-
తిరుమల ఘాట్ రోడ్లో విరిగిపడిన భారీ వృక్షాలు
-
హోరు గాలి.. జోరు వాన
జిల్లాలో గాలివాన బీభత్సం పలుచోట్ల కూలిన భారీ వృక్షాలు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు అంధకారంలో గ్రామాలు పటాన్చెరు/చేగుంట/భెల్/ శివ్వంపేట: జిల్లాలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన గాలికి వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పటాన్చెరు పట్టణం వెంకటేశ్వర కాలనీ,ఆల్విన్ కాలనీల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో సరఫరా నిలిచిపోయింది. రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. అమీన్పూర్, కిష్టారెడ్డిపేట, పటేల్గూడ ప్రాంతాల్లోని 50 కాలనీలు అంధకారంలో ఉండిపోయాయి. చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామంలో మామిడిచెట్టు ఈదురుగాలులకు కూలిపోయింది. దీంతో పాడిగేదె చె ట్టుకింద పడి మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన జంగం కృష్ణ, జంగం స్వామిలకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో సుమారు వంద చెట్లు నేలకూలాయి. అనేక విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శివ్వంపేట మండలం పోతారంలో పౌల్ట్రీఫాం కూలిపోయింది. సుమారు 500 కోళ్లు మృతి చెందాయి. రూ. 6లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు. దొంతి, మగ్దుంపూర్, ఉసిరికపల్లిలో రేకుల ఇళ్ల పైకప్పులు కూలాయి. దీంతో భయభ్రాంతులకు గరైన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. తూప్రాన్-నర్సాపూర్ ప్రధాన రహధారి పక్కన చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. -
స్వార్థానికి నేలకొరిగి..
ప్రభుత్వభూముల్లో భారీ వృక్షాల్ని కూలగొడుతున్న అక్రమార్కులు మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం పిఠాపురం : ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నిలబడే సైన్యమది. భారీ వరదలను సైతం తట్టుకుని నిలదొక్కుకున్న ఆ వృక్షాలు.. అక్రమార్కుల ధనదాహానికి మాత్రం నేలకొరుగుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, ఆర్అండ్బీ తదితర శాఖలకు చెందిన భూముల్లోని వృక్షాలను స్మగ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. యథేచ్ఛగా కలప స్మగ్లింగ్ జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పిఠాపురం బ్రాంచి కెనాల్, ఏలేరు నీటి పారుదల శాఖ పరిధిలో భారీ వృక్షాలను కొద్ది రోజులుగా కొల్లగొడుతున్నారు. ఎలా జరుగుతోందంటే.. పంట కాలువల గట్లు, ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా, పోరంబోకు భూముల్లో ఉన్న చెట్లను అక్రమార్కులు గుర్తిస్తున్నారు. పట్టపగలే యథేచ్ఛగా వాటిని నరికేస్తున్నారు. ఎవరైనా అడిగితే.. రోడ్డు విస్తరణ, కాలువల అభివృద్ధి కోసం తొలగిస్తున్నట్టు నమ్మిస్తున్నారు. నెల రోజులుగా ఏలేరు కాలువకు ఇరువైపులా ఉన్న 38 భారీ వృక్షాలను కూలగొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. వీటి విలువ రూ.50 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. వీటిని కొన్ని సామిల్లులకు తరలించి, విక్రయిస్తున్నట్టు తెలిసింది. కొందరు వ్యాపారులు కాలువ పక్కనున్న పొలాల్లో చెట్లను కొనుగోలు చేసి, పనిలోపనిగా కాలువ గట్లపై ఉన్న చెట్లను నరికేస్తున్నారు. చెట్టు నరికాక ఆనవాళ్లు కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కువగా రాత్రివేళ చెట్లు నరుకుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇందుకోసం ఉదయం పూటే చెట్ల మొదళ్ల వద్ద శుభ్రం చేసుకుంటున్నారు. గట్లకు తూట్లు చెట్లను కొట్టవేయడం ద్వారా అక్రమార్కులు.. పంటకాలువల గట్లుకు తూట్లు పొడుస్తున్నారు. దీనివల్ల గట్లు బలహీనపడి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. ఏ ముప్పు ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు మొదలు నరికేందుకు గట్లను తవ్వేస్తుండడంతో.. నీటి ఉధృతికి గట్లు తెగిపోవడం ఖాయమని అంటున్నారు. పట్టించుకోని అధికారులు ఇటీవల పిఠాపురం-ఉప్పాడ, పిఠాపురం-సామర్లకోట ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా ఉన్న అనేక వృక్షాలను కొందరు అక్రమంగా తరలించుకుపోయారు. పిఠాపురం-ఉప్పాడ రోడ్డులో ఇరిగేషన్ శాఖకు చెందిన పంటకాలువలకు ఇరువైపులా ఉన్న చెట్లను పట్టపగలే నరికి, తరలించుకుపోయినా అధికారులు పట్టించుకోలేదు. కిర్లంపూడి నుంచి పిఠాపురం వరకు ఉన్న ఏలేరు కాలువకు ఇరువైపులా మామిడి, చింత, సుబాబుల్, జీడిమామిడి తదితర భారీ వృక్షాలు ఉన్నాయి. వీటిలో అత్యంత భారీ వృక్షాలను నెల రోజులుగా కూల్చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చెట్ల నరికివేతపై అధికారులకు ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని రైతులు చెబుతున్నారు. విచారణ జరిపిస్తాం ఏలేరు, పీబీసీ కాలువ గట్లపై చెట్లను నరికేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. సొంత భూముల్లో ఉన్న చెట్లను రైతులే నరుకుతున్నట్టు భావిస్తున్నాం. కాలువగట్లపై చెట్లను కూల్చడం నేరం. దీనిపై విచారణ జరిపిస్తాం. చెట్ల నరికివేతకు ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేవు. చెట్ల తొలగింపులో అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణ నిజం కాదు. - కృష్ణారావు, ఇరిగేషన్ డీఈ, ఏలేరు సెక్షన్ -
అంతటా తీవ్ర నష్టం
చోడవరం: చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పలు మండలాల్లో ‘హుదూద్’ విలయం సృష్టించింది. ఈదురుగాలులకు పలుచోట్ల భా రీవృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వరి, చెరకు, కంది, ఇతరపంటలతో పాటు కూరగాయలకు తీవ్రనష్టం వాటిల్లింది. పంట పొలాల్లోకి నీరు చేరింది. పలుచోట్ల ఈదురుగాలులకు వరి పంట పూర్తిగా నేలకొరిగింది. సుమారు వందల ఎకరాల్లో చెరకు పంటకు నష్టం వాటిల్లింది. అన్నదాతకు కోలుకోలేనిదెబ్బ తగిలింది. చోడవరం నియోజకవర్గంలోని చోడవరం, రావికమతం, రోలుగుంట, బుచ్చెయ్యపేట మండలాల్లో గాలులకు పలుచోట్ల పంటలు నేలమట్టమయ్యాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. టెలికాం సేవలు స్తంభించాయి. ఫోన్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రచండ గాలులకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. చోడవరంలోని తహశీల్దార్ కార్యాలయం పైకప్పు ఈదురుగాలులకు ఎగిరిపోయింది. రోడ్లకుఅడ్డంగా చెట్లు కూలిపోయాయి. వాగులు, చెరువులు నీటితో నిండిపోయాయి. కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చీడికాడ, బుచ్చెయ్యపేట, రావికమతం, మాడుగుల, కె.కోటపాడు, చోడవరం తదితర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎటు చూసినా చిమ్మచీకట్లు కమ్ముకోవడంతో ప్రజలు ఆందోళన చెందారు. -
జిల్లాలో గాలివాన బీభత్సం
న్యూస్లైన్ నెట్వర్క్: జిల్లాలో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని చర్ల, కూనవరం, చింతూరు, గుండాల, టేకులపల్లి మండలాల్లో గాలి దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చర్ల మండలంలో గాలిదుమారం.... చర్ల: చర్ల మండలంలో శనివారం సాయంత్రం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గాలిదుమారం కారణంగా పలు గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకొరి గాయి. పలుచోట్ల విద్యుత్ తీగలపై చెట్లు విరిగి పడ్డాయి. దీంతో తీగలు తెగడంతో పాటు, స్తంభాలు విరిగిపోయాయి. మండలంలోని రాళ్లగూడెంలో ఓ తాటి చెట్టుపై పిడుగుపడి భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. దేవరాపల్లి, కుదునూరు, ఆర్ కొత్తగూడెం, సత్యనారాయణపురం, కలివేరు, గాంధీనగరం తదితర గ్రామాల్లో పూరిళ్ల పైకప్పులు లేచిపోయాయి. దేవరాపల్లిలో 11కేవీ విద్యుత్ లైన్కు సంబంధించిన స్తంభాలు విరిగిపోగా, గొమ్ముగూడెంలో ఎల్టీ లైన్కు సంబంధించిన స్తంభం విరిగి పోయింది. చినమిడిసిలేరు, ఆంజనేయపురం, కలివేరు గ్రామాల్లో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు, తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లింగాపురం, గొంపల్లి, విజయకాలనీ, గుంపెన్నగూడెం తదితర గ్రామాలలో సైతం విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరా నిలిచిపోయింది. మండలంలోని సత్యనారాయణపురం, చర్ల విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని అన్నీ 11 కేవీ విద్యుత్ ఫీడర్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో మండలం మొత్తం అంధకారం నెలకొంది. చర్ల మండలంతో పాటు వెంకటాపురం వాజేడు మండలాలలకు వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్లో కూడా పలు చోట్లు చెట్లు తీగలపై పడడంతో ఆ రెండు మండలాల్లో సైతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గుండాలలో భారీ వర్షం... గుండాల: గుండాల మండలంలో శనివారం రాత్రి గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని పలువాగులు, వంకల్లో స్వల్పంగా నీటి మట్టం పెరిగింది. ఈ వర్షానికి మల్లన్నవాగు, కిన్నెరసాని, జలేరు, దున్నపోతులవాగు, ఏడుమెలికల వాగుల్లో నీటి ప్రవాహం పెరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతర్గత రోడ్లు బురదతో నిండిపోయాయి. ఇల్లెందు - గుండాల మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జిల వద్ద రోడ్డు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గాలిదుమారానికి పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. నిన్నమొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఊపిరిపీల్చుకున్నారు. కూనవరంలో గాలి దుమారం... కూనవరం: మండలంలో శనివారం రాత్రి ఒక్కసారిగా భారీగా గాలి దుమారం రావడంతో జనజీవనం అతలాకుతలం అయింది. మండలంలోని పల్లురు గ్రామంలో వందేళ్లనాటి భారీ వృక్షం ఒక పక్కనే ఉన్న సవలం భద్రమ్మ ఇంటిపై కూలింది. ఇంట్లోని వారంతా సమీప గ్రామంలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరుకావడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ ఇంట్లోని సామగ్రి మొత్తం ధ్వంసం అయింది. టేకులబోరు సమీపంలో ఓ చెట్టు రహదారిపై విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మర్రిగూడెం-పల్లూరు గ్రామాల మధ్య విద్యుత్ స్తంభం విరిగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. గాలివాన కారణంగా మండలం కేంద్రంలోని పళ్ల పైకప్పులు లేచిపోయాయి. సుమారు గంటన్నర పాటు వీచిన గాలిన వాన బీభత్సం కారణంగా అనేక చోట్లు చెట్లు విరిగి పడడంతో రాకపోకలు స్తంభించాయి. టేకులపల్లిలో వర్షం టేకులపల్లి: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రెయినేజీల్లో మురుగునీరు బయటకు వచ్చింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఈ వర్షంతో సేదతీరారు. మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. గాలి దుమారం కారణంగా మండలంలోని ముత్యాలంపాడు, బొమ్మనపల్లి పంచాయతీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చింతూరులో... చింతూరు: మండలంలో శనివారం సాయంత్రం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. చింతూరు, మోతుగూడెం రహదారిలో ఎర్రంపేట నుంచి లక్కవరం జంక్షన్ వరకు సుమారు 20 చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. చింతూరు, వీఆర్పురం రహదారిలో కూడా చింతూరు, చూటూరుల నడుమ పలుచోట్ల చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు చింతూరులోని శబరిఒడ్డులో పిసిని సోమరాజుకు చెందిన ఇంటిపై మామిడిచెట్టు కూలడంతో ఇల్లు కుప్పకూలింది. ఈదురు గాలుల ధాటికి పెదశీతనపల్లిలో వంజం పాపారావుకు చెందిన రేకుల ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గాలిదుమారం కారణంగా పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడడంతో మండలం లోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
మీరెన్నయినా చెప్పండీ! కొన్ని ఫేక్ న్యూస్తో వచ్చే కిక్కే వేరు..!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
Advertisement