-
హాకీలో స్వర్ణం ఆశలు: మాజీ కెప్టెన్ అశోక్ ధ్యాన్ చంద్
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు దూసుకుపోతోంది. క్వార్టర్ ఫైనల్స్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి సెమీస్లోకి ఎంటరవ్వడం మాత్రమే కాదు సరికొత్త చరిత్రను లిఖించుకుంది. దీనిపై హాకీ మాజీ కెప్టెన్ అశోక్ ధ్యాన్ చంద్ స్పందించారు. మ్యాచ్ మొత్తంలో ఎక్కడా ఒక్క పొరపాటు కూడా చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఆస్ట్రేలియా ఆశలు గల్లంతయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘనత అంతా డీఫెన్స్, గోల్ కీపర్ గుర్జీత్కే దక్కుతుందని ప్రశంసించారు. ఈ విజయంతో బంగారం పతకం ఆశలకు మహిళల జట్టు మరింత చేరుకుందన్నారు. హాకీలో స్వర్ణం భారత్కు వారసత్వంగా వస్తోంది. గోల్డ్ సాధించి ఈ లెగసీని మహిళల జట్టు సాధించనుందనే ఆశాభావాన్ని ధ్యాన్ చంద్ వ్యక్తం చేశారు. భారత మహిళల హాకీ జట్టుపై దేశవ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది. పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులతోపాటు భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఫారెల్ కూడా హాకీ జట్టును అభినందించారు. 'గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా' సవితా పునియాను ఓడించలేమని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సెమీ, గ్రాండ్ ఫైనల్స్కు శుభాకాంక్షలు అందించారు. అమ్మాయిలు మీరు చరిత్ర సృష్టించారు! నమ్మశక్యంకానీ ఆటతీరును ప్రదర్శించారు. ఇక గోల్డ్ మెడల్ తీసుకురండి" అని భారత మాజీ ఆటగాడు లాజరస్ బార్లా ట్వీట్ చేశారు. కాగా ఉత్కంఠ సాగుతున్న మ్యాచ్లో గుర్జీత్ సంచలన గోల్ కొట్టి భారత్కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో భారత మహిళల హాకీ జట్టు తొలిసారి సెమీస్లో అడుగుపెట్టింది. ఇది చరిత్రలో నిలిచిపోయే గోల్ అంటూటోక్యో 2020 ఫర్ ఇండియా ట్వీట్ చేయడం విశేషం. అటు 49 ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. I didn't see a single weak spot in the game. Australian team was left hopeless. The credit goes to defence and the goalkeeper. We are too close to winning a medal. Getting gold medal in Hockey is India's legacy and we all hope for the best: Ashok Dhyan Chand, ex-Hockey captain pic.twitter.com/iaQTzThBsJ — ANI (@ANI) August 2, 2021 Girls you created HISTORY! Unbelievable performance. Let's do it this time, bring the yellow metal home.#Olympics2020 #Hockey https://t.co/EYd0GJ8BhV — Lazarus Barla (@LazarusBarla) August 2, 2021 -
'ఆ వార్త విని షాక్ అయ్యాను'
న్యూఢిల్లీ: భారత మహిళ హాకీ జట్టు నుంచి తనను తప్పించడంపై రీతూ రాణి ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఎందుకు జట్టులోంచి తీసేసారో చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకుంది. చాలాకాలంగా భారత మహిళ హాకీ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న రీతూనూ రియో ఒలింపిక్స్ కు వెళ్లే జట్టులో స్థానం కల్పించలేదు. గత కొంతకాలంగా రీతూ ప్రదర్శనతో పాటు ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ఆమెపై వేటు వేశారు. రీతూ స్థానంలో సుశీల్ చానుకు కెప్టెన్ గా నియమించారు. 'ఈ వార్త విని షాకయ్యాను. ఫిట్నెస్, ప్రవర్తన సమస్యలు లేవు. ట్రైనింగ్, క్యాంపులకు నేను గైర్హాజరు కాలేదు. క్యాంపుకు బ్రేక్ ఇచ్చినప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయింది. జట్టులోంచి తీసేయడంతో నన్ను పెళ్లిచేసుకోబోయే వ్యక్తి చాలా బాధ పడ్డాడు. వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్న పురుషుల హాకీ జట్టు ప్లేయర్ సర్దార్ సింగ్ ను కెప్టెన్ పదవి నుంచి తీసేసినా, టీమ్ లో ఉంచారు. నన్ను మాత్రం ఏకంగా జట్టులోంచి తొలగించారు. నాకు ఈవిధంగా ఎందుకు చేశార'ని రీతూ రాణి ప్రశ్నించింది. తనపై అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొంది. ఒలింపిక్స్ మ్యాచ్ లను టీవీలో చూడాల్సిన పరిస్థితి తనకు వస్తుందని ఊహించలేదని వాపోయింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement