-
కౌమారానికి.. కౌన్సెలింగ్..
కౌమార దశ.. పిల్లలు పెద్దలయ్యే దశ. అప్పటివరకు అమ్మచాటు బిడ్డలా ఎదిగిన వారు, ఒక్కసారిగా ఏవో తేలియని ఉద్వేగాలకు లోనవుతారు. ఈ దశలో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులొస్తాయి. పిల్లల ఎదుగుదలకు ఇది అత్యం త కీలక దశ. ఇలాంటి సమయంలో వారి అవసరాలు తీర్చగలిగితే, వారి ప్రశ్నలకు తగిన సమాధానాలు, సరైన కౌన్సెలింగ్ ఇవ్వగలిగితే మెరుగైన ఫలితాలొస్తాయని ‘సంగత్’అనే ఎన్జీవో చేపట్టిన ‘సెహర్’(స్ట్రెంగ్తనింగ్ ది ఇవినెడ్స్ బేస్ ఆన్ ఎఫెక్టివ్ స్కూల్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ అడాల్సెంట్ హెల్త్ ప్రోగ్రామ్) ప్రాజెక్టు తెలియజేస్తోంది. బిహార్లోని నలంద జిల్లాలో 74 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి ఈ ప్రాజెక్టు అమలు చేశారు. దీని ఫలితాలపై ‘లాన్సెట్’పత్రిక ఇటీవల ఓ కథనం ప్రచురించింది. ప్రాజెక్ట్ అమలు ఇలా.. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన కౌన్సెలర్లు (సెహర్ మిత్రలు) ఫిర్యాదులు, సూచనలు తీసుకునేందుకు పెట్టెలు ఏర్పాటు చేయడం, విజ్ఞానం కోసం నెలనెలా గోడపత్రిక తీసుకురావడం, ఉద్వేగ–ప్రవర్తనా పరమైన అంశాల్లో.. సామాజిక–ఆహార–విద్యా సంబంధిత విషయాల్లో టీనేజర్ల ఇబ్బందులు తొలగించేందుకు వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి కొన్ని చర్యలు చేపట్టారు. ఇవి మంచి ఫలితాలు ఇచ్చాయని చెబుతున్నారు ‘సెహర్’ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రాచీ ఖండేపార్కర్. పాఠశాలల్లో వేధింపులు–హింసాత్మక చర్యలు తగ్గడం, డిప్రెషన్ లక్షణాలున్న వారిలో అవి తగ్గుముఖం పట్టడం, అమ్మాయిలను చిన్నచూపు చూసే ధోరణిలో కొంతమేర మార్పు రావడం, పునరుత్పత్తి–లైంగిక ఆరోగ్యంపై అవగాహన ఏర్పడటం వంటి సత్ఫలితాలను తాము గమనించామని ఆమె తెలిపారు. పర్యవసానంగా స్కూలుకు రావడానికి పిల్లలు మరింత ఆసక్తి చూపారని ప్రాచీ వివరించారు. ఖర్చూ తక్కువే ప్రాజెక్టులో స్థానికులను భాగం చేస్తే మంచి ఫలితాలొస్తాయని, గ్రామాల్లోని పిల్లలు వారికి మరింత దగ్గరవుతారని భావించిన ప్రాజెక్టు నిర్వాహకులు.. కౌన్సెలింగ్ నిర్వహణపై ఆయా ప్రాంతాల యువతీయువకులకు శిక్షణనిచ్చారు. వారితో పాటు కొంతమంది సుశిక్షితులైన కౌన్సెలర్లు కూడా పాల్గొన్నారు. చదువుకోవాలనే ఆసక్తి లేకపోవడమనేది విద్యార్థుల నుంచి సర్వసాధారణంగా వచ్చే ఫిర్యాదు. సహ విద్యార్థులకు దగ్గర కాలేకపోవడమనేది మరో సమస్య. ఇలాంటి వాటికి మూల కారణాలేంటో వాళ్ల నుంచి తెలుసుకొని పలు కేసులు పరిష్కరించగలిగామని స్థానిక కౌన్సెలర్ రాజీవ్ కుమార్ చెప్పారు. మంచి ఫలితాలు ఇవ్వగల ఇలాంటి ప్రాజెక్టు అమలుకు అయ్యే ఖర్చు తక్కువేనని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు కౌమర దశలో.. దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు కౌమార దశలో ఉన్నవారే. కీలకమైన ఈ దశలో వారి వికాసానికి తోడ్పడేందుకు ప్రభుత్వాలు తగిన కార్యక్రమాలు చేపట్టా ల్సివుంది. 2014లో కేంద్రం తీసుకొచ్చిన ‘రాష్ట్రీయ కిశోర స్వాస్థ్య కార్యక్రమం’ఇందుకు ఉద్దేశించిందే. ఇలాంటి వాటిని సక్ర మంగా అమలు చేసినట్టయితే ‘నలంద’తరహా అనుకూల ఫలితాలను ప్రతిచోటా మనం గమనించవచ్చు. యుక్తవయసు వారికి సరైన కౌన్సెలింగ్ ఇస్తే వారి భవిష్యత్ను సరైన దిశలో మళ్లించిన వాళ్లమవుతాం అంటోంది ‘సంగత్’ అనే ఎన్జీవో. -
ఎదుగుదల లోపం..భారత్లోనే అధికం!
న్యూఢిల్లీ: ఎదుగుదల లోపంతో బాధపడే పిల్లల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని మంగళవారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడైంది. దేశంలో ఏకంగా 4 కోట్ల 80 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. దీని బట్టి ప్రతీ ఐదుగురు చిన్నారుల్లో ఇద్దరు ఈ లోపంతో ఉన్నారని తేలింది. అంతర్జాతీయ అభివృద్ధి చారిటీ సంస్థ ‘వాటర్ ఎయిడ్’ ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 కోట్లకుపైగా చిన్నారులు ఈ సమస్యతో బాధపడుతున్నారిని సర్వే పేర్కొంది. భారత్లో అత్యధిక ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారని, ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితులే...పిల్లల ఎదుగుదల, తక్కువ బరువు సమస్యల కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని సంస్థ పేర్కొంది. భారత్ తర్వాత వరుసగా నైజీరియా, పాకిస్తాన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఆరున్నర కోట్ల మందికి కనీసం తాగడానికి మంచి నీరు దొరికే పరిస్థితులు లేవని, అదేవిధంగా రెండు కోట్లకుపైగా జనాలకు సరైన మరుగుదొడ్డి సదుపాయాలు లేవని నివేదికలో వెల్లడైంది. అపరిశుభ్రత కారణంగా ప్రతిఏడాది సుమారు 3 లక్షలకుపైగా చిన్నారులు మృత్యువాత పడుతున్నారని సర్వే తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రతీ దేశం కృషిచేయాలని ఇటీవలే ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో తీర్మానించాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement