-
పిక్టో‘రియల్’లో దిట్ట సోమరాజు
సాక్షి, కరప (కాకినాడ రూరల్): చేసే వృత్తి ఏదైనా ఏకాగ్రత, పట్టుదలతో పనిచేస్తే రాణించవచ్చని అనాదిగా నిరూపణ అవుతూనే ఉంది. గురు ముఖతా కొందరు, జిజ్ఞాసతో కొందరు కొన్ని సాధన చేసి సాధిస్తారు. అటువంటి వారిలో అభీష్టం కొద్దీ ఫొటోలు తీయడం ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు మండలంలోని గొర్రిపూడి గ్రామానికి చెందిన మేరేటి సోమరాజు. చేనేత కార్మిక కుటుంబానికి చెంది మగ్గం పట్టాల్సిన చేతులు కెమెరా పట్టి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. స్వయంకృషికి తోడు కుటుంబ సభ్యుల ప్రోద్బలం, స్నేహితుల ప్రోత్సాహంతో 2016లో అమెరికా వారి నుంచి రెండు, రాష్ట్రం నుంచి మరొకటి పురస్కారాలు గెలుచుకుని పిక్టోరియల్ ఫొటోగ్రఫీలో సత్తా చాటుకున్నారు సోమరాజు. 2017లో తెనాలి శ్రీఅజంతా కళారామం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరో జాతీయస్థాయి పోటీల్లో ఫొటోగ్రఫీ విభాగంలో ద్వితీయ బహుమతి గెలుపొందారు. 2019లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మత్స్యకారుల జీవనవిధానంపై తీసిన చిత్రం జాతీయస్థాయిలో నాలుగు పురస్కారాలు దక్కించుకున్నారు. సొంతూరు గొర్రిపూడి గ్రామమైన కాజులూరు మండలం గొల్లపాలెంలో కాకినాడలోని సర్పవరం వద్ద గాయత్రీ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న సోమరాజు తన ప్రస్థానాన్ని తెలియజేస్తూ.. గొర్రిపూడి గ్రామానికి చెందిన మేరేటి రామారావు, లక్ష్మీకాంతం తన తల్లిదండ్రులని తెలిపారు. కాకినాడలో ఐటీఐ వరకు చదివానని, ఆ సమయంలోనే యషికా కెమెరాతో సరదాగా ఫొటోలు తీసేవాడినని తెలిపారు. 1996లో తల్లిదండ్రులు వివాహం చేయడంతో చేనేతవృత్తిలో స్థిరపడడం ఇష్టంలేక జీవనోపాధి కోసం గొల్లపాలెంలో ఫొటో స్టూడియో పెట్టానని, ప్రస్తుతం సర్పవరం జంక్షన్వద్ద ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నానని తెలిపారు. స్నేహితులు తుమ్మల వీరభద్రరావు (కాకినాడ), వడ్డాది సూర్యప్రకాశరావు (వెల్ల)లకు ఫొటోగ్రఫీలో అవార్డులు రావడంతో వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి నుంచి మెళకువలు తెలుసుకుని సాధన చేశారు సోమరాజు. మొదటిసారి స్నేహితులతో కలసి 2015 మేనెలలో విశాఖ జిల్లా అరకు వెళ్లినప్పుడు అక్కడ గిరిజనుల జీవనశైలిపై ఫొటోలు తీశానని, అదే యేడాది అక్టోబరులో, 2016 జనవరిలో అరకు, ఛత్తీస్గఢ్ సరిహద్దు వరకు వెళ్లి గిరిజనుల జీవనశైలిపై ఫొటోలు తీసి స్నేహితుల ద్వారా అమెరికా, లండన్, ఫ్రాన్స్లకు పంపినట్టు తెలిపారు. అంతర్జాతీయ పురస్కారాల ఎంపిక ఇలా.. ఏటా బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ (లండన్), ఫొటో సొసైటీ ఆఫ్ అమెరికా (అమెరికా), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీలా ఆర్ట్స్ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్)లతో పాటు ఇమేజ్కాలేజ్ సొసైటీ ఆఫ్ అమెరికా సంస్థలు ఉత్తమ ఫొటోగ్రాఫర్లను గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తుంటారు. 2017లో ఆ పోటీలకు అంతర్జాతీయంగా అనేక దేశాలు పోటీపడగా గిరిజన జీవనశైలిపై తాను తీసిన ఛాయాచిత్రాలకు అత్యున్నత పురస్కారం లభించిందని అన్నారు. అమెరికాకు చెందిన ఇమేజ్ కాలేజ్ సొసైటీ చైర్మన్ టోని లికిస్తాన్ న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఈ పోటీల్లో తనను పురస్కారానికి ఎంపిక చేయడమే కాకుండా సొసైటీలో జీవితకాల సభ్యత్వం ఇచ్చారన్నారు. ఈ అవార్డులను ఆ సంస్థలు విజయవాడలోని ప్రతినిధులకు పంపించగా 2016 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ ఫొటో అకాడమీ నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ చేతులమీదుగా అందుకున్నట్టు తెలిపారు. అలాగే 2017లో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతికశాఖ సాఫల్య పురస్కారం (అచీవ్మెంట్ అవార్డు) అందజేసినట్టు ఆయన చెప్పారు. 2017లో జాతీయస్థాయిలో ద్వితీయ బహుమతి: తెనాలిలోని శ్రీఅజంతా కళారామం ఏటా పెయింటింగ్, క్రాఫ్ట్వర్క్, ఫొటోగ్రఫీ విభాగాల్లో జాతీయస్ధాయిలో పోటీలునిర్వహిస్తుంటారు. ఫొటో గ్రఫీ విభాగంలో ‘గో టు ఫీల్డ్’ ఛాయాచిత్రానికి ద్వితీయ బహుమతి లభించింది. గిరిజనులు మేకలను తోలుకెళ్తున్నట్టు తీసిన చిత్రం బహుమతి తెచ్చిపెట్టింది. 2019లో జాతీయస్థాయిలో నాలుగు అవార్డులు: ఈ ఏడాది 180వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఇండియన్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ, బెంగళూరు, గౌహతి, ఇండోర్ కేంద్రాలుగా జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలకు సోమరాజు మత్స్యకారుల జీవన విధానంపై పిక్టోరియల్ ఫొటోగ్రఫీలో పంపిన ‘డే ఎండ్’ చిత్రాలకు నాలుగు కేంద్రాల్లో పురస్కారాలు లభించాయి. మత్స్యకారులు కాకినాడ బీచ్లో పడవ తోసుకుని సముద్రంలోకి వెళ్తున్నప్పుడు తీసిన చిత్రానికి జాతీయస్థాయిలో నాలుగు పురస్కారాలను సోమరాజు సొంతం చేసుకున్నారు. -
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ‘గొర్రిపూడి’ విద్యార్థినులు
కరప ( కాకినాడ రూరల్) : కరప మండలం గొర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఇంటింటా అన్నమయ్య శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరిచి వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. కాకినాడలోని శ్రీ జ్యోతి నృత్య కళానికేత¯ŒSలో హైసూ్కల్ విద్యార్థినులు పాలాని సత్యశ్రీ, శిరీష, సంధ్య, మాలాశ్రీ, దేవి, జ్యోతి, అనూష, నందిని, వీరలక్ష్మి, రోహిత, సింధు, లక్ష్మీదుర్గ, దుర్గాదేవి, లక్ష్మీకుమారి, రాణి తదితర 105 మంది గతనెల 28వ తేదీన కాకినాడలో మూడు రకాల కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానంలో సంపాదించారు. జ్యోతి నృత్య అకాడమీ వ్యవస్థాపకురాలు మద్దనాల వీరవెంకట లక్ష్మీజ్యోతి, కోశాధికారి ఎం.ప్రసాద్లు మంగళవారం గొర్రిపూడి హైసూ్కల్కు వచ్చి సర్పంచ్ జల్దాని సుబ్బలక్ష్మి, ఏసు గంగాధర్, ఇ¯ŒSచార్జి హెచ్ఎం వెంకటరత్నంలు విద్యార్థులకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఇచ్చిన «సర్టిఫికెట్లను అందజేశారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పసిడి.. పండుగ
పదిలోనూ.. బాలికల హవా
పుష్ప సోయగం
15 శాతం డ్రగ్స్ ఆన్లైన్లోనే విక్రయాలు
కార్లలో 764 కిలోల గుట్కా తరలింపు
పరవశించిన మంగళగిరి..పులకించిన నగరి..గర్జించిన కడప
పది పరీక్షల్లో తప్పిన విద్యార్థిని ఆత్మహత్య
ఇంట్లో తొట్టి కట్టి తల్లిని పూడ్చిన కొడుకు
వేలూరు జిల్లాలో 82.07 శాతం
తిరువళ్లూరు జిల్లాలో పది పరీక్షల్లో 86.52 శాతం
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement