-
హంతకులకు కేంద్ర మంత్రి సన్మానం!
హజారీబాగ్: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా వివాదంలో చిక్కుకున్నారు. గతేడాది ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు శుక్రవారం ఆయన పూల మాలలు వేసి సన్మానించారు. ప్రతిపక్షాలు మంత్రి చర్యను ఖండించాయి. నిందితులకు మిఠాయిలు తినిపించిన జయంత్ సిన్హా..న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని, తప్పకుండా న్యాయం జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు. తన నియోజకవర్గానికి చెందిన వారంతా విడుదలవడం ఎంతో సంతోషంగా ఉందని, వారికి న్యాయం జరిగేలా చూడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తమకు లాయర్ను ఏర్పాటుచేసిన మంత్రికి 8 మంది నిందితులు ధన్యవాదాలు తెలిపారు. విద్వేషపూరిత, విభజన రాజకీయాలు సమాజాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. జయంత్ సిన్హా తీరు హేయమైనదని జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హై డ్రామా!
- భాస్కరరావు, అశ్విన్రావును కాపాడే యత్నం సాగుతోంది - కేసును సీబీఐకి అప్పగించకుండా ప్రభుత్వం నాటకాలాడుతోంది - ప్రభుత్వంపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే మండిపాటు సాక్షి, బెంగళూరు: లోకాయుక్త సంస్థకున్న గౌరవ మర్యాదలను మంటగలిపిన న్యాయమూర్తి వై.భాస్కర్రావు, ఆయన కుమారుడు అశ్విన్రావును రక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే విమర్శించారు. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించకుండా నాటకాలాడుతోందంటూ తీవ్రంగా మండిపడ్డా రు. ‘భూ కబ్జాల వ్యతిరేక పోరాట సమితి’ ఆధ్వర్యంలో శనివారమిక్కడి శాసకర భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంతోష్ హెగ్డే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లోకాయుక్త సంస్థ న్యాయమూర్తిగా పనిచేస్తున్న భాస్కర్రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం(ఎస్ఐటీ)ను ఏర్పాటు చేసిందని, అయితే ఎస్ఐటీకి కేవలం ఫిర్యాదులు నమోదు చేసుకునే అధికారాన్ని మా త్రమే కల్పించిందని అన్నారు. కనీసం ఎఫ్ఐర్ నమో దు చేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు కూడా చేయలేని సందర్భంలో ఇక ఎస్ఐటీని ఏర్పాటు చేసి ఏం లాభం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. న్యాయమూర్తి వై.భాస్కర్రావు అవినీతికి పాల్పడకపోయి ఉండవచ్చని, అయితే ఆయన కుమారుడు అశ్విన్రావు మాత్రం లోకాయుక్త పేరు చెప్పుకునే అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని అన్నారు. అందువల్ల ఇందుకు నైతిక బా ద్యత వహిస్తూ లోకాయుక్త స్థానానికి భాస్కరరావు రాజీనామా చేయాల్సి ఉందని అన్నారు. ఇక ఈ కేసును సీబీఐకి అప్పగించే అధికారాలు తమకు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందంటూ సంతోష్ హెగ్డే విమర్శించారు. లోకాయుక్త విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంతోష్హెగ్డే పేర్కొన్నారు. అనంతరం భూ కబ్జాల వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధి ఎ.టి.రామస్వామి మాట్లాడుతూ....లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్రావును ఆ పదవి నుంచి తప్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మౌనం వహించడం శోచనీయమని అన్నా రు. ఇక లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్రావు కూ డా లోకాయుక్త ప్రతిష్టను మరింత దిగజార్చేలా పదవిని పట్టుకొని వేలాడుతున్నారని మండిపడ్డారు. లోకాయుక్త సంస్థ ప్రతిష్టను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో స్వాతంత్య్ర సమర యోధుడు హెచ్.ఎస్.దొరెస్వామి తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement