-
ఇది ముమ్మాటికీ బినామీ పిల్.. ఆధారాలతో సహా..
సాక్షి, అమరావతి : ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తమ బినామీలతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయిస్తున్న నేపథ్యంలో, అలాంటి బినామీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆధారాలతో హైకోర్టు ముందుంచింది. ప్రభుత్వ ప్రకటనల్లో సీఎం ఫొటోల సైజుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ పిల్ దాఖలు చేసిన కిలారి నాగశ్రవణ్కు టీడీపీకి, ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించిన అన్ని ఫొటోలను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. టీడీపీ, ఆ పార్టీ నేతలతో తనకున్న సాన్నిహిత్యం గురించి పిటిషనర్ ఉద్దేశ పూర్వకంగా దాచిపెట్టారని, ఈ ఒక్క కారణంతో ఈ వ్యాజ్యాన్ని కొట్టేయొచ్చని వివరించింది. (ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం: ఆ పిల్ను కొట్టేయండి ) ►ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫొటోను చాలా పెద్దదిగా వాడడంతో పాటు, ప్రకటనల జారీలో పత్రికల పట్ల వివక్ష చూపుతున్నారంటూ కిలారి నాగ శ్రవణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సీజే జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం ముందు గురువారం విచారణకు వచ్చింది. ►ఈ వ్యాజ్యం విచారణార్హతపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ అర్హతపై ప్రాథమిక కౌంటర్ దాఖలు చేయడానికి న్యాయస్థానం అనుమతిచ్చింది. దీంతో ప్రభుత్వం తరఫున సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్ హైకోర్టులో ప్రాథమిక కౌంటర్ దాఖలు చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రబాబు అండ్ కోతో సన్నిహిత సంబంధాలు ►నాగశ్రవణ్ యువగళం పేరుతో ఓ సంస్థను స్థాపించారు, ఈ సంస్థకు పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు రాజకీయ సలహాదారుగా ఉన్నారు. టీడీపీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేందుకు నాగ శ్రవణ్కు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఎంపీ రామ్మోహన్నాయుడు అవకాశం కల్పించారు. ►టీడీపీ రాజకీయ కార్యకలాపాల్లో పిటిషనర్ చాలా క్రియాశీలకంగా ఉన్నారు. టీడీపీ తరఫున డిజిటల్ మహానాడును నిర్వహించే బాధ్యతను ఇతనికే ఇచ్చారు. పిటిషనర్ ఈ విషయాలన్నింటినీ ఉద్దేశ పూర్వకంగా దాచిపెట్టారు. ►ఓ పత్రిక తరఫున పిల్ దాఖలు చేయడమే కాకుండా, ముఖ్యమంత్రిపై అవాస్తవ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత అజెండాతో టీడీపీకి లబ్ధి చేకూర్చే ఇలాంటి వ్యాజ్యాలను ప్రాథమిక దశలోనే అణిచి వేయాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పింది. ఆయన ప్రజా స్పృహ ఏపాటిదో అర్థమవుతోంది ►నాగ శ్రవణ్ దాఖలు చేసిన వ్యాజ్యంలో రాజకీయ ప్రయోజనాలున్నాయి. ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమే అవుతుంది. సానుకూల ఉత్తర్వులు పొందేందుకు కోర్టును ఇలా తప్పుదోవ పట్టించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. ►హైకోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేయడానికి కొద్ది రోజుల ముందు పిటిషనర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాజ్యంలోని అంశాల గురించి ప్రస్తావించారు. ముందు తమ అనుకూల మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించి, తర్వాత అదే అంశంపై హైకోర్టులో పిల్ దాఖలు చేయడాన్ని టీడీపీ నేతలు ఓ ప్రామాణిక విధానంగా మార్చుకున్నారు. ►ఇదే విధానంలోనే ఇప్పటికే ప్రభుత్వంపై హైకోర్టులో అనేక వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రజా స్పృహ ఉన్న వ్యక్తిగా చెప్పుకున్న పిటిషనర్, తన వ్యాజ్యంలో ఆంధ్రజ్యోతిని ప్రతివాదిగా చేర్చలేదు. దీనిని బట్టి అతనికున్న ప్రజా స్పృహ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ►ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కేవలం టీడీపీ, ఓ పత్రిక వ్యాపారం కోసం బినామీ ప్రయోజన వ్యాజ్యంగా (బిల్) మార్చేశారు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టేయాలి. -
Actor,Director,Producer అమరప్రసాద్
సమాజానికి మేలుచేసే ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలను ఆయన నిర్మించారు. కొన్నింటికి దర్శకత్వం వహించారు. మరికొన్ని సీరియల్స్లో నటుడిగా రాణించారు. అన్నింట్లోనూ తనదైన ప్రతిభ కనబరుస్తూ ‘నందులు’ అందుకున్నారు. ఆయనే కౌతవరానికి చెందిన చల్లపల్లి అమరప్రసాద్. డాక్యుమెంటరీ ఫిల్మ్స్ నిర్మాణంలో ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రసాద్ విజయ గాథ.. కౌతవరం (గుడ్లవల్లేరు) : నిర్మాత, దర్శకుడిగానే కాకుండా నటుడిగా ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు కౌతవరానికి చెందిన చల్లపల్లి అమరప్రసాద్. సీరియల్స్, ప్రభుత్వ ప్రకటనల డాక్యుమెంటరీ ఫిల్మ్లను తీస్తూ ఎంతో పేరు సంపాదించారు. చల్లపల్లి సొంత ఊరరుుతే, కౌతవరం అమ్మమ్మ గారి ఊరు. తాత స్వాతంత్య్ర సమరయోధుడు తాళ్లూరి మంగపతిరావు. ఉద్యమం కోసం ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్న గొప్ప దేశభక్తుడాయన. మరో తాత భూపోరాటం చేసి జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించిన చల్లపల్లి నారాయణరావు. చిన్నతనంలో అమ్మమ్మ తాతయ్య వద్ద పెరిగిన అమరప్రసాద్ పదో తరగతి వరకు కౌతవరంలోనే చదువుకున్నారు. తాతల స్ఫూర్తితో.. తాతలు మంగపతిరావు, నారాయణరావు స్ఫూర్తే సామాజిక స్పృహ కలిగించే డాక్యుమెంటరీ ఫిల్మ్స్కు సంబంధించిన ప్రకటనల మేకింగ్కు అమరప్రసాద్ను పురిగొల్పింది. రైల్వే దొంగల బారి నుంచి బయటపడేదెలా.., బాల కార్మికుల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై వందకుపైగా ప్రభుత్వ రంగ ప్రకటనలను డాక్యుమెంటరీలుగా తీశారు. వీటన్నింటికీ నిర్మాతగా వ్యవహరించిన ఆయన ప్లాస్టిక్ నియంత్రణ డాక్యుమెంటరీకి మాత్రం దర్శకుడిగా పనిచేయాల్సి వచ్చింది. అంతేకాదు, ‘అపరంజి’ అనే సీరియల్లో ప్రతినాయకుడిగా కూడా ఆయన పాత్ర పోషించారు. నందుల పంట అమరప్రసాద్ నిర్మించిన ప్లాస్టిక్ నియంత్రణ డాక్యుమెంటరీకి నంది పురస్కారం లభించింది. ఈ అవార్డును బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఆయన అందుకున్నారు. డాక్యుమెంటరీల మేకింగ్లో ఆయన ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 1994, 1997, 2000, 2012లో రెండు నంది అవార్డులు ఇచ్చి ప్రోత్సహించింది. కౌతవరంలో సీరియల్ ప్రస్తుతం కౌతవరంలో ఓ టీవీ సీరియల్ తీసేందుకు అమరప్రసాద్ సిద్ధమవుతున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకునేలా ఈ ప్రాంతంలో షూటింగ్ చేయడం ఆనందంగా ఉందని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. కౌతవరం ఎప్పుడూ వస్తా.. కౌతవరమంటే నాకెంతో ఇష్టం. అవకాశం కుదిరినపుడల్లా ఇక్కడికొచ్చి నా చిన్ననాటి స్మృతులు గుర్తుచేసుకుంటా. నా స్నేహితులను కలుసుకుంటా. ‘ఓ చిట్టెమ్మ కథ’ అనే మత్స్యకారుల జీవనశైలిపై నిర్మించిన డాక్యుమెంటరీ నాకెంతో నచ్చింది. తాత చల్లపల్లి నారాయణరావు జీవితగాథను ఇతివృత్తంగా చేసుకుని నిర్మించిన ‘అమరవీర’ డాక్యుమెంటరీకి మంచి స్పందన లభించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement