-
మాచ్ఖండ్కు వెలుగులు
6 దశాబ్దాల తర్వాత ఆధునికీకరణకు ఆమోదం పెరగనున్న విద్యుత్ ఉత్పత్తి సీలేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని మాచ్ఖండ్ ప్రాజెక్టు వెలుగులీననుంది. ప్రాజెక్టును ఆధునీకరణ చేపట్టేందుకు ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా సిద్ధం అవుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారిగా సహజ నీటి వనరుల ఆధారంగా రెండు రాష్ట్రాల ఖర్చుతో మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాకులు దూరని కారడవిలో విదేశీ పరిజ్ఞానంతో దీనిని నెలకొల్పారు. మొదటి రాష్ట్రపతి బాబూరాజంద్రప్రసాద్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం అయింది. అయితే కొన్నాళ్లు తర్వాత ఈ ప్రాజెక్టును ఇరు రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి చీకట్లు అలముకున్నాయి. తరచూ కేంద్రం మరమ్మతులకు గురువుతూ వచ్చింది. అయినా పెద్దగా దృష్టి పెట్టింది లేదు. అయితే ఇప్పుడు ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. మరో 30 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. దశల వారీగా పనులు మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒకటి, రెండు, మూడు 15 మెగావాట్లు, మిగిలినవి 27 మెగావాట్లు చొప్పున ఉత్పత్తి చేస్తాయి. ఈ యూనిట్ల వయోపరిమితి 40 ఏళ్లు కాగా.. 20 ఏళ్లు పైబడి వినియోగించారు. దీంతో ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల అంగీకారంతో ఈ యూనిట్లకు కొత్త పరికరాలు అమర్చనున్నారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి పెరగనుంది. ప్రస్తుతం ఇక్కడ 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఆధునికీకరణ చేపడితే ఒక్కో యూనిట్కు 3 నుంచి 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందని జెన్కో ఇంజనీర్లు చెబుతున్నారు. పెరిగే విద్యుత్ ఉత్పత్తిని ఒడిశాకు పంపించినా మన వాటా విద్యుత్ను పెందుర్తి ఫీడర్కు సరఫరా అవుతుందని అంటున్నారు. విద్యుత్ కొరత తీరుతుంది ఆధునికీకరణకు నోచుకోక తరచూ ఇబ్బందులు పడుతున్నాం. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగిన మాచ్ఖండ్కు ఆధునికీకరణ అనుమతులు సిద్ధం అవడం ఆనందంగా ఉంది. ఇదే జరిగితే 15 మెగావాట్లకు పైబడి ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో విద్యుత్ కొరత తీరుతుంది. – ఎన్.మురళీమోహన్, సీలేరు ఎస్ఈ -
సీలేరు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం..
విశాఖ జిల్లా సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదాఘాతం వల్ల ఇద్దరు ఉద్యోగులకు గాయాలు అయ్యాయి. శుక్రవారం జలవిద్యుత్ కేంద్రంలోని స్విచ్ యార్డ్లో సమస్య వస్తే ఉద్యోగులు సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో శివకుమార్, ఎం.లక్ష్మయ్య కర్రతో వైర్ను కొట్టగా షాక్కు గురయ్యారు. శివకుమార్కు తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. -
దుమ్ముగూడెం ప్రాజెక్టుకు మంగళం!
హైడల్ ప్రాజెక్టు రద్దుకు నీటిపారుదల, విద్యుత్శాఖల సూత్రప్రాయ నిర్ణయం డ్యామ్కు అయ్యే ఖర్చు రూ.2 వేల కోట్లు భరించేందుకు వెనుకడుగు సాగుభూమిలేని ప్రాజెక్టుకు నిధులు ఖర్చు చేయలేమన్న నీటిపారుదల శాఖ అంత వ్యయం భరించలేమని చేతులెత్తేసిన విద్యుత్ శాఖ హైదరాబాద్: దుమ్ముగూడెం జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం స్వస్తి పలికింది! ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారం కానుండడం, దీనిని భరించేందుకు నీటిపారుదల శాఖ, ఇంధన శాఖలు చేతులెత్తేయడంతో ఈ నిర్ణయానికి వచ్చింది. నీటిపారుదల శాఖ, ఇంధన శాఖలు నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణానికి మంగళం పాడాలని నిర్ణయించింది. తెలంగాణలో గోదావరి నదిపై కంతనపల్లి, దుమ్ముగూడెం వద్ద జల విద్యుత్ కేంద్రాలు నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్దకాలంగా ఉంది. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం దుమ్ముగూడెం వద్ద జలాశయంతోపాటు, విద్యుత్ కేంద్రం నిర్మాణంపై బుధవారం రాష్ట్ర నీటిపారుదల, ఇంధన శాఖలు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిలతో పాటు ఇరు శాఖల కార్యదర్శులు ఎస్కే జోషీ, అరవింద కుమార్, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు పాల్గొని ప్రాజెక్టు నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చించారు. దుమ్ముగూడెం జలాశయంతోపాటు, విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రూ.2,458 కోట్లు వ్యయం అవుతుందని 2010-11లో జెన్కో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించింది. డ్యాంకు రూ.1,423 కోట్లు, విద్యుత్ కేంద్రానికి రూ.720 కోట్లు, పెట్టుబడి రుణాలపై నిర్మాణ కాల వడ్డీ(ఐడీసీ)లకు రూ.315 కోట్లు వెచ్చించాలి ఉంటుందని పేర్కొంది. 2015-16 ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) ప్రకారం ఈ అంచనాలు రూ.3 వేల కోట్లు దాటుతుందని, అందులో డ్యామ్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు, విద్యుత్ కేంద్రానికి రూ.వెయ్యి కోట్ల ఖర్చు కానుందని జెన్కో ఈ సమావేశంలో నివేదించింది. చేతులెత్తేసిన రెండు శాఖలు దుమ్ముగూడెం, కంతనపల్లి జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయాన్ని నీటిపారుదల శాఖే భరించాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, వ్యయం భరించేందుకు ఆ శాఖ విముఖత వ్యక్తం చేసింది. కనీసం డ్యాం నిర్మాణం వ్యయాన్ని భరించినా... విద్యుత్ కేంద్రాన్ని తామే నిర్మించుకుంటామని జెన్కో మరో ప్రతిపాదన చేసినా నీటిపారుదల శాఖ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ప్రతిపాదిత దుమ్ముగూడెం డ్యాం కింద ఎకరా ఆయకట్టు లేనందున ఈ ప్రాజెక్టుపై పెట్టుబడి పెట్టలేమని తేల్చి చెప్పింది. 320 (8ఁ40) మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు కోసం రూ.3 వేల కోట్లను వెచ్చించడం తమ వల్ల కాదని, ఒకవేళ నిర్మించినా విద్యుత్పత్తి వ్యయం తడిసి మోపెడవుతుందని జెన్కో అభిప్రాయపడింది. ఇంత వ్యయంతో విద్యుత్కేంద్రం నిర్మించేందుకు కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) సైతం అనుమతి ఇవ్వదని తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. దీనిపై త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. ఆ తర్వాత అధికారిక నిర్ణయం వెల్లడయ్యే అవకాశం ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement