-
కార్మిక సంఘాల ధర్నా
మందమర్రి: మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట వారసత్వ ఉద్యోగాల కోసం జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. విలేకరులతో తమ్మినేని మాట్లాడుతూ..అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర కేసీఆర్దేనన్నారు. అక్రమ అరెస్ట్లు సమ్మెను ఆపలేవన్నారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తే ప్రభుత్వానికే నష్టమన్నారు. ధర్నాలో పాల్గొన్న తమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. -
జీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష
శ్రీరాంపూర్, న్యూస్లైన్ : కార్మికుల డిమాండ్ల సాధనలో భాగంగా మంగళవారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన రెండ్రోజుల నిరాహార దీక్షను ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లపై దశలవారీగా పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. మూడో దశలో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల్లో మ్యాచింగ్ గ్రాంట్ కోతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. గ్రాట్యూటీపై రూ.10లక్షలు సీలింగ్ ఎత్తివేయాలని, ప్రతి సంవత్సరం 15 రోజుల వేతనం బదులు నెల వేతనాన్ని గ్రాట్యూటీగా చెల్లించాలని, ఐటీ పరిధిని రూ.6లక్షలకు, రిటైర్డ్ కార్మికుల పింఛన్ను 25 నుంచి 40 శాతానికి పెంచాలని, మెడికల్ అన్ఫిట్, చనిపోయిన కార్మికుల పిల్లలకు ఫాస్ట్ట్రాక్ ద్వారా డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. దీక్షలో సెంట్రల్ కార్యదర్శి వంగ రాజేశ్వర్రావు, ఆర్కే 5 బ్రాంచీ కార్యదర్శి ఎల్.శ్రీనివాస్, నాయకులు కాంపెల్లి నర్సయ్య, దేవేందర్, సారేందర్, అశోక్, వీరమల్లు, సంఘం సదానందం, జడల పోశం కూర్చున్నారు. యూనియన్ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.వీరభద్రయ్య, కార్యదర్శి మంద మల్లారెడ్డి, బ్రాంచీల కార్యదర్శులు కొట్టె కిషన్రావు(ఆర్కే7), ఎస్కే బాజీసైదా(ఎస్సార్పీ) పాల్గొన్నారు. మందమర్రిలో... మందమర్రి : సింగరేణిలో అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట రిలే దీక్ష చేపట్టారు. సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్ నాయకులకు పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలమైందని అన్నారు. దీక్షలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి.భానుదాస్, బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి, భీమనాథుని సుదర్శన్, సోమిశెట్టి రాజేశం, ఇప్పకాయల లింగయ్య, అంకతి సాయిలు, ఒడ్నాల శంకర్, హైమద్ అలీ, సంజీవ్ కూర్చున్నారు. -
వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి
కోల్బెల్ట్, న్యూస్లైన్ : వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సం ఘం టీబీజీకేఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నాయకు లు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జీఎం నాగభూషణరెడ్డికి వినతి పత్రం అందజేశా రు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ మాట్లాడు తూ జాతీయ సంఘాలు పోగొట్టిన వారస త్వ ఉద్యోగ హక్కును సాధించే వరకూ ఆందోళనలను విరమించేది లేదన్నారు. కార్యక్రమంలో మండ సంపత్, మనోజ్కుమార్, బి.చందర్రావ్, ఎన్.రాజయ్య, నర్సింగరావ్, మహేందర్, మల్లేష్, కొడెపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement