-
పాకిస్తాన్లో ‘టెర్రర్ బ్రదర్స్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ‘జంట పేలుళ్ల’ కేసుల్లో నిందితులుగా ఉన్న, దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు వాంటెడ్గా మారిన ‘టెర్రర్ బ్రదర్స్’ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారని రూఢీ అయింది. వారిద్దరూ అక్కడే ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలనూ నిఘావర్గాలు సేకరించాయి. గత నెల్లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ విచారణతో ఇది నిర్థారణైంది. 2008 నుంచి పాక్లోనే ఉంటూ భారత్లో పేలుళ్లకు కుట్రలు చేస్తున్న ఈ ద్వయానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భద్రత కల్పిస్తోందని బయటపెట్టాడు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఏర్పాటులో ఈ బ్రదర్స్ కీలకపాత్ర పోషించారు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్ జంట పేలుళ్లతో దద్దరిల్లింది. ఆ రోజు గోకుల్చాట్, లుంబినీపార్క్ల్లో చోటు చేసు కున్న పేలుళ్లు 42 మంది ప్రాణాలు తీశాయి. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ ప్రాంతంలోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్ల్లో పేలుళ్లు జరిగాయి. గోకుల్చాట్ వద్ద బాంబు పెట్టింది రియాజ్ కాగా.. కుట్రలో ఇక్బాల్ ఉన్నాడు. 2013 పేలుళ్ల నాటికి రియాజ్ దేశం దాటేసినా కుట్రలో కీలకంగా వ్యవహరించాడు. 9 రాష్ట్రాల్లో వాంటెడ్..: కోల్కతాలో ఆసిఫ్రజా కమాండో ఫోర్స్(ఏఆర్డీఎఫ్) పేరుతో విధ్వంసాలు సృష్టించి కరాచీకి మకాం మార్చిన అమీర్ రజా ఖాన్ ప్రోద్భలంతో ఏర్పాటైన ఐఎంలో భత్కల్ సోదరులు కీలకపాత్ర పోషించారు. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన ఈ ద్వయం అమీర్ ఆదేశాల మేరకు స్థానిక యువతను ఆకర్షించి విధ్వంసాలు సృష్టించింది. రియాజ్ ఐఎంకు సదర్ రీజియన్ కమాండర్గా వ్యవహరించాడు. రియాజ్, అతని సోదరుడైన ఇక్బాల్ 2005 నుంచి దేశవ్యాప్తంగా 11 పేలుళ్లకు పాల్పడ్డారు. యూపీలోని లక్నో, ఫరీదాబాద్, వారణాసి కోర్టుల్లో, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్లతో పాటు రామ్పూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్పై దాడి, సూరత్లో పేలుళ్లకు కుట్రల్లోనూ వీరు వాంటెడ్. 2008 సెప్టెంబర్లో బాట్లా హౌస్ ఎన్కౌంటర్తో ఢిల్లీ పోలీసులకు ఐఎం మూలాలు తెలిశాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ‘టెర్రర్ బ్రదర్స్’ సరిహద్దులు దాటి అమీర్రజా దగ్గర షెల్టర్ తీసుకుంటున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఎస్ఐ రక్షణలో కరాచీలోని డిఫెన్స్ కాలనీలో వీరు స్థిరపడ్డారని తౌఖీర్ విచారణలో తేలింది. -
పట్టుకోవడానికి పదహారేళ్లు!
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయం వద్ద 2002లో జరిగిన బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడు మహ్మద్ షఫీఖ్ ముజావర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏళ్లుగా ఒమన్లో మకాం వేసిన ఇతను ఇటీవల ఖతర్ వెళ్లే ప్రయత్నాల్లో ఇంటర్పోల్కు దొరికాడు. దీంతో షఫీఖ్ను బలవంతంగా భారత్కు పంపారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఈ ఉగ్రవాదిని సీఐడీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. లష్కరే తొయిబాలో (ఎల్ఈటీ) షఫీఖ్ కీలక పాత్ర పోషించాడు. ఆలయం వద్ద పేలుళ్లలో ఉగ్రవాదులైన అబ్దుల్ బారి అలియాస్ అబు హంజా, ఫర్హాతుల్లా ఘోరీ, అబ్దుల్ రజాఖ్, సలావుద్దీన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ కుట్రను అమలు చేయ డం కోసం దుబాయ్ కేంద్రంగా అనేక సమావేశా లు జరగడంతో పాటు భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేశారు. ఈ రెండు వ్యవహా రాల్లోనూ ముంబైకి చెందిన, దుబాయ్లో ఉంటూ ఎల్ఈటీ కోసం పని చేస్తున్న షఫీఖ్ కీలకంగా వ్యవహరించాడు. 2002, నవంబర్ 21న దిల్సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 15 మంది గాయపడ్డారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులున్నారు. ఈ కేసులో వాంటెడ్గా ఉన్న షఫీఖ్పై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీని ఆధారంగా సీఐడీ అధికారులు ఇంటర్పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. కొన్నేళ్లుగా ఒమన్ కేంద్రంగానే వ్యవహారాలు నడుపుతున్న షఫీఖ్ ఇటీవల ఖతర్ పయనమయ్యాడు. ఖతర్ ఎయిర్పోర్ట్లో దిగిన ఇతడిని పట్టుకున్న ఇంటర్పోల్ భారత్కు బలవంతంగా (డిపోర్టేషన్) పంపింది. ఖతర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇతడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. కోర్టు షఫీఖ్కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించడంతో చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతడిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడం కోసం సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన మహ్మద్ ఆజం, సయ్యద్ అబ్దుల్ అజీజ్లు గతంలో ఉప్పల్, కరీంనగర్ల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. మిగిలిన వారిలో 8 మందిపై సీఐడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి అబ్దుల్ రజాక్ను 2005లో అరెస్టు చేశారు. సలావుద్దీన్ను కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో 2012లో పట్టుకోగా, ట్రాన్సిట్ వారెంట్పై ఇక్కడికి తీసుకువచ్చారు. రజాఖ్ 2011లో ఆత్మహత్య చేసుకోగా... సలావుద్దీన్ 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. -
తీహార్ జైలుకు ‘దిల్సుఖ్నగర్’ నిందితులు
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఢిల్లీకి తరలించారు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న జియా ఉల్ రెహమాన్(పాకిస్థాన్), తహసీన్ అఖ్తర్ అనే ఉగ్రవాదులను మంగళవారం ఎన్ఐఏ అధికారులు తీహార్ జైలుకు పంపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాసిన్ భత్కల్ను కొద్ది రోజుల కిందట తీహార్ జైలుకు తరలించగా.. మరో ఇద్దరు నిందితులు అజాజ్, అక్తల్ను ముంబై జైలుకు పంపిన విషయం తెలిసిందే. -
యాసిన్ భత్కల్ తీహార్ జైలుకు తరలింపు
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ను ఢిల్లీకి తరలించారు. చర్లపల్లి జైలు నుంచి శిక్ష అనుభవిస్తున్న అతన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్ఐఏ అధికారులు తీహార్ జైలుకు పంపించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు అజాజ్, అక్తల్ను ముంబైకు తరలించినట్లు అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా ట్రయల్స్ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లే సమయంలో భత్కల్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. భత్కల్ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అధికారులు అతన్ని తీహార్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. -
నాందేడ్లో ఆయుధాలు కొని..
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులు చేయాలని, తుపాకులతో బీభత్సం సృష్టించాలని కుట్ర పన్నిన ఏయూటీ ఉగ్రవాదులు.. అందుకోసం కావల్సిన సామగ్రి కోసం పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని అజ్మీర్లో ఆయుధాలు కొనేందుకు వెళ్లి, అక్కడ రూ. 65 వేలు చెల్లించినా, వాళ్లకు ఆయుధాలు మాత్రం లభ్యం కాలేదు. ఉగ్రదాడులు చేయడానికి ఒప్పుకొన్నందుకు వీళ్లు ఒక్కొక్కరికి లక్షన్నర చొప్పున ముట్టందని కూడా జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అజ్మీర్లో ఆయుధాలు దొరక్కపోవడంతో మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లి అక్కడ రెండు సెమీ ఆటోమేటిక్ 9ఎంఎం పిస్టళ్లు కొన్నారు. ఆ తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్లను హైదరాబాద్, అనంతపురం నగరాల్లో కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా లేనిచోట ఐఈడీ పరీక్షలు, ఇతర ప్రాక్టీసు చేసినట్లు కూడా చెబుతున్నారు. బాంబులు ఎలా తయారుచేయాలన్న విషయాన్ని ఇబ్రహీం తమకు యూట్యూబ్ వీడియోల ద్వారా చూపించినట్లు ఎన్ఐఏ విచారణలో హబీబ్ వెల్లడించాడు. ప్రభుత్వంపై భారీ యుద్ధానికి తెగబడాలన్న ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున పేలుళ్లు, కాల్పులకు వాళ్లు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. అయితే, కేంద్ర నిఘావర్గాల సమాచారం సరైన సమయంలో అందడం, వెంటనే ఎన్ఐఏ కూడా స్పందించడంతో హైదరాబాద్ నగరానికి భారీ ఉగ్రవాద ముప్పు తప్పినట్లయింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement