-
Genocide: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే...
మారణహోమం అనేది మానవత్వాన్ని సమూలంగా మంటగలిపే దుశ్చర్య. 1941లో జరిగిన హోలోకాస్ట్ మారణహోమం ప్రపంచంలోనే అతిపెద్దదని చెబుతారు. ఈ ఘటనకు 82 ఏళ్లు దాటాయి. జర్మన్ నియంత హిట్లర్ సారధ్యంలో జరిగిన ఈ దారుణ మారణ హోమంలో ఏకంగా 60 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇంతేకాదు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సందర్భాలలో మారణహోమాలు చోటు చేసుకున్నాయి. వాటిలో అత్యంత భీకరమైన 5 మారణ హోమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హోలోకాస్ట్లో 60 లక్షల యూదులు... 1939లో జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధానికి కాలుదువ్వింది. హిట్లర్ యూదులనందరినీ తుదముట్టించడానికి తన వ్యూహాలను అమలు చేశాడు. 1941లో ఆష్విట్జ్లోని నాజీ హోలోకాస్ట్ సెంటర్లోని హిట్లర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి యూరప్లోని పలు దేశాల నుండి యూదులను తీసుకువచ్చారని చెబుతారు. తరువాత వృద్ధులను, వికలాంగులను గ్యాస్ ఛాంబర్లలో పెట్టి హత్య చేశారు. వీరి గుర్తింపు పత్రాలన్నింటినీ ధ్వంసం చేసి, వారి చేతులపై ప్రత్యేక గుర్తును వేశారు. ఈ శిబిరంలో యూదులను నాజీ సైనికులు రకరకాలుగా హింసించేవారు. వారు యూదులకు శిరోముండనం చేసేవారు. చాలీచాలనంత ఆహారం ఇచ్చేవారు. విపరీతమైన చలిలో కూడా వారికి ధరించడానికి దుస్తులు ఇచ్చేవారు కాదు. వీరిలో ఎవరైనా అనారోగ్యం పాలయినా లేదా పని చేయలేని స్థితిలో ఉన్నా వారిని గ్యాస్ ఛాంబర్లో ఉంచేవారు. లేదా కొట్టి చంపేవారు. ఖైదీలకు బహిరంగ శిక్ష విధించేవారు. తద్వారా అక్కడున్న ఇతరులను భయాందోళనలకు గురిచేసేవారు. హోలోకాస్ట్లో సుమారు 60 లక్షల యూదులు హత్యకు గురయ్యారని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. ఇది నాటి యూదుల జనాభాలో మూడింట రెండు వంతులని చరిత్ర చెబుతోంది. కంబోడియా మారణహోమం దక్షిణ అమెరికా దేశమైన కంబోడియాలో 1970వ దశాబ్ధంలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పోల్ పాట్ నాయకత్వంలో ఖైమర్ రూజ్ పాలనలో ప్రజలపై విపరీతమైన దౌర్జన్యాలు జరిగాయి. 1975 నుంచి 1979 సంవత్సరాల మధ్య సుమారు 20 లక్షల మంది మరణించారు. ఈ సంఖ్య నాటి కంబోడియా మొత్తం జనాభాలో నాలుగింట ఒక వంతు అని చెబుతారు. పాల్ పాట్, ఖైమర్ రూజ్లకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, దాని నియంత మావో జెడాంగ్ మద్దతు పలికారు. ఖైమర్ రూజ్కు 90 శాతం విదేశీ సహాయం చైనా నుండి వచ్చినట్లు అంచనాలున్నాయి. ఇందులో ఆర్థిక, సైనిక సహాయం కూడా ఉంది. ఏప్రిల్ 1975లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఖైమర్ రూజ్.. అల్ట్రా-మావోయిజం విధానాల ఆధారంగా సాంస్కృతిక విప్లవం ద్వారా దేశాన్ని సోషలిస్ట్ అగ్రేరియన్ రిపబ్లిక్గా మార్చడానికి ప్రయత్నించారు. అధిక పని, ఆకలి, పెద్ద ఎత్తున మరణశిక్షల కారణంగా ఈ పాలనలో సుమారు 20 లక్షల మంది మరణించారు. అయితే 1978లో వియత్నామీస్ సైన్యం దాడి చేసి ఖైమర్ రూజ్ పాలనను అంతమొందించడంతో ఈ మారణహోమం ముగిసింది. ఇది కూడా చదవండి: పళ్లను చూసి పెళ్లాడేస్తారు.. రష్యా సర్కాసియన్ మారణహోమం 1864లో రష్యా సారధ్యంలో సర్కాసియన్ మారణహోమం చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల పాటు జరిగిన ఈ మారణహోమంలో రష్యా సైన్యం సాగించిన దురాగతాల కారణంగా 2.5 మిలియన్ల మంది మరణించారు. ఆ సమయంలో 90 శాతం సర్కాసియన్ ప్రజలు రష్యా సైన్యం చేతిలో హతమయ్యారు. కొందరు తరిమివేతకు గురయ్యారు. నాటి రష్యా సైన్యం దురాగతాలు గుర్తుకు వచ్చినప్పుడు ఇప్పటికీ ఆక్కడి ప్రజలు భయంతో వణికిపోతారు. నాటికాలంలో రష్యన్ సైనికులు సిర్కాసియన్ గర్భిణుల కడుపులను చీల్చి, లోపలి శిశువులకు బయటకు తీసేవారని చెబుతారు. ఇంతోకాదు గర్భిణుల కడుపులోని పిండాలను బయటకు తీసి కుక్కల ముందు విసిరేవారని చరిత్ర చెబుతోంది. రష్యన్ జనరల్ గ్రిగరీ ఇక్కడి ప్రజలపై ఎన్నో శాస్త్రీయ ప్రయోగాలు చేసేవాడు. తన ప్రయోగాలలో ఏదైనా విఫలమైనప్పుడు, అతను వారిని చంపేసేవాడు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఇక్కడి ప్రజలు ఆశ్రయం కోసం పొరుగు దేశమైన టర్కీకి పారిపోయేవారు. ఆర్మేనియన్ మారణహోమం ఆర్మేనియా, ఇతర చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం 1915లో ఒట్టోమన్ సైన్యం 15 లక్షల మందిని హత్యచేసింది. ఇది ఆర్మేనియా, టర్కీ మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో లక్షలాది యూదుల ఊచకోత, వారిపై జరిగిన దురాగతాల గురించి ఎంత చర్చ జరిగిందో, మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన ఆర్మేనియన్ పౌరులు గురించి ఆ స్థాయిలో చర్చ జరగకపోవడం విశేషం. ఆర్మేనియా ప్రజలపై తాను పాల్పడిన విధ్వంసానికి టర్కీ ఏనాడూ బహిరంగంగా క్షమాపణలు చెప్పలేదు. దీనికి విరుద్ధంగా టర్కీకిచెందిన ఇస్లామిక్ నియంత రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆమధ్య ఆర్మేనియాపై జరిగిన యుద్ధంలో అజర్బైజాన్కు మద్దతు పలికారు. అజర్బైజాన్కు అవసరమైన అన్ని సహాయాలను అందించారు. ఇది ఆర్మేనియన్ సైన్యానికి భారీ నష్టాన్ని కలిగించింది. బోస్నియా మారణహోమం ఒక అంచనా ప్రకారం ఈ మారణకాండలో బోస్నియా సెర్బ్ సైనికులు ఏకంగా 8 వేల మంది ముస్లింలను హత్యచేశారు. మృతులలో ఎక్కువ మంది 12 నుంచి 77 ఏళ్ల మధ్య వయసు వారేకావడం విశేషం. ఈ ఊచకోత చాలా భయంకరంగా సాగింది. చాలా మంది ప్రజలను పాయింట్ బ్లాంక్ రేంజ్లో (నుదుటి మధ్య) కాల్చారు. ఈ ఊచకోత తరువాత బోస్నియా మాజీ సెర్బ్ కమాండర్ జనరల్ రాట్కో మ్లాడిక్ కసాయిగా పేరొందాడు. 1992లో యుగోస్లేవియా విడిపోయిన సమయంలో బోస్నియన్ ముస్లింలు, క్రొయేషియన్లు స్వాతంత్ర్యంపై ప్రజాభిప్రాయ సేకరణకు అనుకూలంగా ఓటు వేశారు. సెర్బియన్లు దీనిని బహిష్కరించారు. కొత్త దేశం ఎలా ఏర్పడుతుందనే అంశంపై సెర్బ్ సమాజం- ముస్లిం సమాజం మధ్య వివాదం చెలరేగింది. ఆ సమయంలో సెర్బ్లు, ముస్లింలకు మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇరువర్గాలు తుపాకులతో దాడికి తలపడ్డాయి. ఈ అంతర్యుద్ధంలో వేలాది మంది మరణించగా లక్షలాదిమంది వలసబాట పట్టారు. ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్ప్రెస్ రైలు -
గూగుల్ మెచ్చిన డైరీ... నాటి అమానవీయ పరిస్థితులకు అద్దం పట్టేలా..
ప్రత్యేకత సంతరించుకున్నరోజులను గూగుల్ తన డూడుల్ స్లైడ్ షోతో తెలియపరుస్తుంది. ఆ రోజు ప్రాముఖ్యతను ఈ డూడుల్ షో మనకు స్పురింపజేస్తుంది. ఇంతవరకు మనం ఎన్నో పుస్తకాల గురించి విన్నాం. ఎందరో రచయితలు ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు.. వాటిల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలూ ఉన్నాయి. కానీ ఈరోజు గూగుల్ స్లైడ్ షో ఒక యువతి రాసిన డైరీని దాని సారాంశం గురించి తెలియజేసింది. ఏంటా డైరీ? ఏమిటీ దాని ప్రత్యేకత? ఎందుకు గూగుల్ సైతం ఆ డైరీకి ప్రాముఖ్యత ఇచ్చిందో తెలుసుకుందాం! వివరాల్లోకెళ్తే...హోలో కాస్ట్ బాధితురాలు (జాతి ప్రక్షాళన లేదా సాముహిక విధ్వంసం) అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాలకు సంబంధించిన డైరీ. ఈ డైరీ ప్రచురణకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా గూగుల్ ఈ అందమైన డూడుల్ షోతో తెలియపరిచింది. ఈ డూడుల్ని ఆర్ట్ డైరెక్టర్ థోకా మేర్ రూపొందించారు. అన్నే ఫ్రాంక్ కేవలం15 ఏళ్ల వయసులో ఈ డైరీని రాసింది. ఆమె యూదు డచ్ జర్మన్. అన్నే ఫ్రాంక్ జూన్ 12, 1929న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఒట్టో, ఎడిత్ ఫ్రాంక్లకు జన్మించారు. ఐతే ఆమె కుటుంబం నాజీ పార్టీ చేస్తున్న హింస, వివక్షత నుంచి తప్పించుకోవడానికి నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్కు తరలివెళ్లింది. ఆమెకు 10 ఏళ్ల వయసులో ఉండగా రెండోవ ప్రపంచ యుద్ధం రాజుకుంది. దీంతో అన్నే కుటుంబం ఆమె తండ్రి కార్యాలయంలోని రహస్య ప్రదేశంలో తలదాచుకుంది. ఐతే నాజీ సీక్రెట్ సర్వీస్ వారిని గుర్తించి నిర్బంధానికి తరలించింది. ఆమె 15 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న అవమానీయ పరిస్థితులును, సంఘటనలను తన డైరీలో పొందుపరిచింది. ఆ తర్వాత ఆ డైరీని పుస్తకంగా ప్రచురించారు. కాలక్రమేణ నాన్ ఫిక్షన్ రచనలలో ఒకటిగా మారింది. అంతేకాదు 80 కంటే ఎక్కువ భాషల్లో అనువదింపబడిన అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాల దొంతర. నాటి వివక్ష, దౌర్జన్యం, భయంకరమైన ప్రమాదాల గురించి రానున్న తరాలు తెలుసుకునేలా అవగాహన కల్పించడానికి ఒక ముఖ్య సాధనంగా ఉపకరిస్తుంది. Dear Kitty, Today, we are revisiting the day #AnneFrank’s greatest wish came true. Our #GoogleDoodle marks the day ‘The Diary of a Young Girl’ was published, which held a first-hand account of Anne about the years she spent in hiding: https://t.co/kNmBipFoUb. pic.twitter.com/je8SkNuqpF — Google India (@GoogleIndia) June 25, 2022 -
ప్రపంచ యుద్ధాల సాక్షి ఇక లేరు
ఇజ్రాయెల్: ప్రపంచ కురువృద్ధుడు యెజ్రాయెల్ క్రిస్టల్(113) కన్నుమూశారు. యెజ్రాయెల్ 1903 సెప్టెంబర్ 15న జన్మించి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గత ఏడాది ప్రపంచ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. ఆయన పోలాండ్లో జన్మించారు. రెండు ప్రపంచ యుద్ధాలకు యెజ్రాయెల్ ప్రత్యక్ష సాక్షిగా నిలవడమే కాకుండా ఆ యుద్ధాలను చవి చూసి మరణం అంచుల వరకు పోయి మృత్యుంజయుడుగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతని మొదటి భార్య, కుటుంబ సభ్యులు నాజీల చేతిలో హత్యకు గురయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం యెజ్రాయిల్ మళ్లీ వివాహం చేసుకుని ఇజ్రాయిల్కు వలస వచ్చారు. ఇజ్రాయెల్లోని హైఫా నగరంలోని తన ఇంట్లో (113 ఏళ్ల 330 రోజులు జీవించి) మృతిచెందారు. అతని మృతిపట్ల ప్రపంచవ్యాప్తంగా నివాళులు వెల్లువెత్తుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement