-
బెంగళూరు ఎయిర్పోర్టుకు జీవీకే గుడ్బై
♦ మిగిలిన 10 శాతం వాటా విక్రయం ♦ ఫెయిర్ఫ్యాక్స్ వాటా 48 శాతానికి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్.. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (బీఐఏఎల్) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. బీఐఏఎల్లో జీవీకే వద్ద మిగిలిన 10 శాతం వాటాను ఫెయిర్ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్కు రూ.1,290 కోట్లకు విక్రయించనున్నట్టు తెలిపింది. 2017 జూలై ప్రారంభంలో ఈ లావాదేవీ పూర్తి అయ్యే అవకాశం ఉందని జీవీకే వెల్లడించింది. డీల్ పూర్తి కాగానే కంపెనీ బోర్డు నుంచి కో–చైర్మన్ జీవీకే రెడ్డి, ఎండీ సంజయ్ రెడ్డి తప్పుకోనున్నట్టు సమాచారం. విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని జీవీకే గ్రూప్ రుణ భారం తగ్గించుకోవడానికి ఉపయోగించనుంది. బీఐఏఎల్లో 33% వాటాను ఫెయిర్ఫ్యాక్స్ ఇండియాకు రూ.2,202 కోట్లకు విక్రయించేందుకు 2016 మార్చిలో జీవీకే ఒప్పందం కుదుర్చుకుంది. 2017 మార్చిలో ఈ డీల్ పూర్తి అయింది. అలాగే బీఐఏఎల్లో ఫ్లూగఫెన్ జూరిచ్ ఏజీ నుంచి 5 శాతం వాటాను ఫెయిర్ఫ్యాక్స్ కైవసం చేసుకుంది కూడా. దీంతో కంపెనీలో ఫెయిర్ఫ్యాక్స్ వాటా 38 శాతానికి చేరింది. శుక్రవారం నాటి డీల్తో ఈ వాటా కాస్తా 48 శాతానికి ఎగసింది. ఎయిర్పోర్ట్స్ రంగంపైనే..: బెంగళూరు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నప్పటికీ, ఎయిర్పోర్ట్స్ రంగం తమ సంస్థకు కీలకమని జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తదుపరి దృష్టి ముంబై, నవీ ముంబై ఎయిర్పోర్టులపై ఉంటుందని చెప్పారు. ఈ రంగంలో ప్రైవేటీకరణ అవకాశాలపై ఫోకస్ చేస్తామన్నారు. కాగా, 2009 నవంబర్లో బీఐఏఎల్లో 12 శాతం వాటాను జూరిచ్ ఎయిర్పోర్టు నుంచి జీవీకే దక్కించుకుంది. అలాగే లార్సెన్ అండ్ టూబ్రో నుంచి 17 శాతం కొనుగోలు చేసింది. సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్స్ నుంచి కైవసం చేసుకున్న వాటాతో బీఐఏఎల్లో జీవీకే వాటా 43 శాతానికి చేరింది. ప్రస్తుతం బీఐఏఎల్లో అతి పెద్ద వాటాదారుగా ఫెయిర్ఫ్యాక్స్ నిలిచింది. బీఎస్ఈలో శుక్రవారం జీవీకే ఇన్ఫ్రా షేరు ధర 14.45% పెరిగి రూ.5.94 వద్ద క్లోజయ్యింది. -
జీవీకే పవర్ కు పెరిగిన నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 2015-16 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర నష్టాలు అధికమయ్యాయి. ఈ కాలంలో నికర నష్టం రూ.407 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర నష్టం రూ.108 కోట్లు నమోదైంది. టర్నోవర్ రూ.846 కోట్ల నుంచి రూ.1,081 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరానికి నికర నష్టం రూ.834 కోట్ల నుంచి రూ.934 కోట్లకు పెరిగింది. టర్నోవరు రూ.3,049 కోట్ల నుంచి రూ.4,164 కోట్లుగా ఉంది. గ్యాస్ సరఫరా సరిగా లేక ప్లాంట్లు పూర్తి స్థాయిలో నడవకపోవడం నష్టాలకు దారి తీసిందని కంపెనీ తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement