-
గొల్లప్రోలులో చోరీ
గొల్లప్రోలు : స్థానిక శివాలయం వీధిలో ఉన్న చక్రవర్తుల సత్యనారాయణ ఇంటిలో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న 82 గ్రాముల బంగారు అభరణాలు, రూ.లక్ష అపహరణకు గురైంది. సంఘటనపై పోలీసులు, యజమాని సత్యనారాయణ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మెయిన్రోడ్డులోని సాయిబాబాగుడిలో సత్యనారాయణ అర్చకునిగా పనిచేస్తున్నారు. ఈనెల 19న కుటుంబసమేతంగా షిర్డీ తీర్థయాత్రకు వెళ్లి బుధవారం రాత్రి 10 గంటలకు తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటి గది తలపులు తెరిచి, బీరువాలోని బట్టలు, సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని వారు గుర్తించా రు. బీరువాలో భద్రపరచిన రెండు బంగారు చైన్లు, రెండు నల్లపూసల గొలుసులు, నాలుగు గాజులు, మేటీలు, చెంపసవరాలు, చెవిదిద్దులతోపాటు సుమారు రూ.లక్ష నగదు చోరీ జరిగిందని సత్యనారాయణ తెలిపారు. సుమారు 82 గ్రాముల బంగారు చోరీకి గురైనట్టు ఆయన అన్నారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు గురువారం ఉదయం ఎస్సై పి. బుజ్జిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. క్లూస్టీం సిబ్బంది వేలిముద్రలను, నమూనాలను సేకరించారు. స్థానికంగా తెలిసిన వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసి వెండి వస్తువుల జోలికి వెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ ఏడాదీ అరకు ఉత్సవ్
మునగపాక, న్యూస్లైన్ : ఇంట్లో వారు తిరుపతి వెళ్లారు.. యజమాని మాత్రం ఒక్కరే ఇంట్లో ఉన్నారు. మరేం జరిగిందో తెలియదు కానీ ఆయన జాడ లేకుండా పోయింది. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతోపాటు విలువైన సామగ్రి అదృశ్యమయింది. ఇంటి నిండా కారం చల్లి ఉండడంతో ఏం జరిగిందో ఏమిటోనన్న భయం నెలకొంది. మండల కేంద్రమైన మునగపాకలో ఒక వ్యక్తి అదృశ్యం కావడం, ఇంట్లో వస్తువులు పాటు అపహరణకు గురి కావడంతో కలకలం నెలకొంది. అదృశ్యమైన వ్యక్తి కుటుంబ సభ్యుల, పోలీసుల సమాచారం ప్రకారం.. మునగపాకలోని పల్లపు వీధిలో పొలమరశెట్టి రామచంద్రరావు, అతని భార్య మహలక్షమ్మ నివసిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు కొడుకులున్నారు. కొడుకులిద్దరూ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద కొడుకు అప్పలనాయుడు ఇటీవల మునగపాక వచ్చాడు. కుమార్తెలకు వివాహాలు జరిగినా కుటుంబ కలహాల కారణంగా తల్లితండ్రుల వద్దే ఉంటున్నారు. రామచంద్రరావు భార్య మహలక్షమ్మ, అప్పలనాయుడు, కూతుళ్లు ఈ నెల 10న తిరుపతి పయనమయ్యారు. రామచంద్రరావు మాత్రం ఇంటివద్దే ఉండిపోయారు. తిరుపతి నుంచి అప్పలనాయుడు గత మూడు రోజులుగా తండ్రికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ అనే వస్తూ ఉండడంతో అతడు ఆందోళనతో గ్రామంలోని తన స్నేహితుడు వేగి శివ గణేశ్కు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి తండ్రి బాగోగులు వాకబు చేయాలని కోరాడు. గణేశ్ మంగళవారం రాత్రి రామచంద్రరావు ఇంటికి వెళ్లి చూడగా వంటగది తలుపు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు గమనించి స్థానికులకు సమాచారం అందించాడు. చుట్టుపక్కల వారు వచ్చి, ఇల్లంతా కారం జల్లి ఉండడాన్ని గమనించారు. ఇంట్లో వస్తువులు చెల్లాచెదుైరె నట్లు గుర్తించి పోలీసులకు తెలిపారు. మునగపాక ఎస్ఐ జోగారావు ఆ రాత్రే సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంటి యజమాని అదృశ్యమైనట్టు గుర్తించారు. గణేశ్ బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యక్తి అదృశ్యం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెండి సామగ్రి మాయం రామచంద్రరావు కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం తిరుపతి నుంచి ఇంటికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో ఇంట్లో గదులు పరిశీలించగా, ప్రధాన గదిలోని బీరువా తెరిచి ఉన్నట్టు గమనించారు. బీరువాలోని మూడు కిలోల వెండి సామగ్రి, రూ. 10 వేల నగదు, కొన్ని డాక్యుమెంట్లు మాయమయ్యాయని, అదే గదిలోని ఎల్సీడీ టీవీ కూడా కనిపించడం లేదని గుర్తించారు. తిరుపతి వెళ్తూ ఉండడంతో ఇంట్లోని బంగారు నగలను బ్యాంకులోని లాకర్లో భద్రపరిచినట్టు రామచంద్రరావు భార్య మహలక్షమ్మ తెలిపారు. ఈ సంఘటనతో మహలక్షమ్మ, కొడుకు, కూతుళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు ఇంటి వద్ద గుమికూడి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
బహిరంగ చర్చ.. మోదీ, రాహుల్ గాంధీలకు ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
జీవితాలు ఖరాబ్.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ తాగుతున్నారా!..వెలుగులోకి షాకింగ్ విషయాలు
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement