-
డీపీఐఐటీ కార్యదర్శి.. గురుప్రసాద్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్ర పరిశ్రమలు, ఇంటర్నల్ ట్రేడ్ విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్ మొహపాత్ర (59) కన్నుమూశారు. కరోనా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం మరణించారని ఎయిమ్స్ ప్రకటించింది. అనారోగ్య కారణాలతో ఏప్రిల్ మధ్యలో ఆయన ఆస్పత్రిలో చేరారు. పదవిలో ఉండగా కరోనా కారణంగా మరణించిన మొదటి కార్యదర్శి ఆయనే కావడం గమనార్హం. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకెంతో బాధను కలిగించిందని పేర్కొన్నారు. గుజరాత్లోనూ, కేంద్రంలోనూ ఆయనతో కలసి పని చేసినట్లు వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. గురుప్రసాద్ ఎంతో నిర్మాణాత్మకంగా పని చేసేవారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి పియూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేబినెట్ కార్యదర్శి రాజివ్ గౌబా కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. గుజరాత్ కేడర్కు చెందిన గురుప్రసాద్ 1986 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. చదవండి: (ఫోన్ మాట్లాడుతూ.. రెండు డోసులు?) -
చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు
గుత్తి: చెక్ బౌన్స్ కేసులో దోషి హెచ్సీ గురు ప్రసాద్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఏడీజే కే.వెంకటరమణారెడ్డి బుధవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. బళ్లారికి చెందిన హెచ్సీ గురుప్రసాద్ గుంతకల్లుకు చెందిన నూర్ మహ్మద్ల మధ్య వ్యాపార లావాదేవీలున్నాయి. నూర్ మహ్మద్కు గురుప్రసాద్ ఏడున్నర లక్షలు బాకీ పడ్డాడు. బాకీ తీర్చడం కోసం నూర్మహ్మద్కు గురుప్రసాద్ చెక్ ఇచ్చాడు. అయితే ఆ చెక్ బౌ¯Œ్స అయింది. దీంతో నూర్మహ్మద్ గుంతకల్లు పోలీసు స్టేష¯ŒSలో కేసు పెట్టాడు. పలు విచారణల అనంతరం కేసు బుధవారం తుది విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో గురు ప్రసాద్కు ఏడాది శిక్షతో పాటు ఏడున్నర లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఏడీజే తీర్పు చెప్పారు. ప్రాసిక్యూష¯ŒS తరఫున ఎంవీ మహేష్కుమార్ వాదించారు. -
కోపముంటే నన్ను చంపాల్సింది...నా పిల్లలేం పాపం చేశారు?
ఏ బంధాన్నైనా తెంచుకోవడం సులభం... కలుపుకోవడం కష్టం. అది తెలిసే ఏ భార్యా తన వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని అనుకోదు. పిల్లల బాగు కోసమో... సమాజం ఏమంటుందో అన్న భయానికో ఆ అడుగు వేయదు. కానీ భర్త మృగంగా మారి హింసిస్తున్నప్పుడు కూడా అలా తలొగ్గి ఉండటం ఎంతవరకూ సబబు? జీవితమంతా కాపాడతాడనుకున్న మనిషి, జీవితాన్నే కాలరాస్తున్నప్పుడు... కీడెంచి మేలెంచకుండా మౌనంగా ఉండిపోవడం ఎంతవరకూ సమంజసం? కాస్త కష్టమైనా ముందే ఓ కఠిన నిర్ణయం తీసేసుకుంటే అనర్థాలు ఆగవా? మహిళల్ని సంరక్షించడానికే 498 ఎ చట్టాన్ని చేశానంటోంది ప్రభుత్వం. మహిళలు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆ చట్టాన్ని రద్దు చేయమని అంటోంది పురుష సమాజంలోని ఓ వర్గం. అలా చేయడం ఎంతవరకూ సమర్థనీయం? ఇప్పుడివన్నీ మాట్లాడ్డానికి కారణం సుహాసిని. ఈ ప్రశ్నలన్నీ తలెత్తడానికి కారణం... ఆమె జీవితంలో సంభవించిన పెను విషాదం! సుహాసిని తన బిడ్డల కోసం నరకం లాంటి జీవితాన్ని స్తబ్దుగా నెట్టుకొచ్చింది. చివరికి ఆ స్తబ్దతే ఆమె జీవితంలో మిగిలింది. కట్టుకున్న భర్తే కాలయుముడై తన కన్నబిడ్డల ప్రాణాల్ని హరిస్తే... కన్నీరు మున్నీరవుతున్న ఆ కన్నతల్లితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ ఇది! ఎలా ఉన్నారు సుహాసినిగారూ? సుహాసిని: కళ్లు మూసినా, తెరిచినా పిల్లలే గుర్తొస్తున్నారు. వాళ్లు నా పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. పోయినవారం... సరిగ్గా ఇదే రోజు (ఇంటర్వ్యూ చేసిన రోజు)... నా పిల్లల్ని నేను చూసుకున్న చివరి రోజు... అసలా రోజు ఏం జరిగిందో చెబుతారా? ఎప్పటిలానే వచ్చాడు. పిల్లల్ని తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత మళ్లీ ఒక్కడే వచ్చాడు. పిల్లలేరని అడిగితే, గుడిలో భోంచేస్తున్నారని చెప్పాడు. నన్నూ రమ్మన్నాడు. నేను రాను, పిల్లల్ని తీసుకు రమ్మని చెప్పాను. వెళ్లిపోయాడు. కానీ ఎంతసేపటికీ తీసుకురాలేదు. ఎన్ని మెసేజులు ఇచ్చినా రిప్లై లేదు. నాలుగున్నర వరకూ చూసి ఫోన్ చేశాను. పోలీసులు లిఫ్ట్ చేశారు. తను రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. షాకయ్యాను. పిల్లలేమైపోయారో తెలియలేదు. నన్ను ఏడిపించడానికి ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడనుకున్నాను. కానీ తన ఫోన్లో ఉన్న మెసేజ్ని చూశాకగానీ అర్థం కాలేదు... జరిగిన దారుణం! పిల్లల్ని తీసుకెళ్లేపు్పుడు తనలో ఏ మార్పూ కన్పించలేదా? లేదు. ఎప్పటిలానే వచ్చాడు, తీసుకెళ్లాడు. ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదు. పిల్లలు సరదా పడ్డారని ఆ రోజు బ్యాంగ్బ్యాంగ్ సినిమాకి తీసుకెళ్తానన్నాను. దాంతో వెళ్లడానికి వాళ్లిష్టపడలేదు. వెళ్లిరండి, సినిమాకి సాయంత్రం తీసుకెళ్తాలే అని సర్దిచెప్పి పంపించాను. (కన్నీళ్లతో) కానీ వాళ్లు మళ్లీ రారని, నేనెప్పటికీ వాళ్లను చూడలేనని అనుకోలేదు. ఆయన ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నారంటారు? నేను తనకి దూరంగా వచ్చేశానని, తన దగ్గరకు వెళ్లడం లేదని నామీద కక్ష కట్టాడు. ఆ కసితోనే వాళ్లను పొట్టనబెట్టుకున్నాడు. వాళ్ల అమాయక ముఖాలు చూసయినా జాలి వేయలేదతనికి! తనలో హింసా ప్రవృత్తి ముందెప్పుడూ కనిపించలేదా? తను శాడిస్టని తెలుసు. కానీ పిల్లల్ని చంపుకునేంత కసాయివాడని మాత్రం తెలియలేదు. పెళ్లయిన నాటి నుంచీ నన్ను చిత్ర హింసలు పెట్టాడు. ఎంతసేపూ డబ్బు డబ్బు డబ్బు. సంపాదించినదంతా తన చేతిలోనే పెట్టేదాన్ని. నా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్కులు... అన్నీ తన దగ్గరే ఉండేవి. వారానికింత అని పాకెట్ మనీ ఇచ్చేవాడు. ఫోన్ రీచార్జ్ కూడా తనే చేసేవాడు. చివరికి నా సంతకాలు ఫోర్జరీ కూడా చేసేవాడు. అడిగితే చిత్రవధ చేసేవాడు. తొమ్మిదేళ్లు నరకం చూశాను. ఇంట్లోవాళ్లకు చెప్పలేదా? చెప్పినా సర్దుకుపొమ్మన్నారా? వాళ్లెప్పుడూ అలా చెప్పలేదు. నేనే సర్దుకుపోవడానికి ట్రై చేసేదాన్ని. మావాళ్లు మాట్లాడినప్పుడు బాగా చూసుకుంటాననేవాడు. వాళ్లు వెళ్లాక మళ్లీ మామూలే. అతని తరఫు వాళ్లయితే వాళ్ల ఎదురుగానే నన్ను కొడుతున్నా అడ్డుపడేవారు కాదు. మా అత్తగారుమాతోనే ఉండేది. నన్ను చిత్రహింస పెడుతున్నా ఏనాడూ కొడుకుని వారించలేదావిడ. ఇవాళ అతడు నా పిల్లల్ని పొట్టనబెట్టుకుంటే వాళ్లలో ఏ ఒక్కరూ ఫోన్ చేసి పలకరించలేదంటే ఏమనాలి! మీరొక ఇండిపెండెంట్ ఉమన్ అయివుండీ, పిల్లల్ని పెంచుకోగల స్తోమత ఉండీ ఆ హింస ఎందుకు భరించారు? ఇన్ని సంవత్సరాల తర్వాత కేసు ఎందుకు పెట్టారు? విడిపోతే ఎక్కువ సంపాదిస్తోందని అహంభావం అని అందరూ అనుకుంటారేమోనని భయం. దానికితోడు నా పిల్లలకు తండ్రిని దూరం చేయకూడదని కూడా అనుకున్నాను. కానీ తను పిల్లల్ని కూడా హింసించడం మొదలుపెట్టాడు. టీవీ చూడనిచ్చేవాడు కాదు. ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ ఏదీ తిననిచ్చేవాడు కాదు. రోజూ పప్పన్నమే. తినకపోతే కొట్టేవాడు. వాతలు పెట్టేవాడు. తట్టుకోలేక పోయాను. పైగా అతణ్ని చూసి వారిలోనూ అలాంటి ప్రవృత్తి పెరుగుతుందేమోనని భయపడ్డాను. అందుకే వచ్చేశాను. అయినా వదలకుండా వేధిస్తుంటే కేసు పెట్టక తప్పలేదు. కానీ అది తప్పుడు కేసంటూ ఉత్తరాలు రాశాడు కదా? తప్పుడు కేసు పెట్టేదాన్నే అయితే తొమ్మిదేళ్లు ఆ హింస భరించేదాన్ని కాదు. నేనెప్పుడూ కాపురాన్ని సరి చేసుకోవాలని, అతణ్ని మార్చుకోవాలనే చూశాను. ఇక భరించలేని పరిస్థితి వచ్చాక కేసు పెట్టాను. 498 ఎ చట్టాన్ని తీసేయమంటూ ఎవరెవరికో ఉత్తరాలు రాశాడు. కానీ ఆ చట్టం లేకపోతే నాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి! చూశారుగా తనెంత దారుణమైన మనిషో! కాల్ రికార్డ్స్ చూస్తే... తాను చనిపోతానని ముందే హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది కదా? ఎప్పుడూ అలా బెదిరిస్తూనే ఉండేవాడు. నన్ను తన దారిలోకి తెచ్చుకోవడానికి అదొక అస్త్రం తనకి. అందుకే పట్టించుకోలేదు. అయినా ఆ రికార్డ్స్ ఇప్పటివి కావు. ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ రికార్డ్ చేసి, అన్నిటినీ అతికి మీడియా వాళ్లకు పంపించాడు. అందుకే అందులో నా మాటలేం సరిగ్గా ఉండవు. తను నన్ను బతిమాలుతున్న మాటలే ఉంటాయి. అవి కావాలని మాట్లాడి రికార్డ్ చేసుకున్నాడు, తాను మంచివాడినని నిరూపించుకోవడం కోసం. అందులో నిజమెంతో తెలుసుకోకుండా మీడియా ప్రసారం చేసేసింది. ఆ కాల్ రికార్డ్లో... కాగితం మీద సంతకం పెట్టనని పదే పదే అన్నాడు కదా, ఏమిటా కాగితం? తనకి నా మీదసలు ప్రేమే లేదు. నేను తన దగ్గరికి ఎందుకు వెళ్లను అని పంతం! అందుకే మా పెద్దవాళ్లు... నాకేదైనా అయితే తనదే బాధ్యత అని రాసిన కాగితం మీద సంతకం పెట్టమన్నారు. కానీ అతను పెట్టడని నాకు ముందే తెలుసు. ఎందుకంటే, హింసించడం అతడి తత్వం. అలా చేయకుండా అతడు ఉండలేడు. మరి ఇన్ని తెలిసీ పిల్లల కస్టడీకి మీరు ఎందుకు ఒప్పుకున్నారు? నేను ఒప్పుకోలేదు. అతను మంచివాడు కాదని మొత్తుకున్నాను. కానీ కోర్టు నా మాట వినలేదు. ఇప్పుడేమయ్యింది! నా పిల్లల్ని కోర్టు తెచ్చివ్వగలదా?! ఒకవేళ కేసు పెట్టకుండా ఉన్నా.. అతడితోనే కలిసున్నా పిల్లలు దక్కివుండేవారని ఇప్పుడనిపిస్తోందా? ఏది ఎందుకు జరిగిందో ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. నాకు నా పిల్లలు కావాలి. వాళ్లు లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను. వాళ్ల కోసం ఎన్నో భరించాను. వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు వాళ్లే లేకుండా పోయారు. ఇక నా జీవితానికి అర్థమేముంది? అతనికి అంతగా నామీద కోపముంటే నన్ను చంపాల్సింది. నా పిల్లల్నెందుకు చంపాలి? వాళ్లేం పాపం చేశారు? సుహాసిని సంధించిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి గురుప్రసాద్ బతికి లేడు. పోనీ ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గరయినా ఉందా?! అభం శుభం తెలియనివాళ్లు. అమ్మానాన్నలు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా అర్థం చేసుకోలేని పసివాళ్లు. అన్యాయంగా అసువులు బాశారు. విరించి, విహారిలే కాదు... తల్లిదండ్రుల సమస్యలకి, వారి మధ్య కోపతాపాలకి మధ్య జీవితాలను, ప్రాణాలను కోల్పోతున్న చిన్నారులు చాలామందే ఉన్నారు. తల్లి పసుపుతాడు బిడ్డలకు ఉరితాడు అవ్వడం న్యాయమా? తండ్రి పంతం పిల్లల ప్రాణాలు తీసే యమపాశమవ్వడం ధర్మమా? ఆలోచించండి! సంభాషణ: సమీర నేలపూడి ఈ పరిస్థితిని ముందే అంచనా వేయవచ్చు! ఒక వ్యక్తి మానసిక స్థితిని బట్టి, ప్రవర్తనను బట్టి జరగబోయే అనర్థాలను ముందుగానే అంచనా వేయవచ్చు. భర్త హింసిస్తున్నా సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతోనో, తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారన్న ఉద్దేశంతోనో మౌనంగా భరించే మహిళలు చాలామంది ఉన్నారు. అయితే అతడలా ప్రవర్తించడానికి కారణం వ్యక్తిత్వ లోపం కావచ్చు. ఏదైనా మానసిక వ్యాధి కావచ్చు. ఒక్కసారి వైద్యుడిని కలిసి భర్త ప్రవర్తన గురించి చెబితే, అతడికేదైనా మానసిక సమస్య ఉందా అన్నది వాళ్లు కనిపెడతారు. దానికి చికిత్స చేయిస్తే అతడు మంచిగా మారవచ్చు. ఇలాంటి ఘోరాలకు పాల్పడకపోవచ్చు. ఒకవేళ వారు ట్రీట్మెంట్కి ఒప్పుకోకపోతే, మెంటల్హెల్త్ యాక్ట్ (సెక్షన్ 23)ని ఆశ్రయించవచ్చు. దాని ప్రకారం... ఒక వ్యక్తిలో తనను తాను కానీ, ఇతరులను కానీ హింసించే లక్షణాలు ఉంటే అతడికి బలవంతంగా కూడా చికిత్స చేయించవచ్చు. కాబట్టి హింసాత్మక ప్రవృత్తి కనిపించగానే వైద్యుల సలహా తీసుకుంటే... ఇలాంటి ఘోరాలు జరగకుండా అడ్డుకునే అవకాశం దొరుకుతుంది. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై., సైకియాట్రిస్టు చట్టాల్ని తప్పు పట్టకూడదు! ఎంత నాణ్యమైన బియ్యంలోనైనా ఒకటో రెండో రాళ్లు ఉంటాయి. మంచి ముత్యాల్లో కూడా ఒకటి రెండు నకిలీవి తగులుతుంటాయి. అందుకని మొత్తాన్నీ పారేయలేం కదా! చట్టాలూ అంతే. అప్పటి పరిస్థితులను బట్టి, అంతవరకూ చూసిన కేసుల్ని బట్టి రూపొందుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒకటో రెండో తప్పుడు కేసులు వచ్చాయని అసలు ఆ చట్టమే సరికాదంటే ఎలా? 498 ఎ అక్కడక్కడా దుర్వినియోగం అవుతోందన్నది నిజమే కావచ్చు. కానీ, కొందరలా చేశారని చట్టాన్నే లేకుండా చేస్తే నిజమైన బాధితుల పరిస్థితేం కావాలి! కాకపోతే మారుతున్న పరిస్థితులను బట్టి, మానసిక ప్రవృత్తులను బట్టి చట్టాల్లో మార్పులు జరగాలి. భర్త తనని వేధిస్తున్నాడని ఓ భార్య కేసు పెట్టినప్పుడు... అతడి ప్రవర్తన మీద నిఘా ఉంచాలి. ఆమె చెప్పింది నిజమని తేలితే ఆలస్యం చేయకుండా తీర్పు వెలువరించాలి. ఎందుకంటే ఆలస్యం జరిగేకొద్దీ మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. అది కొన్నిసార్లు హింసకు పాల్పడేలా ప్రేరేపిస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణమవుతుంది! - ఎస్.ప్రదీప్ కుమార్, న్యాయవాది -
అనుబంధమా... బలి కోరొద్దు!
పిల్లలను చంపి పెద్దలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలొ ఎక్కువయ్యాయి. తల్లిదండ్రుల మధ్య గొడవల్లో పిల్లలు బలిపశులవుతున్న దారుణోదంతాలు అధికమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విద్యావంతులు కూడా విచక్షణ కోల్పోయి ఇలాంటి ఘోరాలకు పాల్పడుతుండడం మరింత భయాందోళన కలిగిస్తోంది. కడప, హైదరాబాద్ లలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఘటనలు వర్తమాన సమాజ విపరీత వైఖరికి అద్దం పట్టేలా ఉన్నాయి. జూన్ 26న ఉత్తరప్రదేశ్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మనీష్ సాహూ(36) తన భార్య శ్వేతతో పాటు కుమారుడు యష్(5)ను కిరాతకంగా చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని మైహోమ్ అపార్ట్మెంట్ లో అతడీ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇక్ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన ఇద్దరు కొడుకులను చంపి, పాతిపెట్టి తర్వాత తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. కడపలో కృపాకర్ అనే వ్యక్తి భార్యాపిల్లలను తాను కూడా తనువు చాలించాడు. ఆర్థిక, వివాహేతర సంబంధాలు ఆలుమగల మధ్య వివాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయి. విద్యావంతుల విషయానికి వచ్చేసరికి వృతిపరమైన ఒత్తిడి, అహం, ఆధునిక జీవనవిధానం తదితర కారణాలు కాపురాల్లో చిచ్చు రాజేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ సమానమేనన్న భావన కొరవడిన కుటుంబాలు కల్లోలాల బారిన పడుతున్నాయి. ఆధిపత్య ధోరణి ఆలుమగల మధ్య అగాధం పెంచుతోంది. మరోపక్క వృత్తిపరమైన ఒత్తిడి కూడా వైవాహిక సంబంధాల విచ్ఛిన్నానికి కారణమవుతోంది. సాఫీగా సాగిపోతున్న సంసారంలో కలతలు ఏర్పడితే జీవితాలు తారుమారవుతున్నాయి. దాంపత్య గొడవలతో భార్యాభర్తలు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. తీవ్రమనోవేదనకు లోనయి క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రక్తంపంచుకు పుట్టినవారిని, జీవితాన్ని పంచుకున్న వారిని కడతేర్చి.. తమ జీవితాన్ని అర్థాంతంగా ముగించేందుకు వెనుకాడని నిస్సృహలోనికి కూరుకుపోతున్నారు. ప్రతిసమస్యకు పరిష్కారం ఉంది. అయితే సమస్యను గుర్తించి, దానికి తగిన పరిష్కారం చేయనప్పుడే ఉపద్రవాలు ఎదురవుతున్నాయి. ఆలుమగల మధ్య అనుబంధం బలంగా ఉంటే సమస్యలు వాటికవే సమసిపోతాయి. -
సుహాసిని వేధింపుల వల్లే గురుప్రసాద్ ఆత్మహత్య?
హైదరాబాద్: భార్య సుహాసిని వేధింపుల వల్లే ఇక్ఫాయ్ ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా గురు ప్రసాద్ తన ఇద్దరు పిల్లలు విఠల్ విరించి(9), నందవిహారి(5)లను హత్య చేసి, ఆ తరువాత తనూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తమ కోడలు సుహాసిని వ్యవహరించిన తీరు వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు వారు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవరో ఒకరి తప్పు మాత్రమే ఉంటుందని చెప్పలేమని పలువురు అంటున్నారు. పూర్తీగా సుహాసిని వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు భావించలేమని అంటున్నారు. ఇద్దరి తప్పు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇద్దరు పిల్లలను చంపడంలోనే అతని మానసిక పరిస్థితి అర్ధమవుతోందని న్యాయవాది కిరణ్ అన్నారు. విభేదాలు, విడిపోవడం వల్ల తను ఎంత బాధపడ్డాడో, తన భార్య కూడా అదే విధంగా బాధపడాలన్న ఉద్దేశంతోనే అతను పిల్లలను హత్య చేసి ఉంటాడని అన్నారు. 498ఏ చట్టం దుర్వినియోగం అవుతున్నట్లు తెలిపారు. భర్త వల్ల ఇబ్బందులు ఎదురైతో భార్యలు భర్తతోపాటు అత్త,మామ, ఆడబిడ్డ.. ఇలా కుటుంబ సభ్యులు అందరిపైన కేసు పెడుతున్నారని చెప్పారు. ఆ చట్టంలో మార్పు తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. ఈ రోజు ఉదయం సాక్షి టీవీ చిట్చాట్లో సినిమా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఇటువంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. ఇంతటి దారుణానికి పాల్పడే ముందు ఒక్కసారి ఆలోచించాలన్నారు. పిల్లల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరం అన్నారు. కష్టసుఖాలు ఉంటుంటాయని చెప్పారు. ఎవరైనా ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు వాటిని జయించడానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. గురుప్రాసాద్ పిల్లలు చక్కగా, ముద్దుగా ఉన్నారని, వారిని హత్య చేయడం చాలా బాధవేసిందన్నారు. ఎవరూ ఇటువంటి దారుణానికి ఒడికట్టవద్దని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. **
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement