-
ఫ్రెంచ్ ఓపెన్కే జొకోవిచ్ ఓటు
బెల్గ్రేడ్ (సెర్బియా): కోవిడ్–19 కారణంగా అమెరికాలో నెలకొని ఉన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో వరల్డ్ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. దానికంటే ఫ్రెంచ్ ఓపెన్లో పాల్గొనడమే మంచిదని అతను భావిస్తున్నాడు. జూన్లో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ను నిర్వాహకులు కరోనా కారణంగా సెప్టెంబర్కు వాయిదా వేశారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారం యూఎస్ ఓపెన్ ఆగస్టు 31 నుంచి న్యూయార్క్లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీపై నిర్వాహకులు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికాతో పోలిస్తే ఫ్రాన్స్లో ప్రస్తుతం మెరుగైన పరిస్థితులు ఉన్నాయని జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. హోం క్వారంటైన్ మొదలు అనేక షరతుల మధ్య అమెరికాలో గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడటం తన వల్ల కాదని తేల్చే శాడు. ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తే సెప్టెంబర్ నుంచి క్లే సీజన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఫ్రెంచ్ ఓపెన్తోనే బరిలోకి దిగడం సరైన ఆలోచన. నేను మాట్లాడిన చాలా మంది ఆటగాళ్లు కూడా యూఎస్ ఓపెన్లో ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు. అక్కడి నిబంధనల ప్రకారం బయట నుంచి అమెరికాలో అడుగు పెట్టేవారు 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. అది నా వల్ల కాదు. కోర్టుల్లో అడుగు పెట్టడానికి కూడా షరతులు పెడుతున్నారు. ఆటగాడితోపాటు ఒకరినే అనుమతిస్తామంటే ప్రాక్టీస్ ఎలా సాధ్యమవుతుంది. న్యూయార్క్లో తిరిగేందుకు అవకాశం లేదు. ఇలాంటివాటి మధ్య నేను ఆడలేను’ అంటూ జొకోవిచ్ స్పష్టం చేశాడు. -
మే 15న షరపోవాపై నిర్ణయం
పారిస్: గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్లో రష్యా టెన్నిస్ తార మరియా షరపోవాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుందా లేదా అనే అంశంపై మే 15న స్పష్టత రానుంది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్టీఎఫ్) గురువారం ప్రకటించింది. ‘రోలండ్ గారోస్ టోర్నీ క్వాలిఫయర్స్కు వారం రోజుల ముందు మే15న షరపోవా విషయంలో మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. ఒకవేళ మేం వైల్డ్కార్డ్ అనుమతి ఇవ్వకపోయినా క్వాలిఫయర్స్ ఆడి ఆమె ఈ టోర్నీలో పాల్గొనవచ్చు’ అని ఎఫ్టీఎఫ్ అధ్యక్షుడు బెర్నార్డ్ గుడిసెలి అన్నారు. మే 28 నుంచి జూన్ 11 వరకు ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ జరగనుంది. మరోవైపు సెరెనా విలియమ్స్ కూడా ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సీజన్ టోర్నీల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో షరపోవాకు వైల్డ్కార్డ్ ఎంట్రీ దొరుకుతుందని అభిమానులు ఆశించారు. అయితే సెరెనా, షరపోవాలిద్దరివి విభిన్నమైన కేసులు. ఒకరి గైర్హాజరీతో మరొకరికి సంబంధం లేదని బెర్నార్డ్ స్పష్టం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
అరసవల్లిలో భక్తుల రద్దీ
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement