-
స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దుదాం
► గ్రామజ్యోతి స్ఫూర్తితో బంగారు తెలంగాణ ► బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా బక్కలింగాయపల్లి ► నల్లమలలో కలెక్టర్ శ్రీదేవి విస్తృత పర్యటన ► పుష్కరఘాట్ల పనుల పరిశీలన అచ్చంపేట రూరల్: మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించుకొని స్వచ్ఛపల్లెలుగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. బుధవారం అచ్చంపేట మండలం ఏజెన్సీ గ్రామమైన బక్కలింగాయపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నవీన్ చొరవతో గ్రామంలో 100శాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలను నిర్మించుకోవడం అభినందించ విషయమన్నారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో బక్కలింగాయపల్లిని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా ప్రకటించారు. ఆలోచన చేయకనే వెనకబాటుతనానికి గురవుతున్నామని, నవీన్లా ఆలోచించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విద్యతో వెనకబాటుతనాన్ని దూరం చేయవచ్చన్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టారని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. జిల్లాలో ఇప్పటికే 53గ్రామాలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించామని చెప్పారు. ఇంకా 1500 గ్రామాలను టార్గెట్గా పెట్టుకున్నామని తెలిపారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి: గువ్వల అంతకుముందు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ నవీన్లా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలన్నారు. నవీన్ను ఆదర్శంగా తీసుకుని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకోవాలన్నారు. అచ్చంపేటను టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. పుష్కరఘాట్ల వద్ద గ్రామానికి చెందిన యువకులు వలంటీర్లుగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మధుసూదన్నాయక్, డ్వామా పీడీ దామోదర్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పద్మనాభరావు, డీఈఓ విజయలక్ష్మి, సీఈఓ లక్ష్మినారాయణ, ఆర్డీఓ దేవేందర్రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, ఎస్పీహెచ్ఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, ఎంపీడీఓ సుధాకర్, ఎంఈఓ గోవర్ధన్రెడ్డి, సీడీపీఓ దమయంతి, గ్రామ సర్పంచు కమల, టీఆర్ఎస్ నాయకులు మనోహర్, నర్సింహగౌడ్, సీఎంరెడ్డి, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. . పుష్కరఘాట్ పనులను పరిశీలన మండల పరిధిలోని బక్కలింగాయపల్లి సమీపంలో జరుగుతున్న పుష్కరఘాట్ పనులను కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా పనులు చేపట్టాలని కోరారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సేవ్యానాయక్, సర్పంచు కమల, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పుస్తకాలను అమ్ముకుంటే చర్యలు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను వారికే పంపిణీ చేయాలని, ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు అమ్ముకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ టీకే శ్రీదేవి హెచ్చరించారు. బుధవారం బక్కలింగాయపల్లిలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. పక్క స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకరావాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని, సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. 14 సంవత్సరాల లోపు పిల్లల వివరాలు చెప్పాలని డీఈఓ, ఎంఈఓలను అడిగారు. సరైన సమాధానం రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో పద్యాలు చదివించారు. -
‘గ్రామజ్యోతి’ పరుగులు..
‘గ్రామజ్యోతి’ పట్టాలెక్కనుంది. నిధుల కేటాయింపులు జరగడంతో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. అభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీలకు అవగాహన కల్పించనున్నారు. గ్రామ సభల్లో తీర్మానించిన పనులు చేపట్టేందుకు అడుగులు వేస్తున్నారు. పారదర్శకంగా పనులు సాగేలా చర్యలు చేపడుతున్నారు. ఇదే వేగాన్ని ప్రదర్శిస్తే పల్లెలు ప్రగతి బాట పట్టినట్టే... - నల్లగొండ రెండు రోజుల క్రితం జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. గ్రామజ్యోతిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ శిక్షణ తరగతులు జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు. గ్రామజ్యోతిలో భాగంగా ప్రధానంగా ఏడు అంశాలకు సంబంధించి కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడు కమిటీలకుగాను 14,865 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఒక్కో కమిటీ ఎంచుకున్న లక్ష్యాల ను ఏ విధంగా అమలు చేయాలి..? ఎలా ముందుకు వెళ్లాలి..? అనే దానిపై సంబంధిత శాఖల అధికారులతో అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు.. విద్యా కమిటీ అయితే ఆ గ్రామంలో వందశాతం విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలి. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, బడి బయటి పిల్లలను బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలను ఏ విధంగా చేస్తే వందశాతం లక్ష్యాలను సాధిస్తామనే దానిపై డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓలతో అవగాహన కల్పిస్తారు. అక్షరాస్యులైన వారే విద్యాకమిటీ చైర్మన్లు ఉండాలని నిర్ణయించారు. ఈ విషయంలో విద్యావంతులే ఉండాలని మార్పు చేశారు. అభివృద్ధి పనులకు నిధులు.... 14వ ఆర్థిక సంఘం కింద పంచాయతీలకు రూ.36.19 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి పంచాయతీల ఖాతాలకు రెండు రోజుల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈ నిధుల వాడకానికి సం బంధించి గతంలో మాదిరి బోర్ల మరమ్మతులు, కంటికి కనిపించని పనులు చేయడానికి వీల్లేదు. ఇప్పటివరకు వచ్చిన నిధుల్లో సర్పంచ్లు చాలావరకు దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. గ్రామజ్యోతిలో భాగంగా గ్రామసభల్లో తీర్మానం చేసిన వివిధ రకాల అభివృద్ధి పనులకే ఈ నిధులు వినియోగించాలి. గ్రామసేవ కేంద్రాల ఏర్పాటు... మీ సేవ కేంద్రాల తరహాలో గ్రామాల్లో అన్ని రకాల సేవలను ప్రజలకు అందుబాటులో తె చ్చేందుకు వీలుగా పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది తొలి విడత 75 పంచాయతీల్లో పల్లె సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీ భవనాలు, కంప్యూటర్లు, బీఎస్ఎన్ఎల్ బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ కలిగిన గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. వచ్చే ఏడాది రెండో విడత కింద మరిన్ని గ్రామాల్లో వీటిని విస్తరిస్తారు. ఈ కేంద్రాల ద్వారా ముందుగా పంచాయతీల పన్ను వసూలు, ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లింపు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు వంటి సేవలందిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2నుంచి పల్లె సమగ్ర సేవా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామజ్యోతి కమిటీల వివరాలు, నిర్దేశించిన లక్ష్యాలు జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 1,176 గ్రామజ్యోతి కమిటీలు 8,190 నిర్దేశించిన లక్ష్యాల సంఖ్య 14,865 గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా.. ‘గ్రామజ్యోతి’లో తీర్మానం చేసిన అభివృద్ధి పనులు అమలు చేసేందుకు కమిటీలకు శిక్షణ త రగతులు నిర్వహించాలని నిర్ణయించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామసభల్లో తీర్మా నం చేసిన పనులకే వెచ్చించాలి. దుర్వినియోగం చేయడానికి వీళ్లేదు. ఈ నిధుల వినియోగంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. - పి.ప్రభాకర్ రెడ్డి, డీపీఓ -
మంత్రి హరీశ్రావు నెక్కొండ ‘శ్రీమంతుడు’
నెక్కొండ : గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగం గా వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం ప్రకటిం చా రు. ఎంపీపీ గటిక అజయ్కుమార్ విజ్ఞప్తి మేర కు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. నెక్కొండ బ్రిడ్జి పనుల వేగవంతానికి, వట్టె వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి చెప్పారు. సంగెం మండలం ఎలుగూరు వాగుపై లిఫ్ట్ ఇరిగేషన్ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని రైతులు కోరగా నివేదికలు రూపొం దించాలని అధికారులను ఆదేశించారు. -
ముందు జోరు.. ఆపై బేజారు..!
- మారుమూల గ్రామాలు గాలికి.. - చాలాచోట్ల మొక్కుబడిగా సాగిన కార్యక్రమం - ఎంపీపీ, ఎంపీటీసీలు కార్యక్రమానికి దూరం - గ్రామాభివృద్ధి ప్రణాళికలు ఆన్లైన్లో.. - జిల్లాలో ముగిసిన ‘గ్రామజ్యోతి’ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సర్కారు చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం ముగిసింది. ఈనెల 17న అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి వరకు ఆ జోరు కొనసాగలేదు. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు వెళ్లిన, దత్తత తీసుకున్న గ్రామాల్లో మినహా, మిగిలిన దాదాపు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని మమ అనిపించారు. గ్రామజ్యోతిలో భాగంగా గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సర్కారు నిర్దేశించింది. గతేడాది నిర్వహించిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో పొందుపరిచిన పనులకు పెద్ద మోక్షం కలిగిన దాఖలాల్లేవు. అయినప్పటికీ.. గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన జోరుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 866 గ్రామపంచాయతీల్లో ఈ ప్రణాళికలు తయారు చేశారు. వీటిని ప్రత్యేక వెబ్సైట్లో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇప్పటి వరకు 15 గ్రామాల ప్రణాళికలను అప్లోడ్ చేశారు. మన ఊరు.. మన ప్రణాళికలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కలిపి 2,736 కోట్ల అంచనా వ్యయంతో 8,912 పనులు ప్రతిపాదించారు. ఏడాది కాలంగా ఈ ప్రణాళిక పనులు పెద్దగా కార్యరూపం దాల్చలేదు. దూరంగా ఎంపీటీసీలు.. ‘గ్రామజ్యోతి’లో తమకు ఏమాత్రం ప్రాధాన్యత కల్పించలేదంటూ ఎంపీటీసీలు, ఎంపీపీలు చాలా మట్టుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాలేదు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు నుంచే నిరసన గళం వినిపించారు. జిల్లా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఎంపీపీలందరూ బహిష్కరించి బయట బైఠాయించారు. జిల్లా మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్రెడ్డి సముదాయించినా.. వారు తమ నిరసనను విరమించుకోలేదు. గ్రామసభలకు కూడా దూరంగా ఉన్నారు. కుంటాలలో మండల సమావేశాన్ని సైతం బహిష్కరించారు. గ్రామాల్లో అన్ని వర్గాలను భాగస్వామలుగా చేసేందుకు ప్రభుత్వం ఏడు కమిటీలను నియమించాలని నిర్ణయించినా.. ఈ కమిటీ సభ్యుల భాగస్వామ్యం అంతంత మాత్రంగానే సాగింది. గ్రామపంచాయతీల సిబ్బంది మాత్రం డ్రెయినేజీల్లో పూడికతీత, తాగునీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ వంటి పనులు చేపట్టారు. దగ్గర గ్రామాలే దత్తత.. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు వేయడం ద్వారా మిగిలిన గ్రామాలకు మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా జిల్లాలో 866 గ్రామపంచాయతీలకు గాను 338 గ్రామాలను ఎంపిక చేశారు. అయితే జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు సైతం సమీప పట్టణాలకు, తాముండే ప్రాంతానికి అత్యంత సమీప గ్రామపంచాయతీలను దత్తత గ్రామాలుగా ఎంపిక చేసుకున్నారు. జిల్లాలో అనేక సమస్యలతో సహజీవనం చేస్తున్న మారుమూల గ్రామాలను విస్మరించారనే తీవ్ర విమర్శలు వచ్చాయి. మొదట్లో ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున దత్తత తీసుకోగా, తర్వాత మండలానికి ఒక గ్రామాన్ని దత్తత గ్రామాలుగా ఎంపిక చేశారు. గ్రామజ్యోతి కార్యక్రమం ముగిసినప్పటికీ, ఎవరెవరు.. ఏయే గ్రామాలను దత్తత తీసుకున్నారో వివరాలను అధికారులు వెల్లడించలేదు. -
‘అనుబంధం’లో ‘జ్యోతి’ లేదు!
తండాల వైపు దృష్టి సారించని యంత్రాంగం కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన సమస్యలు కమిటీల్లో పేర్ల వరకే పరిమితమైన అధికారులు అభివృద్ధి పనులు ఇంకెప్పుడని ప్రశ్నిస్తున్న ప్రజలు తాండూరు రూరల్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం అనుబంధ గ్రామాల్లో కొనసాగడంలేదు. ఎన్నాళ్లుగా తిష్టవేసిన సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ఆశపడిన ప్రజలు నిరాశ కు గురవుతున్నారు. కమిటీల్లో పలువురి పేర్లను నామమాత్రంగా చేర్చిన నోడల్ అధికారులు ఆ పిదప పట్టించుకోవడంలేదంటున్నారు. గ్రామాలపై వివక్ష కనబరుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వారంరోజులవుతున్నా ఇటువైపు చూసిన నాథుడే కరువయ్యాడని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాండూరు మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో గోపన్పల్లి, చిట్టిఘనాపూర్, గుంతబాసుపల్లి, చింతమణిపట్నం, బోంకూర్, రాంపూర్, రాంపూర్చిన్నతండా, పెద్దతంవీర్శెట్టిపల్లి, సంకిరెడ్డిపల్లి, గుండ్లమడుగుతండా, జినుగుర్తితండా, ఉద్దాండపూర్ తండాలు అనుబంధ గ్రామాలున్నాయి. ఈ నెల 17న ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజులవుతున్నా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కాల్వల్లో మురుగు ఎక్కడికక్కడే పేరుకుపోయింది. తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయడంలేదు. పైపులైన్ల లీకేజీలతో పాటు పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. అయితే.. నోడల్ అధికారులు మాత్రం అనుబంధ గ్రామాల నుంచి వార్డు సభ్యులను, మరికొందరిని గ్రామకమిటీలో చేర్చుకున్నారు. అధికారులు కమిటీలలో పేర్లు చేర్చుకోవడం వరకే పరిమితమయ్యారు. తమ గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కోరినా స్పందించడంలేదని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనుబంధ గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక అధికారుల్ని ఆదేశించాం గ్రామజ్యోతి పథకం కింద ముందుగా పంచాయతీలకు ప్రాధాన్యమిస్తున్నాం. అనుబంధ గ్రామాల్లోని వార్డు సభ్యులు, యువకులు కమిటీలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని అనుబంధ గ్రామాల్లో పనులు చేశాం. గ్రామజ్యోతి పథకం ద్వారా వచ్చిన నిధులు కూడా అనుబంధ గ్రామాలకు కేటాయించాం. ఆయా గ్రామాల్లో గ్రామజ్యోతి పనులు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదే శాలిచ్చాం. - జయరాజ్, గ్రామజ్యోతి మండల చేంజ్ అధికారి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement