-
లోదుస్తుల్లో దాచి పేపర్ తెచ్చేశాడు
మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి పీజీ మెట్ ప్రశ్నపత్రం బయటకు తెచ్చిన ముఠా సభ్యుడు హైదరాబాద్: ఎన్టీఆర్ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ వైద్యవిద్య ప్రవేశపరీక్ష (పీజీ మెట్-2014) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. లీకేజ్ ముఠాలో సభ్యుడొకడు కర్ణాటకలోని మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్లో ప్రశ్నపత్రాన్ని తస్కరించి లోదుస్తుల్లో దాచి బయటకు తీసుకొచ్చాడని నిర్ధారణ అయ్యింది. సీఐడీ అదనపు డీజీ టి.క ృష్ణప్రసాద్ శనివారం మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. గతంలో కర్ణాటకలో జరిగిన ఇదే తరహా వ్యవహారాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజగోపాల్రెడ్డి శిష్యుడు, సహ నిందితుడైన అమీర్ అహ్మద్ ఈ పీజీ మెట్ ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలో కూడా సూత్రధారి అని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో 10 మందిని అరెస్టు చేశామన్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు 15 మంది సూత్రధారులు, దళారులతో పాటు మరో 15 మంది ర్యాంకర్లను అరెస్టు చేసినట్లయిందని చెప్పారు. రాజగోపాల్రెడ్డితో పాటు ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం, హెల్త్ వర్సిటీ అధికారుల పాత్రలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. గురువు బాటలో శిష్యుడు: అనంతపురం జిల్లాకు చెందిన రాజగోపాల్రెడ్డి అలియాస్ గోవింద్రెడ్డి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో స్థిరపడ్డాడు. విజయా బ్యాంక్లో పనిచేసి 2005లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. విద్యారంగంలో తనకున్న పరిచయాలతో 2007-2013 మధ్య కాలంలో పలు ప్రశ్నపత్రాలను లీక్ చేసి అరెస్టయ్యాడు. బెంగళూరులోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ (ఆర్జీయూహెచ్ఎస్-2007) ప్రశ్నపత్రం లీకేజీ, కొమెడ్ కే-2011 బోగస్ ప్రశ్నపత్రం లీకేజీ సహా కర్ణాటకలో నమోదైన నాలుగు కేసుల్లో రాజగోపాల్రెడ్డి ప్రధాన నిందితుడు. అతనికి డ్రైవర్గా పనిచేసిన దావనగెరె నివాసి అమీర్ అహ్మద్ కూడా ఆయా కేసుల్లో సహ నిందితుడు. మణిపాల్ ప్రెస్లో ముద్రితమైన పీజీ మెట్ ప్రశ్నపత్రం లీకేజీకి సూత్రధారి కూడా అమీర్ అహ్మదే. మణిపాల్ ప్రెస్కు అవసరమయ్యే సిబ్బందిని మణిపాల్కే చెందిన షాలిమార్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీయే ఏర్పాటు చేస్తుంటుంది. అమీర్ తన అనుచరుడైన ప్రవీణ్ను ఔట్సోర్సింగ్ సిబ్బందిగా షాలిమార్ ద్వారా గత ఏడాది నవంబర్లో ప్రెస్లోకి పంపాడు. ప్రవీణ్ ఫిబ్రవరి 18న ఫ్రాంకింగ్ మిషన్లో ముద్రితమైన పీజీ మెట్ ప్రశ్నపత్రాన్ని సీసీ కెమెరాలకు చిక్కకుండా తస్కరించాడు. మిషన్ నుంచి పక్కకు పడిన ఓ పేపర్పై తన చేతిలోని టవల్ వేసి.. బాత్రూమ్కు వెళ్లే వంకతో టవల్తో సహా ప్రశ్నపత్రాన్ని తీసుకువెళ్లాడు. దాన్ని లోదుస్తుల్లో దాచి, తెచ్చి అమీర్కు అందించాడు. ప్రవీణ్ ద్వారా ప్రశ్నపత్రం అందుకున్న అమీర్కు అది ఏ పరీక్షకు సంబంధించిందో ముందు బోధపడలేదు. ప్రశ్నల తీరుతెన్నుల్ని బట్టి వైద్య విద్యకు చెందినదై ఉంటుందని భావించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ద్వారా ఎన్టీఆర్ వర్సిటీదిగా గుర్తించాడు. ఆపై దళారులు, కన్సల్టెన్సీల కోసం వెతుకులాట మొదలెట్టాడు. అలా ఈ విషయం దావనగెరెకు చెందిన పౌల్సన్కు, అతడి ద్వారా ముంబైకి చెందిన అంజూ సింగ్, బెంగళూరు వాసి సురేష్బాబుకు చేరింది. వారంతా కలసి 16 మంది దళారుల సాయంతో అభ్యర్థులకు ఎరవేశారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ అవినాష్ సాయంతో ఈ ప్రశ్నపత్రానికి ‘కీ’ తయారు చేయించారు. గోవా, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ల్లోని ఇళ్లు, రిసార్ట్లు, అపార్ట్మెంట్స్లో అభ్యర్థులకు ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేశారు. గతంలో రాజగోపాల్రెడ్డి బోగస్ ప్రశ్నపత్రాన్ని రూ. 11 లక్షల చొప్పున విక్రయించగా, ఇప్పుడు అమీర్ గ్యాంగ్ మాత్రం ఈ ప్రశ్నపత్రాన్ని రూ. 1.5 కోట్లకు బేరం పెట్టింది. సీఐడీ దర్యాప్తులో ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. దీంతో శుక్రవారం కర్ణాటకలో అమీర్ అహ్మద్, ప్రవీణ్, అంజూసింగ్, సురేష్బాబు, అవినాష్లను సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. అలాగే ఆకుల శ్రీకాంత్ (మొదటి ర్యాంకర్), సోనియా ఆరోగ్య ప్రకాశ్ (23వ ర్యాంకర్), వీఎన్ గౌతమ్ వర్మ (29వ ర్యాంకర్), పి.వినీల (95వ ర్యాంకర్), రెండో ర్యాంకర్ సాయిసుధ తరఫున నగదు చెల్లించిన ఆమె భర్త డాక్టర్ ఫణీంద్రలను అరెస్టు చేశారు. వీరి నుంచి సెల్ఫోన్లు, చెక్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు వైద్య పరీక్షలు.. పీజీమెట్ లీకేజీ స్కాంలో అరెస్టైన ఐదుగురికి శనివారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అంబర్పేట్కు చెందిన ఆకుల శ్రీకాంత్, చిత్తూరు జిల్లా ఎంఎన్ఎస్ కాలనీకి చెందిన పులి వినీల, రంగారెడ్డి జిల్లా గిర్మాపూర్కు చెందిన బి.ఎస్.ఆరోగ్య ప్రకాశ్, వైజాగ్కు చెందిన కె.వి.ఎన్.గౌతమ్వర్మ, కరీంనగర్ సాయిరామ్ ఆస్పత్రి కన్సల్టెంట్ సర్జన్ మండలి ఫణీంద్రలను వైద్య పరీక్షల అనంతరం సీఐడీ పోలీసులకు వారిని అప్పగించారు. ఇంకేమైనా లీక్ అయ్యాయా? దేశవ్యాప్తంగా పలు పోటీపరీక్షల ప్రశ్నపత్రాలు మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రితమవుతున్నాయి. పీజీ మెట్ ప్రశ్నపత్రంలాగే మరేవైనా లీక్ అయ్యాయా? అనే కోణంలోనూ సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం కోర్టు అనుమతితో నిందితుల్ని తమ కస్టడీలోకి తీసుకొని విచారించాలని నిర్ణయించారు. -
తీగ లాగితేకదిలిన డొంక
గట్టు/గద్వాల న్యూటౌన్, న్యూస్లైన్: తీగ లాగితే డొంక కదిలిందన్నట్లుగా... ఒక హత్య కేసును ఛేదించే క్రమంలో మరుగునపడిన రెండు పాత హత్య కేసులు వెలుగుచూశాయి. గత నెల 20న గట్టు మండలం ఆలూరుకు చెందిన రైతు కుర్వ గుడిసె తిమ్మప్ప(48) తుమ్మలచెరువు గ్రామ శివారులో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిందితులను విచారిస్తుండగా ఆసక్తికరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 11 ఏళ్ల క్రితం ఆలూరుకు చెందిన కుమ్మరి కిష్టయ్య (20), కర్నూలుకు చెందిన మరో వ్యక్తిని హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో ఆలూరు గుట్టల్లో 11 ఏళ్ల క్రితం హత్యకు గురైన కమ్మరి కిష్టయ్య ఆస్థికలను శుక్రవారం ఆలూరు పునరావాస కేంద్రానికి సమీపంలో గద్వాల డీఎస్సీ గోవిందరెడ్డి, సీఐ షాకీర్హుస్సేన్, పోలీసు సిబ్బంది గుర్తించారు. శుక్రవారం డీఎస్పీ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హత్యలు చేసింది ఇలా... గుడిసె తిమ్మప్ప(48)హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న ఆలూరుకు చెందిన బోయ వెంకట్రాములు, వెంకటన్న, ఆంజనేయులు, అలంపూర్కు చెందిన కోనేరు జగన్లను గురువారం సాయంత్రం బల్గెర చెక్పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తామే గుడిసె తిమ్మప్పను వేట కొడవళ్లతో చంపి, వాగులో పూడ్చి వేశామని వారు అంగీకరించారు. తన సమీప బంధువుల పొలాన్ని తిమ్మప్ప కొనుగోలు చేశాడని, ఇది సహించలేకే తనతో పాటు ముగ్గురు కలిసి హత్య చేశామని వెంకట్రాములు తెలిపాడు. దీంతో పాటు 11 ఏళ్ల క్రితం జరిగిన హత్యకు సంబందించిన వివరాలను కూడా వెల్లడించాడు. 2003 జనవరిలో గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్య దారుణహత్యకు గురయ్యాడు. కుమ్మరి కిష్టయ్య చెల్లెలితో వెంకట్రాములుకు వివాహేతర సంబంధం ఉండేంది. ఈ విషయం కిష్టయ్యకు తెలియడంతో అతడిని హత మార్చాలని వెంకట్రాములు నిర్ణయించుకున్నాడు. ఈ నేపత్యంలో వెంకటన్న, రాఘవేంద్ర , కర్నూలుకు చెందిన పరమేష్ సహాయంతో గ్రామ శివారులో కిష్టయ్య గొంతు నులిమి హత్యచేసి, గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని గుట్టపై ఉన్న సొరంగంలో పారవేశారు. ఈ విషయం బయటికి రాకపోవడంతో పోలీసులు కిష్టయ్య కేసును అదృశ్యంగా నమో దు చేశారు. కాగా కిష్టయ్యను హత్య చేసినందుకు పరమేష్ లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటికే వెంకట్రాములు అతనికి రూ.40 వేలు ఇచ్చినా, అది సరిపోదని మిగిలిన డబ్బు ఇవ్వాల్సిందేనని తరుచూ బెదిరింపులకు దిగడం తో అతడిని హతమార్చేందుకు వెంకట్రాములు బృందం నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆరు నెలల తర్వాత పరమేశ్ను గ్రామానికి రప్పించుకుని పీకలదాకా మద్యం తాగించి బండరాయితో తలపై మోది హత్య చేశారు. మృతదేహాన్ని తుమ్మలచెరువు శివారులోని వ్యవసాయ బావిలో పడేశారు. రెం డు రోజుల తర్వాత మృతదేహం తేలినా ఎవరూ గుర్తించలేకపోవడంతో పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసునమోదు చేశారు. అయితే తాజాగా ఈ హత్యను కూడా తామే చేసినట్లు నిందితులు అం గీకరించడంతో 11 ఏళ్లుగా మిస్టరీగా మారి న హత్యల చిక్కుముడి వీడింది. కాగా మరో నిందితుడు రాఘవేం ద్ర పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మోదీ, రాహుల్ గాంధీలకు ‘బహిరంగ చర్చ’ ఆహ్వానం
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement