-
ఆవూ పోయే, ఆనందమూ పోయే
గోరక్షక మంత్రిత్వ శాఖ, హ్యాపీనెస్ శాఖ .. ఇవీ ఈ మధ్యకాలంలో కొత్తగా ఏర్పాటైన మంత్రిత్వ శాఖలు. వాటిని తొలిసారి నిర్వహించిన మంత్రులిద్దరూ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రాజస్తాన్లో వసుంధరా రాజె కేబినెట్లో గోరక్షక మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేసిన ఒటారమ్ దేవాసి 10 వేల ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి చేతిలో కంగుతిన్నారు. ఇక మధ్యప్రదేశ్ హ్యాపీనెస్ శాఖ మంత్రి లాల్సింగ్ ఆర్య కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో 25 వేల ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. గోసంక్షరణ ఉద్దేశం మంచిదే అయినా ఆ సాకుతో మూకదాడులకు పాల్పడటమే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2015లో గోరక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేవాసి రాజస్తాన్లో కొత్తగా ఆస్తులు కొనుక్కునే వారిపై గో పన్ను అంటూ 20 శాతం సర్చార్జ్ విధించారు. గోవుల్ని రక్షించడానికి 2,300 షెల్టర్లు ఏర్పాటు చేశారు. అయితే 2016లో ప్రభుత్వ గోశాలల్లో 500గోవులు ఆకలికి తాళలేక మరణించడంతో దేవాసిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకే విష ప్రయోగంతో మరిన్ని ఆవులు చనిపోయాయన్న వార్తలతో దేవాసి ప్రతిష్ట పూర్తిగా మంట గలిసింది. ఇక, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రజలు సంతోష స్థాయిలు పెంచడమే లక్ష్యంగా మధ్యప్రదేశ్లో హ్యాపినెస్ మంత్రిత్వ శాఖను సీఎం శివరాజ్సింగ్ కొత్తగా సృష్టించి లాల్సింగ్ ఆర్యను మంత్రిగా నియమించారు. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసుకోవడం కోసం ఆర్య భూటాన్ తరహాలో సంతోష సూచీ తయారీకి మార్గదర్శకాలు రూపొందించారు. 2009లో జరిగిన తన ప్రత్యర్థి హత్యానేరం కేసు మెడకు చుట్టుకోవడంతో ఆర్య జీవితంలో సంతోషం లేకుండా పోయింది. -
ఆనందమానంద ‘మాయనే’
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజల ఆనందోత్సవాలను కోరుకుంటోంది. అందుకని ఆ రాష్ట్రంలో ఓ అనంద విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సహాయక పునరావాస మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఆ విభాగం రూపురేఖలు ఎలా ఉండాలో నిర్ణయించేందుకు ఓ ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ప్రభుత్వం హయాంలో ఓ ఆనంద విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే కొత్త కాదు. విలక్షణమైనదీ కాదు. భూటాన్ రాజు 1979లోనే ఇలాంటి విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్’ అని కూడా దానికి పేరు పెట్టారు. దేశాభివద్ధిని కొలవడానికి ఇది ప్రత్యామ్నాయ సూచిక అవుతుందన్న ఉద్దేశంతోనే ఆయన దీనికి అంకురార్పణ చేశారు. ఆ తర్వాత 2008లో ఈ విభాగాన్ని దేశ రాజ్యాంగంలో కూడా చేర్చారు. ఆ తర్వాత వెనిజులా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు ప్రజల ఆనందం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశాయి. ఈ దేశాలను స్ఫూర్తిగా తీసుకున్న భారత్లోని మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేశంలో తొలిసారి హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసింది. అది 2016, ఆగస్టు నెల నుంచి అమల్లోకి వచ్చింది. అదే బాటలో రాష్ట్ర ఆర్థికాభివద్ధిని అంచనావేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నెలలో ‘హ్యాపినెస్ ఇండెక్స్’ను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లో ఆనంద విభాగం ఏర్పాటై దాదాపు ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంలో ఈ విభాగం సాధించినది ఏమిటంటే గ్రామాల్లో పిల్లలు, పెద్దల మధ్య ఆటల పోటీలు నిర్వహించారట. పండగలు, పబ్బాలు జరిపారట. సభలు ఏర్పాటు చేసి ఆనందంగా జీవించడం ఎలాగో పాఠాలు చెప్పారట. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు 32 వేల మంది ‘ఆనందక్స్ (ఆనంద కార్యకర్తలు)’ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారట. ఇక ఆనంద విభాగం వెబ్సైట్లో ప్రజలు ఆనందంగా ఉండాలంటే సానుకూల దక్పథాన్ని అలవర్చుకోవాలంటూ ఉపన్యాసాలు ఉన్నాయి. సగం గ్లాసులో నీళ్లు ఉంటే సగం గ్లాసు ఖాళీగా ఉందనుకోకుండా సగం గ్లాసు నీళ్లు ఉన్నాయనుకోవాలనే ఉదాహరణలు ఉన్నాయి. హ్యాపినెస్ క్యాలెండర్ ఒకటి ఉంది. ఆ క్యాలెండర్లో రోజువారిగా ప్రజలు తాము చేసిన మంచి పనులను, తప్తినిచ్చిన అంశాలను నమోదు చేసుకోవాలని, ఎవరెవరి నుంచి సహాయం తీసుకున్నామో కూడా నోట్ చేసుకొని వారికి కతజ్ఞతలు తెలియజేయాలని సూచనలు ఉన్నాయి. ఖరగ్పూర్ ఐఐటీ ద్వారా ఓ హ్యాపినెస్ ఇండెక్స్ను కూడా రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అదెందుకో కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు. అసలు ఆనందానికి నిజమైన భాష్యమేమిటో చెప్పలేదు. ప్రజల ఆర్థిక పరిస్థితికి, ఆనందానికున్న అనుబంధాన్నీ వివరించలేదు. మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసిన ఆనంద విభాగం ప్రచార పటాటోపమే తప్ప దాని వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని పలు ఎన్జీవో సంస్థలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర క్రీడలు, సంస్కతి, ఆరోగ్య, విద్యా శాఖల ఆధ్వర్యంలో గతంలో కూడా తమ గ్రామాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించేవారని, ఇప్పుడు ఆ కార్యక్రమాలనే ఆనంద క్రీడలు, ఆనంద సంస్కతి కార్యక్రమాలు, ఆనంద సభలు, ఆనంద ఆరోగ్య శిబిరాలు అని పిలుస్తున్నారని బర్వాణి జిల్లాకు చెందిన జర్నలిస్ట్ హేమంత్ గార్గ్, సామాజిక కార్యకర్త అజయ్ దూబె వ్యాఖ్యానించారు. మొదటి నుంచి అన్ని విధాల వెనకబడిన మధ్యప్రదేశ్ను అభివద్ధికి కషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రచార పటాటోపం కోసం ప్రజా సొమ్మును వధా చేస్తోందని వారు విమర్శించారు. ఐక్యరాజ్యసమితి అభివద్ధి విభాగం (యూఎన్డీపీ) లెక్కల ప్రకారం భారత్లో అత్యంత వెనకబడిన వంద జిల్లాల్లో దాదాపు 50 జిల్లాలు మధ్యప్రదేశ్కు చెందినవే. మానవ అభివద్ధి సూచికలో అట్టడుగు స్థానంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటని బెంగళూరుకు చెందిన ‘పబ్లిక్ అఫేర్స్ సెంటర్’ అని స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించింది. పౌష్టికాహారలోపంతో మరణిస్తున్న పిల్లల సంఖ్యకూడా ఎక్కువే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల నుంచి దళితుల వరకు, ఉద్యోగుల నుంచి చప్రాసీల వరకు వివిధ వర్గాల ప్రజలు ఎప్పుడు ఆందోళనలు చేస్తుంటారు. ఆందోళన చేస్తున్న రైతులపై మంగళవారం తూటాలు పేలడంతో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఐదుగురు మరణించారు. ఇదంతా ఎవరి ఆనందం కోసం?
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement