-
28న విశాఖలో 1.43 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ఈ నెల 28న 1.43 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వీటిని అందజేస్తామని చెప్పారు. గురువారం విజయవాడలోని ఏపీ గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో మంత్రి జోగి రమేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన తొలి దశ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయడానికి కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలకు నిధుల సమస్య లేదని చెప్పారు. లబ్ధిదారులను చైతన్యపరిచి ఇంటి నిర్మాణాల వేగం పెంచాలని సూచించారు. ఇప్పటికే 24 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో లక్ష నిర్మాణాలను మే 15 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పురోగతిని ప్రతి రోజూ సమీక్షించాలని.. సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగి దీన్ని బాధ్యతగా భావించి పనిచేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. రోజుకు సగటున రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల విలువైన నిర్మాణ పనులు పూర్తి చేయటానికి చర్యలు చేపట్టామని తెలిపారు. సమీక్షలో గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే తదితరులు పాల్గొన్నారు. -
‘ఇళ్ల పట్టా’భిషేకం
సాక్షి, అమరావతి: ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ యోగం కల్పించే బృహత్తర యజ్ఞానికి సమయం ఆసన్నమైంది. దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి ఇళ్ల స్థల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణ భూమి పూజలను పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా రెండు వారాలపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ప్రారంభిస్తారు. 26 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు పట్టాల పంపిణీ చేయడంతోపాటు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అత్యంత పారదర్శకంగా, ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగని విధంగా ఇప్పటికే టిడ్కో ఇళ్లతో కలిపి 30.75 లక్షల మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. ఎంపికైన వారి పేర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డుల్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించారు. జాబితాలో పేరు లేని అర్హులుంటే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించి, అలా వచ్చిన అర్జీలను కూడా పరిశీలించి అర్హులైతే లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. లబ్ధిదారుల ఎంపిక ఇంత పకడ్బందీగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించిన తర్వాత కూడా సోషల్ ఆడిట్ నిర్వహించారు. అర్హులందరికీ ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఉదాత్త ఆశయంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా రూ.23,535 కోట్ల విలువైన 68,361 ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూములను సేకరించింది. భూమిని చదును చేసి వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో 17,004 కాలనీల్లో లేఅవుట్లు సిద్ధం చేసింది. రిజిస్ట్రేషన్ శాఖకు క్రిస్మస్ సెలవు రద్దు ఈ నెల 25న క్రిస్మస్/ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సెలవుగా ప్రకటించినప్పటికీ, టిడ్కో ఇళ్లను లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రారు కార్యాలయాలన్నీ మామూలుగా పని చేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. పొజిషన్ సర్టిఫికెట్లు కూడా.. ► 25వ తేదీ ఒక్కరోజే 2.62 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారుల పేరుతో విక్రయ రిజిస్ట్రేషన్కు రంగం సిద్ధం చేసింది. వీరందరికీ ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇంటిని అప్పగిస్తారు. అదేవిధంగా 365 చదరపు అడుగుల ఇంటికి లబ్ధిదారుడు తన వాటాగా రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఇంటికైతే రూ.లక్ష చెల్లించాల్సి ఉన్నప్పటికీ, అందులో సగం (365 చ.అ ఇంటికి రూ.25 వేలు, 430 చ.అ ఇంటికి రూ.50 వేలు) చెల్లిస్తే చాలని ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. మొత్తంగా టిక్కో ఇళ్లకు ప్రభుత్వంపై రూ.7,251.80 కోట్ల భారం పడుతోంది. ► ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని క్రమబద్ధీకరణ అర్హత పొందిన వారికి పొజిషన్ సర్టిఫికెట్లు కూడా ఇళ్లపట్టాలతోపాటు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ప్రతి లబ్ధిదారుకు స్థలం పట్టా/టిడ్కో ఇంటి రిజిస్ట్రేషన్ పత్రంతోపాటు సీఎం జగన్మోహన్రెడ్డి సంతకంతో కూడిన లేఖను అందజేస్తారు. కొమరగిరిలో చకచకా ఏర్పాట్లు ► తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో వైఎస్సార్ జగనన్న కాలనీ మోడల్ కాలనీగా రూపుదిద్దుకోనుంది. ఇక్కడి నుంచే ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ చేసి, గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు. వేదిక నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మోడల్ హౌస్, పైలాన్ ఏర్పాటు చేశారు. ► కొమరగిరి వైఎస్సార్ జగనన్న కాలనీ కోసం మొత్తం 367.58 ఎకరాలు సేకరించారు. ఇందులో 60 ఎకరాలను సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రం, పాఠశాలలు, పార్కులు, ఆట స్థలం కోసం కేటాయించారు. ► కాకినాడ అర్బన్ ప్రాంతానికి చెందిన 16,500 మంది లబ్ధిదారులకు ఇక్కడ ప్లాట్లు ఇవ్వనున్నారు. మొదటి దశలో ఇక్కడ 12,500 ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కాలనీ ప్రధాన రహదారి 60 అడుగుల వెడల్పుతో, అంతర్గత రోడ్లు 20 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేశారు. -
సొంతింటి సంబరం
అట్టహాసంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం పట్టాలు అందించిన సీఎం ఐడీహెచ్ కాలనీ వాసుల్లో ఆనందం నగరంలోని ఐడీహెచ్ కాలనీలో పేదల కోసం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. కొంతమంది లబ్ధిదారులకు ఆయనే స్వయంగా ఇళ్ల పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, టి.పద్మారావు తదితరులు పాల్గొన్నారు. బన్సీలాల్పేట్: సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఐడీహెచ్ కాలనీలో పేదల సామూహిక (డబుల్ బెడ్ రూమ్) ఇళ్ల ప్రారంభోత్సవాన్ని సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు, నాయిని నర్సింహారెడ్డిలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.25 గంటలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించి... ఇళ్లను ప్రారంభించారు. సికింద్రాబాద్ పరిసర మురికివాడల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఐడీహెచ్ కాలనీకి చేరుకున్నారు. సభా ప్రాంగణం మహిళలతో కిక్కిరిసిపొయింది. జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఇళ్లను రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సి.కనకారెడ్డి, మాధవరపు కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిపాలన, అర్బన్ విభాగం ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, జోనల్ కమిషనర్ హరి చందన దాసరి, డిప్యూటీ కమిషనర్ విజయరాజ్, హౌసింగ్ ఈఈ వెంకటదాస్ రెడ్డి, డిప్యూటీ ఈఈ రఘనందన్రావు, జలమండలి జీఎం మహేష్, డిప్యూటీ జీఎం హరుణాకర్రెడ్డి, మేనేజర్లు కృష్ణ, నాగరాజు, సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురామ్ శర్మ, తహసీల్దార్ విష్ణుసాగర్ తదితరులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తుండటంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బన్సీలాల్పేట్, సోమప్పమఠం, చిలకలగూడ, పార్సీగుట్ట, చింతబావి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి మాత్రమే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐడీహెచ్ కాలనీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్, దక్షిణామూర్తి, గజ్జెల శ్రీనివాస్, వినోద్, రాజు, సురేష్, టీఆర్ఎస్ నాయకులు ఎ. కృష్ణమూర్తి, ఏసూరి మహేష్, కె.దేవేందర్, సుధాకర్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి సీఎం భోజనం ఇళ్లను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ స్థానికులతో కలసి భోజనం చేశారు. దీంతో వారిలో ఆనందం వ్యక్తమైంది. వెల్లివిరిసిన ఆనందం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పక్కా ఇళ్ల నిర్మాణ కల సాకారం కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. నూతన ఇళ్ల నిర్మాణంతో తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు అందుకున్నారు. జి.జయమ్మ, రేణుకాబాయి, నందకుమారి, ఎం.లక్ష్మిలకు సీఎం స్వయంగా పట్టాలు అందించారు. సైడ్లైట్స్ మధ్యాహ్నం 2.15 గంటలకు సీఎం కేసీఆర్ ఐడీహెచ్ కాలనీకి చేరుకుని నూతన గృహాలను ప్రారంభించారు. సీఎం కేసీఆర్కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు.... లంబాడీ నృత్యాల మధ్య సీఎంను సభా స్థలికి తీసుకువచ్చారు. ీీసీఎం మాట్లాడుతున్నప్పుడు టపాసుల శ బ్దం వినిపించింది. దీంతో ఆయన ప్రసంగాన్ని ఆపి ‘శ్రీనివాస్ యాదవ్... కాల్చేటోడు మనోడేనా లేక...ఇంకెవడైనా మోపైయిండా?’ అని ప్రశ్నించడంతో సభలో నవ్వులు విరిశాయి. ీసీఎం మాట్లాడుతున్నప్పుడు సోమప్పమఠం బస్తీకి చెందిన మహిళలు లేచి కలువడానికి ప్రయత్నించగా...ఆయన స్పందిస్తూ.. ‘మీరు అక్కడే ఉండండి. తర్వాత మీ ముచ్చట వింటా...వినతులు తీసుకుంటా’నన్నారు. సీఎం కార్యక్రమం అనంతరం భోజనానికి వెళ్లారు. పెద్ద ఎత్తున మహిళలు ఆయనను కలువడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు ‘మా బాధలు వినరా? మమ్మల్ని పట్టించుకోరా? అంటూ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభించి సుమారు 8 నిమిషాల్లోనే ముగించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఐడీహెచ్ కాలనీ ప్రజలతో పాటు తాను కూడా సీఎం కేసీఆర్కు జన్మంతా రుణ పడి ఉంటానని పేర్కొనడం గమనార్హం. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన ప్రసంగంలో పేదలకు నిజమైన దీపావళి ఈ రోజు అంటూ సీఎం కేసీఆర్... తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందనలతో ముంచెత్తడం విశేషం.కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన ప్రసంగంలో సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జీవై కంపౌండ్, రామస్వామి కంపౌండ్, నీలం బాలయ్యదొడ్డి, బన్సీలాల్పేట్ మురికివాడల్లో ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొవాలని ప్రత్యేకంగాా కోరారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ‘ఇల్లు కట్టి చూడు...పెండ్లి చేసి చూడు’ అనే నానుడిని తెలంగాణ యాసలో చెబుతూ ఆకట్టుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆద్యంతం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావులు చెట్టాపట్టాలేసుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం కనిపించింది. ఇద్దరూ కలిసి గుసగుసలాడుతూ భోజనం చేస్తున్న దృశ్యాన్ని చాలా మంది సెల్ఫోన్లలో బంధించారు. నాటి రాజకీయ ప్రత్యర్థులు ... నేడు ఒకే క్యాబినెట్లో మంత్రులుగా ఉంటూ ముందుకు సాగుతున్న ైవె నంపై అంతా చర్చించుకున్నారు. సీఎం కేసీఆర్ వేదికపై జ్యోతి వెలిగించి అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను పిలిచి వేదిక ముందున్న వాళ్లను పక్కకు జరపాలని సూచించారు. దీంతో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి. పద్మారావులు వేదిక దిగి వచ్చి ముందున్న మీడియా ప్రతినిధులు, ఇతరులను పక్కకు తప్పించారు.{పారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరిసర మురికివాడల నుంచి వచ్చిన అనేక మంది మహిళలు మంత్రులు టి.పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లను చుట్టుముట్టి తమ బస్తీలలో పక్కాఇళ్లు నిర్మించాలని కోరారు. ఐడీహెచ్ కాలనీ పరిసర ప్రాంతాలు.... రోడ్లపై పెద్ద ఎత్తున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం కేసీఆర్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గోదాస్ కిరణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అమీర్పేట నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్క్లను ముఖాలకు తగిలించుకొని ద్విచక్ర వాహనాలపై బయలుదేరి వెళ్లారు.గతంలో సీఎం ఇక్కడకు వచ్చినప్పుడు ఇళ్లు కావాలని కోరాం. అప్పట్లో ఆయన ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని తిరిగి సీఎం దృష్టికి తీసుకెళ్దామంటే స్థానిక నాయకులు కలవనీయడం లేదంటూ అనూరాధ, పుష్పలత తదితర మహిళలు ఆరోపించారు. తమను సీఎం వద్దకు వెళ్లనివ్వాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఇంకొందరు తమకు ఎక్కువమంది సంతానం ఉన్నందున, ఎదిగిన పిల్లలకు కూడా సదుపాయంగా ఉండేందుకు రెండు ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- Paris Olympics 2024: ఒలింపిక్స్కు తెలంగాణ అమ్మాయి
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా
- బుల్ బ్యాక్ ర్యాలీ
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement