-
16న కేజ్రీవాల్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా 16న ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్లీలా మైదానం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆప్ నేత మనీష్ సిసోడియా చెప్పారు. కేజ్రీవాల్తోపాటు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు కేజ్రీవాల్ కొత్తఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరూ లాంఛనప్రాయంగా కేజ్రీవాల్ను ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. భారీగా జన సమీకరణ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆప్ సన్నాహాలు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.. ఒకప్పుడు అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వేదికగా నిలిచిన రామ్లీలా మైదానంలో ఆయనకు కుడిభుజంగా పని చేసి దేశ ప్రజలందరి దృష్టిని కేజ్రీవాల్ ఆకర్షించారు. కేబినెట్లో పాత ముఖాలే ? గత ప్రభుత్వంలో పనిచేసిన వారికే మళ్లీ కేజ్రీవాల్ కేబినెట్లో అవకాశం ఇవ్వనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎలాంటి మార్పులు చేయకపోవచ్చునని తెలుస్తోంది. మనీశ్ సిసోడియా, రాజేంద్ర పాల్ గౌతమ్, సత్యేంద్ర జైన్, కైలాస్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్లు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకోనున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి, ఆప్ విద్యా రంగ సంస్కరణల్లో భాగస్వామిగా నిలిచిన ఆప్ నాయకురాలు అతిషి మర్లేనా, పార్టీకి కొత్త శక్తిగా మారిన రాఘవ్ చద్దాకు ఆర్థిక శాఖ కట్టబెడతారన్న ప్రచారమూ సాగింది. -
ఢిల్లీలో ‘ఆప్’కా సర్కార్!
ప్రభుత్వ ఏర్పాటుపై కేజ్రీవాల్ స్పష్టమైన సంకేతాలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముందడుగు వేసింది. కాంగ్రెస్తో కలసి ప్రభుత్వాన్ని పంచుకోవడంపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఈ అంశంపై వారంపాటు నిర్వహించిన రిఫరెండంలో ప్రజలు తమకు సానుకూల ఫలితాలు ఇచ్చారని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఇక్కడ తెలిపారు. కాంగ్రెస్తో కలసి తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రిఫరెండంలో పాల్గొన్న 80 శాతం మంది ప్రజలు అభిప్రాయపడినట్లు చెప్పారు. అలాగే ఆది వారం వరకూ నిర్వహించిన 280 బహిరంగ సభల్లో చాలా చోట్ల ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. అయితే రిఫరెండంతోపాటు ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్, ఈ-మెయిల్స్ ద్వారా అందిన ఫలితాలను విశ్లేషించాక ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ అంశంపై సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాక లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను మధ్యాహ్నం 12:30 గంటలకు కలసి తుది నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని పలు హామీలను కొన్ని గంటల వ్యవధిలోనే అమలు చేస్తామన్నారు. కాగా, రిఫరెండం నిర్వహణ తీరు సరిగాలేదన్న విమర్శలను కేజ్రీవాల్ అంగీకరించారు. కానీ ఈ చర్య ద్వారా తాము ప్రజాభిప్రాయాన్ని చూచాయగా తెలుసుకోగలిగామన్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హంగ్ ఫలితాలు ఏర్పడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. బీజేపీ 31 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించగా ఆప్ 28 స్థానాలు, కాంగ్రెస్ 8, అకాలీదళ్ (ఎన్డీఏ భాగస్వామ్యపక్ష పార్టీ), జేడీయూ చెరో సీటు గెలుచుకున్నాయి. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 36 స్థానాలు దక్కకపోవడంతో బీజేపీ ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడగా, ఆప్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ బేషరతు మద్దతు పలికింది. కాంగ్రెస్ మద్దతుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంపై ఆప్ రిఫరెండం నిర్వహించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఆప్ చర్యను రాజకీయ అవకాశవాదంగా అభివర్ణించింది. విలువలు, ప్రత్యామ్నాయ రాజకీయాలకు కట్టుబడతామన్న ఆప్... కాంగ్రెస్ మద్దతును ఏ విధంగా సమర్థించుకుంటుందని బీజేపీ ప్రశ్నించింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement