-
VHT 2023: రాణా అజేయ శతకం.. ఫైనల్లో హర్యానా
విజయ్ హజారే ట్రోఫీ 2023లో హర్యానా ఫైనల్స్కు చేరింది. తమిళనాడుతో ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు 63 పరుగుల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. హిమాన్షు రాణా (118 బంతుల్లో 116 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), అన్షుల్ కంబోజ్ (9-0-30-4) హర్యానా గెలుపులో కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా.. హిమాన్షు అజేయ శతకంతో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగుల చేసింది. హర్యానా ఇన్నింగ్స్లో హిమాన్షుతో పాటు యువరాజ్ సింగ్ (65), సుమిత్ కుమార్ (48) ఓ మోస్తరుగా రాణించారు. తమిళనాడు బౌలర్లలో టి నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సాయికిషోర్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన తమిళనాడు.. మీడియం పేసర్ అన్షుల్ కంబోజ్ చెలరేగడంతో 47.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై, ఓటమిపాలైంది. హర్యానా బౌలర్లలో రాహుల్ తెవాటియా 2, సుమిత కుమార్, నిషాంత్ సింధు, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్లో బాబా ఇంద్రజిత్ (64) టాప్ స్కోరర్గా నిలువగా.. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. టోర్నీలో భాగంగా కర్ణాటక, రాజస్థాన్ జట్ల మధ్య రేపు (డిసెంబర్ 14) రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో హర్యానా ఈనెల 16న ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. -
కుర్రాళ్లు లెక్క సరిచేశారు
ఇంగ్లండ్ అండర్–19 జట్టుపై భారత్ ఘన విజయం ముంబై: బ్యాట్స్మెన్తోపాటు బౌలర్లు కూడా రాణించడంతో... ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత అండర్–19 జట్టు 129 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలి వన్డేలో 23 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్ రెండో మ్యాచ్లో నెగ్గి ఐదు వన్డేల సిరీస్ను 1–1తో సమం చేసింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. ఓపెనర్ హిమాన్షు రాణా (66 బంతుల్లో 58; 10 ఫోర్లు), హార్విక్ దేశాయ్ (62 బంతుల్లో 75; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... కమలేశ్ నాగర్కోటి (32 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు), శుభ్మన్ గిల్ (24), అభిషేక్ శర్మ (24) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ నాలుగు, హెన్రీ బ్రూక్స్ మూడు వికెట్లు తీశారు. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 33.4 ఓవర్లలో 158 పరుగులకు కుప్పకూలింది. రాలిన్స్ (35 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడినా... మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. భారత్ తరఫున స్పిన్నర్ అనుకూల్ రాయ్ మూడు వికెట్లు పడగొట్టగా... శివమ్, ఇషాన్ పోరెల్లకు రెండేసి వికెట్లు లభించాయి. సిరీస్లోని మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది.
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement