-
General Motors: 1,245 ఉద్యోగాల తొలగింపును రద్దు చేసిన ప్రఖ్యాత సంస్థ
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధభయాలు, అనిశ్చితి వాతావరణంలో కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ప్రధానంగా ఉద్యోగుల జీతభత్యాలు కంపెనీలకు భారంగా మారుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా జనరల్ మోటార్స్ సంస్థ 1245 ఉద్యోగాల తొలగింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్రెజిల్ దేశంలోని సావో పాలో రాష్ట్రంలో ఉన్న సావో జోస్ డోస్ క్యాంపస్, సావో కేటానో డో సుల్, మోగి దాస్ క్రూజెస్లోని ఫ్యాక్టరీల్లో జనరల్ మోటార్స్ 1,245 ఉద్యోగుల తొలగింపును రద్దు చేయనున్నట్లు అక్కడి కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ ఇటీవల తెలిపింది. ముందుగా కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అందుకు విరుద్ధంగా కార్మికులు బ్రెజిలియన్ లేబర్ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఉద్యోగుల తొలగింపును కొనసాగించడానికి అనుమతి కోసం సంస్థ సైతం కోర్టుకెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విచారించిన కోర్టు..కంపెనీ అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో మరుసటి రోజు జనరల్మోటార్స్ ఈ ప్రకటన చేసింది. ఇదీ చదవండి: ఎలాన్మస్క్ కుమారుడికి ఇండియన్ సైంటిస్ట్ పేరు జనరల్ మోటార్స్ అమెరికాకు చెందిన వాహన తయారీ సంస్థ. కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని మిచిగాన్లో ఉంది. జనరల్ మోటార్స్ చెవ్రొలెట్, జీఎంసీ, కాడిలాక్, బ్యూక్ తో సహా పలు ప్రసిద్ధ ఆటోమొబైల్ బ్రాండ్లను తయారుచేస్తుంది. 2022 నాటికి జనరల్ మోటార్స్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,67,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2016లో కంపెనీ ఉద్యోగులు 2,25,000 మంది ఉండేవారు. -
హ్యుందాయ్ చేతికి జీఎం ప్లాంట్.. కొత్త వ్యూహాలు సిద్ధం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఇండియా.. మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న జనరల్ మోటార్స్ (జీఎం) ఇండియాకు చెందిన తాలేగావ్ ప్లాంటును కొనుగోలు చేయనుంది. డీల్ పూర్తయితే స్థలం, భవనాలు, యంత్రాలు హ్యుందాయ్ పరం కానున్నాయి. ఇందుకోసం జీఎం ఇండియాతో టెర్మ్ షీట్ ఒప్పందం చేసుకున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ సోమవారం ప్రకటించింది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ప్లాంటు చేతికి వచ్చిన తర్వాత తొలుత వెన్యూ ఎస్యూవీని ఈ కేంద్రంలో తయారు చేసి ఎగుమతి చేయాలన్నది హ్యుందాయ్ ఆలోచన. 2028 నాటికి భారత్లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 6 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. చెన్నై సమీపంలోని శ్రీపెరుంబుదూరు వద్ద ఉన్న హ్యుందాయ్ ప్లాంటు దాదాపు పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. భారత్తోపాటు విదేశాల నుంచి కంపెనీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అదనపు తయారీ సామర్థ్యం ఇప్పుడు సంస్థకు తప్పనిసరి. -
జనరల్ మోటార్స్ వాహనాల ధరలూ పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: వాహన కంపెనీలన్నీ కార్ల ధరల పెంపులో నిమగ్నమయ్యాయి. టయోటా, నిస్సాన్, రెనో, టాటా మోటార్స్, మెర్సిడెస్, హ్యుందాయ్ ఇలా కంపెనీలన్నీ ఇప్పటికే వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించేశాయి. ఇప్పుడు జనరల్ మోటార్స్ ఇండియా కూడా వీటి సరసన చేరింది. ఇది తాజాగా జనవరి 1 నుంచి వాహన ధరలను దాదాపు రూ.30,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫారెక్స్ రేట్లలో ఒడిదుడుకులు, ముడిపదార్థాల ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయం ఎగయడం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. -
షెవర్లే క్రూజ్ వెహికల్స్ భారీ రీకాల్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ ఇండియా దేశంలో భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనుంది. ప్రీమియం సెడాన్ మోడల్ షెవర్లే క్రూజ్ (పెట్రోల్) 22 వేల వాహనాలను రీకాల్ చేయనుంది. ఇగ్నిషన్ సిస్టం లో లోపాల కారణంగా 2009-11 మధ్య ఉత్పత్తి అయిన ఈ మోడళ్లను వెనక్కి తీసుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈలోపంకారంగా వాహనం వేగం తగ్గుతోందని, ఈ లోపాన్ని సవరించే ఉద్దేశంతో వీటిని రీకాల్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా ఈ రీపేర్ సర్వీసులను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించింది. తక్కువ వాహనం వేగం, ఇగ్నిషన్ , ఇంజిన్ లోపాన్ని పరిష్కరించడానికి ఈ రీకాల్ చేపడుతుందని జనరల్ మోటార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తనిఖీకి లేదా మరమ్మతుకు ఒక్క కంటే ఎక్కువ పమయం పట్టదనీ తాము అంచనావేస్తున్నామని తెలిపింది. వినియోగదారులు సమీపంలో తమ డీలర్ ను సంప్రదించాలని కోరింది. వాహన భద్రతపై ఎలాంటి ప్రభావితం లేనప్పటికీ, ఇదొక స్వచ్ఛంద రీకాల్ అనీ, తమ వినియోగదారుల అనుభవాలను నిర్ధారించుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జనరల్ మోటార్స్ భారతదేశం వైస్ ప్రెసిడెంట్ - మార్కస్ స్టెర్ బర్గ్ తెలిపారు. కాగా 2013లో దాదాపు 1.14 షెవర్లే తవేరా యూనిట్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే -
క్రూజ్ ధర తగ్గించిన జనరల్ మోటార్స్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటార్స్ ఇండియా తాజాగా షెవర్లే క్రూజ్ కొత్త వెర్షన్ ధరను రూ.86,000 వరకు తగ్గించింది. క్రూజ్ మోడల్ అమ్మకాలను పెంచడమే లక్ష్యంగా కంపెనీ ఈ చర్య తీసుకుంది. కంపెనీ క్రూజ్ కొత్త వెర్షన్ను జనవరి 30న మార్కెట్లో విడుదల చేసింది. అప్పుడు దీని ధర రూ.14.68 లక్షలు-రూ.17.81 లక్షల శ్రేణిలో ఉంది. ఇప్పుడు ధర రూ.13.95 లక్షలు-రూ.16.95 లక్షల శ్రేణిలో ఉంది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి. క్రూజ్ ఎల్టీ ఎంటీ వేరియంట్ ధర రూ.73,000 తగ్గుదలతో రూ.14.68 లక్షల నుంచి రూ.13.95 లక్షలకు, క్రూజ్ ఎల్టీజెడ్ ఎంటీ వేరియంట్ ధర రూ.80,000 తగ్గుదలతో 16.75 లక్షల నుంచి రూ.15.95 లక్షలకు చేరనున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement