-
గుజరాత్ టీమ్ కు భారీ నజరానా!
వడోదర: తొలిసారిగా రంజీ ట్రోఫీ సాధించిన తమ రాష్ట్ర క్రికెట్ జట్టుకు గుజరాత్ క్రికెట్ సంఘం(జీసీఏ) భారీ నజరానా ప్రకటించింది. పార్థివ్ పటేల్ నాయకత్వంలోని రంజీ జట్టుకు రూ. 3 కోట్ల నగదు ప్రోత్సాహ బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది. బీసీసీఐ రూ. 2 కోట్లకు ఇది అదనమని జీసీఏ ఉపాధ్యక్షుడు పరిమళ్ నాథ్వానీ తెలిపారు. ‘పార్థివ్ పటేల్ నేతృత్వంలోని గుజరాత్ జట్టు చారిత్రక విజయం సాధించి 66 ఏళ్ల తొలిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకుంద’ని ఆయన వ్యాఖ్యానించారు. ఇండోర్ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టును 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి గుజరాత్ రంజీ ట్రోఫీని తొలిసారిగా దక్కించుకుంది. పార్థివ్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 143 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. 42వ సారి ఈ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలనుకున్న ముంబై ఆశల మీద నీళ్లు చల్లాడు. జీసీఏ అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. గుజరాత్ క్రికెట్ టీమ్ కు అభినందనలు తెలిపారు. -
జీసీఏ అధ్యక్షునిపై బీసీసీఐ వేటు
న్యూఢిల్లీ:ఇటీవల అవినీతి ఆరోపణలపై అరెస్టైన గోవా క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) అధ్యక్షుడు చేతన్ దేశాయ్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) శనివారం సస్పెండ్ చేసింది. అతనితో పాటు జీసీఏ కార్యదర్శి వినోద్ ఫడ్కేను కూడా సస్పెండ్ చేసింది. బీసీసీఐ మార్కెటింగ్ కమిటీకి దేశాయ్ చైర్మన్ గా ఉండగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో మేనేజ్మెంట్ ప్యానెల్ లో ఫడ్కే సభ్యుడిగా ఉన్నారు. ఈ పదవుల నుంచి కూడా వారిని తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరుతూ వారికి బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2006-07లో బీసీసీఐ నుంచి వచ్చిన రూ. 3.13 కోట్ల చెక్కును నకిలీ అకౌంట్ ఖాతా సృష్టించి సొమ్ము చేసుకున్నారనేది వారిపై వెలుగుచూసిన ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణంలో భాగంగా ఇటీవల చేతన్ దేశాయ్, వినోద్ ఫడ్కేలతో పాటు, జీసీఏ ట్రెజరర్ అక్బర్ ముల్లాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
జగమెరిగిన వ్యూహకర్తకే మళ్లీ అందలం...!!
అవలోకనం బీజేపీ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నట్లు ప్రకటించాక, బాధ్యతలు స్వీకరించిన అమిత్షా తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు రోజుకు 500 కిలోమీటర్ల చొప్పున దేశమంతా పర్యటిస్తూ పార్టీని నిర్మిస్తూ, బలోపేతం చేస్తూ వచ్చారు. తన సొంత చొరవతో ఇలాంటి బృహత్తర పని బాధ్యతలు చేపట్టే వ్యక్తి కాంగ్రెస్లో ఉన్నారని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కాని అమిత్షా తన పనిలో అత్యంత నిలకడతనంతో కొనసాగుతున్నారు. అది 2009 సెప్టెంబర్ మాసం. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) అధ్యక్ష పదవికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసేందుకు అమిత్షా వెళుతున్నారు. కారులో ఆయనతోపాటు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ప్రయాణిస్తున్నారు. జీసీఏ వద్దకు చేరుకుంటుండగా మోదీ ఉన్నట్లుండి మనసు మార్చుకున్నారు. షాతో ఇలా చెప్పారు: ‘నహిన్ యార్ హూంజ్ బను’ (ఈ పదవి నేను తీసుకోవాలనుకుంటున్నాను). అలా చివరిక్షణంలో మోదీ జీసీఏ అధ్యక్షుడైపోయారు. ఇక నిత్య విశ్వసనీయుడైన షా దీంతో పెద్దగా గుంజాటన పడలేదు. షా వంటి వ్యక్తి కాంగ్రెస్కు లేడు మరి. షా విశ్వసనీయుడు, సమర్థుడు కూడా. మోదీకి ఆయనపట్ల ఎంత విశ్వాసమంటే యావత్పార్టీపై తనకు సర్వస్వతంత్ర అధికారం ఇచ్చేశారు. రాజకీయంగా బీజేపీలో ఇప్పుడు నంబర్-2 ఎవరంటే అమిత్ షానే. జనవరి 24న బీజేపీ అధ్యక్ష పదవికి అమిత్షా మరోసారి ఎన్నికయ్యారు. మరో మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఈ మూడేళ్ల కాలంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు వంటి పలు కీలక మైన రాష్ట్రాలు ఎన్నికలకు సమాయత్తం కానుండగా, షా బీజేపీకి అధ్యక్ష బాధ్యతలు వహించనున్నారు. దాదాపుగా ఈ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తన బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో దళితనేత కాన్షీరాం పేర్కొ న్నట్లుగా, ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ పురోగతి చెందుతుంది, విస్తరిస్తుంది కూడా. షాకు, బీజేపీకి ఎన్నికల పరంగా 2016 ఒక మంచి వార్తనే అందిస్తుందన్నది నా అభిప్రాయం. బీజేపీకీ 2015 అలాంటి మంచి సంవత్సరం కాలేదని మీడియా అభిప్రాయం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని తుడిచిపెట్టేసింది. ఇక బిహార్లో జనతాదళ్ చేతిలో అనూహ్యంగా భారీ మెజారిటీతో ఓడిపోయింది. ఇది షా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఉన్నా, దాన్ని బయటకు ప్రదర్శించలేదు. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓటు బ్యాంకును షా చెక్కు చెదరకుండా నిలిపారు. అరవింద్ కేజ్రీవాల్ అసాధారణ వ్యక్తిత్వం ముందు, మనకాలపు చురుకైన రాజకీయనేత మోదీతో కలసి అమిత్షా ఢిల్లీలో ఓడి పోయారు. ఇక బిహార్ విషయానికి వస్తే షాను ఓడించడానికి ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలసి పోరాడాల్సి వచ్చింది. చివరకు గుజరాత్లో కూడా, రిజర్వేషన్లపై పాటిదార్ కమ్యూనిటీ తిరుగుబాటు ద్వారా తనకు మంచి ఫలితాలు వస్తాయని ఆశించినప్పటికీ భారత్లోనే అత్యంత నగరీకరణ సాధించిన గుజరాత్లో ప్రతి ప్రధాన నగరంలోనూ బీజేపీయే పట్టు సాధించింది. అక్కడ ఇప్పటికీ బీజేపీకే అనుకూలత ఉంది. దీనికి కారణాల్లో అమిత్షా సమర్థత కూడా ఒకటి. షా అత్యంత సమర్థత కలిగిన కార్యదక్షుడు. క్షేత్రస్థాయి కార్యకర్త చుట్టూనే ఆయన తన వ్యూహాలను నిర్మించుకుంటారు. క్షేత్రస్థాయిలో ఆడిన అద్భుతమైన ఆట వల్లే బరాక్ ఒబామా 2008 నాటి డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి క్యాంపెయిన్లో విజయం సాధించారని విశ్లేషకులు చెప్పారు. అభ్యర్థి మేధోతనం కంటే అవలంబించిన వ్యూహరచన, చేపట్టిన కార్యక్రమాల చురుకుతనాన్నే ఇది ప్రధానంగా చూపిస్తుంది. అది కఠిన శ్రమ, ప్రణాళికల కలబోత. ఈ అంశంలో షా అతి సమర్థుడు. వ్యాపార రీత్యా ఆయనది జైన నేపథ్యం. భారీకాయం, సానుకూలమైన చూపులతో కనిపించే షా... గుజరాతీ తరహా మధ్యతరగతికి చెందిన హిందుత్వవాది. మోదీలాగా, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ తరహా వ్యక్తి కాదాయన. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్కి చెందిన ఏ వ్యక్తిని చూసినా కనిపించే అదే అంకితభావంతో ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. పైగా తనకున్న వ్యాపార నేపథ్యం.. విషయాలను స్పష్టతతోనూ, ఆచరణాత్మక దృష్టితోనూ చూడగల అనుకూలతను ఆయనకు కట్టబెట్టింది. బీజేపీ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నట్లు ప్రకటించాక, బాధ్యతలు స్వీకరించిన అమిత్షా తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు రోజుకు 500 కిలోమీటర్ల చొప్పున దేశమంతా పర్యటిస్తూ పార్టీని నిర్మిస్తూ, బలోపేతం చేస్తూ వచ్చారు. తన సొంత చొరవతో ఇలాంటి బృహత్తర పని బాధ్యతలు చేపట్టే వ్యక్తి కాంగ్రెస్లో ఉన్నారని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కాని అమిత్షా తన పనిలో అత్యంత నిలకడతనంతో కొనసాగుతున్నారు. కొన్ని నెలల క్రితం నేను అహ్మదాబాద్లో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యంగా భారీ కేంపెయన్ జరుగుతుండటం గమనించాను. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశాలు లేనప్పటికీ మిస్డ్ కాల్స్ ద్వారా పార్టీ సానుభూతిపరుల డేటా బేస్ను సేకరించే పనిలో అమిత్షా మునిగిపోవడం గమనించాను. దాదాపు 11 ఏళ్లపాటు నేను అహ్మదాబాద్లో పనిచేస్తున్నప్పుడు అమిత్ షాతో తరచుగా సంప్రదింపుల్లో ఉండే అవకాశం వచ్చింది. మీడియా అంటేనే అవిశ్వాసంతో చిరచిరలాడే వ్యక్తిత్వం ఆయనది. ఆయనను ఎప్పుడు కావా లంటే అప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి సాధించగల ఒకే ఒక జర్నలిస్టు ఎవరంటే, రెడిఫ్.కామ్, ఇండియన్ ఎక్స్ప్రెస్కి చెందిన షీలా భట్. జగడాలమారితనంతో అయినప్పటికీ అత్యంత సహనంతో షాతో ఆమె చేసే ఇంటర్వూ ్యలు పాఠకలోకాన్ని వెలిగించేవి. ఆమె గుజరాతీలో మాట్లాడేవారు కాబట్టే ఆమెకు మాత్రమే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అనుమతించే వారని నా అనుమానం. షాను అత్యంత సానుకూలంగా, సుఖంగా ఉంచే భాష గుజరాతీయే మరి. షా పార్టీ బాధ్యతలను దృఢంగా నిర్వహిస్తుండటంతో, ఎల్కే అద్వానీ వంటి అసమ్మతివాదులు ఎన్నికల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. మోదీకి తన ఎన్నికల వ్యూహాన్ని రూపకల్పన చేయడం, ఆచరణలో పెట్టడం అమిత్షా వల్లే సాధ్యమైంది. ఈ ఇద్దరి భాగస్వామ్యం సమర్థవంతమైందీ, అర్థవంతమైనది కూడా. అద్వానీ, వాజ్పేయీ మాదిరిగా కాకుండా, ఇప్పుడు బీజేపీలో నంబర్ వన్ ఎవరనే విషయంలో అత్యంత స్పష్టత ఏర్పడింది. రాజ్యసభలో మోదీకి మెజారిటీ సాధించిపెట్టేందుకు 2016లో జరగనున్న భారీ ఎన్నికలను అమిత్షా ఎలా ఎదుర్కుంటారన్నది ఉత్కంఠభరితమైన విషయం. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కథను వల్లించడం ద్వారా నేను ఈ కథనం మొదలెట్టాను. దాంతోనే ముగిస్తాను. ఆనాడు కారులో ప్రయాణిస్తూ జీసీఏ అధ్యక్ష పదవిపై ఆకాంక్షను వెలిబుచ్చిన మోదీ అయిదేళ్ల తర్వాత అంటే 2014లో భారత ప్రధాని అయ్యారు. వెంటనే జీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చారు. మరి ఇప్పుడు జీసీఏ కొత్త అధ్యక్షుడెవరంటారా? ఇంకెవరు? అమిత్ షాయే. ఆకార్ పటేల్, వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement