-
316 కు చేరిన గాజా మృతుల సంఖ్య!
గాజా: ఇజ్రాయిల్ చేస్తున్న భూతల దాడుల్లో అమాయకులు ప్రాణాల గాల్లో కలిసిపోతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్, పాలస్తీనా ల చోటు చేసుకున్నఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి.11 రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకూ 316 మంది మంది పాలస్తీనా వాసుల ప్రాణాలు కోల్పోయారు. హమాస్ పాలనలోని గాజా ప్రాంతంపై గగనతలం, సముద్రతలం నుంచి బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తొలిసారిగా భూతల దాడులకు దిగింది. వైమానిక దాడులతోపాటుగా ఇజ్రాయెల్ భూతల దాడులకు కూడా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాద స్థావరాలను, మౌలిక సదుపాయాలను తీవ్రస్థాయిలో దెబ్బతీయాలన్నదే తమ దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు, భూతల దాడులతో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హమాస్ కూడా హెచ్చరించింది. శనివారం జరిపిన ఇజ్రాయిల్ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నందున ఇజ్రాయిల్ దాడులు పరిధికి లోబడే ఉండాలని సూచించింది.ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ దాడుల వల్ల అత్యధిక సంఖ్యలో అమాయకులు వారి జీవితాల్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇజ్రాయిల్ దాడుల్లో 260కు చేరిన మృతుల సంఖ్య
గాజా: ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చింది. గత 11 రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకూ 260 మంది పాలస్తీనా వాసుల ప్రాణాలు కోల్పోయారు. హమాస్ పాలనలోని గాజా ప్రాంతంపై గగనతలం, సముద్రతలం నుంచి బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ ఇపుడు తొలిసారిగా భూతల దాడులకు దిగింది. పదిరోజుల దాడుల్లో దాదాపు 260మంది పాలస్తీనియన్లు మరణించారు. అయితే, ఇజ్రాయెల్పై పాలస్తీనా రాకెట్ దాడులు మాత్రం ఆగలేదు. తాజాగా గురువారం రాత్రి గాజాపై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో 27 మంది పాలస్తీనా వాసులు మరణించారు. వైమానిక దాడులతోపాటుగా ఇజ్రాయెల్ భూతల దాడులకు కూడా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాద స్థావరాలను, మౌలిక సదుపాయాలను తీవ్రస్థాయిలో దెబ్బతీయాలన్నదే తమ దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు, భూతల దాడులతో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హమాస్ కూడా హెచ్చరించింది. -
హమాస్ ద్రోన్ను కూల్చేసిన ఇజ్రాయెల్
గాజా/జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ సోమవారం కూడా వైమానిక దాడులు చేసింది. పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ తొలిసారి ప్రయోగించిన మానవ రహిత విమానాన్ని(ద్రోన్) కూల్చేసింది. తమ దేశంలోని అషదాద్ నగరానికి దగ్గర్లో తీరం వద్ద ఇది కనిపించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హమాస్ పాలనలోని గాజాలో ఆ సంస్థకు చెందిన మూడు సైనిక శిక్షణ కేంద్రాలపై విమానాలతో బాంబు దాడులు చేశామని వెల్లడించింది. ఈ దాడుల్లో నలుగురు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్ దాడుల మృతుల సంఖ్య 175కు చేరింది. ఇజ్రాయెల్ భూభాగంలోని చాలా ద్రోన్లను పంపామని, వివరాలు తర్వాత వెల్లడిస్తామని హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసిన గాజాలోని బీత్ లహియాలో 17 వేల మంది రక్షణ కోసం ఐక్యరాజ్య సమితి శిబిరాలకు చేరుతున్నారు. మరోవైపు.. లెబనాన్ నుంచి సోమవారం కూడా తమ భూభాగంలోకి రాకెట్ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇదిలా ఉండగా, గాజాపై దాడుల్లో అమాక ప్రజల మృతిపై జమ్మూకాశ్మీర్కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) సోమవారం లోక్సభలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చకు స్పీకర్ అంగీకరించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. ఆ వార్నింగ్ వల్లే ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
Pratibha Ranta: నిన్నెవరు పెళ్లాడతారు? అని నానమ్మ కలవరపడినా.. హీరోయిన్ అయింది(ఫోటోలు)
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఆ అవార్డు వస్తే సంతోషిస్తా: నటి కంగనా
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
తప్పక చదవండి
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement