతుమ్ తన పీహెచ్డీలో భాగంగా బయోలాజికల్ సైన్స్ను అభ్యసిస్తానని చెప్పారు. ఈ ఉపకారవేతనానికి ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, మొత్తం 90 మందిని ఎంపిక చేసినట్లు వర్సిటీ పేర్కొంది. వీరందరికీ ఈ ఏడాది అక్టోబర్ తరగతులు ప్రారంభమవుతాయని వర్సిటీ తెలిపింది. -
భారతీయులకు గోల్డెన్ చాన్స్
ముగ్గురు భారతీయులకు బ్రహ్మాండమైన గోల్డెన్ చాన్స్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన విద్యావేత్తలు, సామాజికంగా నిబద్ధత కలిగిన 55 మందిని ఎంపిక చేసి వారికి ప్రతిష్ఠాత్మక గేట్స్ కేంబ్రిడ్జి స్కాలర్షిప్స్ ప్రకటించగా, ఆ జాబితాలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. సాగ్నిక్ దత్తా, సంపూర్ణ చక్రవర్తి, మాళవికా నాయర్.. ఈ ముగ్గురికీ ఆ స్కాలర్షిప్ లభించింది. 30 దేశాలకు చెందిన 55 మంది విజేతలు 68 యూనివర్సిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం విజేతల్లో 36 మంది మహిళలు కాగా, 19 మంది మాత్రమే పురుషులున్నారు. సాగ్నిక్ దత్తా ఆరేళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేసి ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కోల్కతాలో చదువుతున్నారు. ఆమె ఇప్పుడు ఈ స్కాలర్షిప్తో రాజకీయాలు, అంతర్జాతీయ పరిశోధనలో పీహెచ్డీ చేస్తారు. సంపూర్ణ చక్రవర్తి ఫార్మకాలజీలో పీహెచ్డీ చేయనున్నారు. ప్రధానంగా ఆర్థరైటిస్ నొప్పులకు మందు కనుక్కోవడంపై ఆమె దృష్టిపెడతారు. మెటీరియల్ సైన్స్, మెటలర్జీలలో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ చేసేంఉదకు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో మాళవికా నాయర్ చేరారు. ఈ స్కాలర్షిప్తో ఆమె మెటీరియల్స్ సైన్స్లో పీహెచ్డీ చేయనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement