-
సీసీఐ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
సీసీఐ గోడౌన్లో అగ్నిప్రమాదం
వేటపాలెం (ప్రకాశం జిల్లా) : సీసీఐ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి కోట్ల విలువైన పత్తిబేళ్లు దగ్ధమైన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. మొత్తం ఆరు పెద్ద గోడౌన్లలో కాటన్ కార్పొరేషన్కు చెందిన 93 వేల పత్తి బేళ్లు నిల్వ ఉంచారు. ఒకటో నంబర్ గోడౌన్లో మూడు బ్లాకుల్లో దాదాపు 15 వేల పత్తిబేళ్లు నిల్వ ఉంచారు. ఒకటో నంబరు బ్లాకులో నిప్పు అంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది. ఒకటో నంబరు బ్లాకులో నిల్వ ఉంచిన ఐదు వేల పత్తిబేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వీటి విలువ కోట్లు ఉంటుందని గోడౌన్ ఇన్చార్జ్ గిరీష్పాల్ తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. చీరాల, బాపట్ల నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలు అదుపు చేస్తున్నాయి. జేసీ హరిజవహర్లాల్, తహశీల్దార్ కె.ఎల్.మహేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్ ప్రభాకరరావు, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి అగ్నిప్రమాదానికి కారణాలను గోడౌను ఇన్చార్జిని అడిగి తెలుకున్నారు. ప్రమాదంపై పలు అనుమానాలు... ఈ ఏడాది మేనెల 7వ తేదీన సీసీఐ 6వ నంబర్ గోడౌన్లో రెండు బ్లాకుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో రెండు బ్లాకుల్లో నిల్వ ఉంచిన 11 వేల పత్తి బేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీనిపై ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోడౌనుల్లో నిల్వ ఉంచిన పత్తి బేళ్లను వారం రోజులుగా లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. శనివారం ఆరు గోడౌనుల్లో నుంచి 12 వేల పత్తి బేళ్లను తరలించారు. ఒకటో నంబర్ గోడౌను రెండవ బ్లాకులోని 2 వేల పత్తి బేళ్లను రెండు లారీల ద్వారా తరలించారు. ఇంకా దాదాపు పది లారీలు గోడౌను వద్ద వచ్చి ఉన్నాయి. ఆదివారం కావడంతో కూలీలు రాక బేళ్ల తరలింపు ఆపివేశారు. ముందురోజు భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం ఒకటో నంబర్ గోడౌనులో నిప్పు అంటుకొని అగ్నిప్రమాదం సంభవించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిల్వ ఉంచిన గోడౌనుల్లో ఎటువంటి విద్యుత్ సరఫరా లేదు. షార్టు సర్క్యూట్ అయ్యే, గోడౌనులోకి నిప్పురవ్వలు వ్యాపించే అవకాశాలు లేవు. అయితే పత్తి బేళ్లకు నిప్పు ఏవిధంగా అంటుకుందో తెలియాల్సి ఉంది. ఎవరైనా కావాలని చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement