-
ఆర్టీసీలో ఐ–టిమ్స్
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. బస్సుల రాక కోసం బస్టాండ్లలో గంటల తరబడి వేచి చూడకుండా ఉండేందుకు ఐ–టిమ్స్ (ఇంటెలిజెంట్–టికెట్ ఇష్యూ మిషన్) విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. తొలిసారిగా సూర్యాపేట–నల్లగొండ మార్గంలో ఈ విధానం కొద్ది రోజులుగా అమలవుతోంది. ప్రయాణికుల సమయం ఆదాచేయడంతోపాటు, బస్సుల్లో కండక్టర్లపైన భారం పడకుండా ఉండేందుకు ఈ విధానం ఎంతగానో దోహద పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఐ– టిమ్స్, జీపీఎస్ టెక్నాలజీతో అనుసంధానమై ఉంటుంది కాబట్టి బస్సుల రాకపోకల సమయంతో పాటు, బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నా యి, ఎన్ని సీట్లు ప్రయాణికులతో నిండిపోయాయి, సమీప బస్స్టేషన్కు ఎంత సమ యంలో బస్సు చేరుతుందనే వివరాలు ముం దుగానే ప్రయాణికులకు తెలియజేస్తారు. తద్వారా ఆయా బస్టాండ్లలో ప్రయాణికుల సమ యం వృథా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బస్టాండ్లలో కండక్టర్లు ఐ–టిమ్స్ విధానంలో బస్సుల్లో కండక్టర్లు ఉండరు. బస్టాపుల్లో ఉంటారు. జీపీఎస్ టెక్నాలజీతోనే ఐ–టిమ్స్ మిషన్లు పనిచేస్తాయి. బస్టాండ్లో బస్సు బయల్దేరిన సమయం నుంచి సీట్ల వివరాల వరకు మొత్తం సమా చారం జీపీఎస్ టెక్నాలజీ ద్వారా తర్వాతి బస్టాప్లో ఉన్నటువంటి కండక్టర్కు చేరుతుంది. దీంతో అక్కడ వేచి ఉన్న ప్రయాణికులకు బస్సు వచ్చే సమయాన్ని చెప్పడంతోపాటు, ఖాళీగా ఉన్న సీట్ల వరకు ముందుగానే టికెట్లు జారీ చేస్తారు. ఈ విధంగా బస్సు చేరుకునే చివరి పాయింట్ వరకు ఎన్ని స్టాపులు ఉంటాయో అన్ని స్టాపుల్లోనూ కండక్టర్లు ఉంటారు. ఒక స్టాప్లో టికెట్లు ఇవ్వడం పూర్తికాగానే ఐ–టిమ్స్లో బిల్లు క్లోజ్ చేస్తారు. బిల్లు క్లోజ్ చేయగానే ఆ సమాచారం తర్వాతి స్టాప్లో ఉన్న కండక్టర్కు చేరుతుంది. పది రోజుల నుంచి సూర్యాపేట–నల్లగొండ మార్గంలో ఈ విధానం అమలవుతోంది. సూర్యాపేట డిపో ఎంపిక రాష్ట్రంలో సూర్యాపేట డిపోను ఎంపిక చేసుకుని ఐ–టిమ్స్ అమలు చేస్తున్నారు. సూర్యాపేట నుంచి నల్లగొండ వరకు 50 కిలోమీటర్ల లోపు దూరం ఉండటం కూడా అందుకు ప్రధాన కారణం. ఐ–టిమ్స్ పనిచేయాలంటే నెట్వర్క్ అంతరాయం కలగకూడదు. ఈ మార్గంలో సాంకేతికంగా ఎలాంటి సమస్య తలెత్తినా సులువుగా పరిష్కరించుకోవచ్చన్న ఉద్దేశంతో ఆర్టీసీ సూర్యాపేట డిపోను ఎంపిక చేసింది. అయితే ఈ ప్రయోగం ఒక్క సూర్యాపేట డిపోకు మాత్రమే పరిమితం చేయడంతో కండక్టర్ల వాడకం పెరిగింది. గతంలో 17 మంది కండక్లర్లు అవసరమైతే ఇప్పుడు 23 మంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా మరో ఇద్దరు ఆపరేటర్లు. మొత్తం 25 మంది ఐ–టిమ్స్ కింద వివిధ బస్టాప్లలో పనిచేస్తున్నారు. అయితే అన్ని డిపోల్లో ఇదే విధానం అమల్లోకి వస్తే అప్పుడు కండక్టర్ల వాడకం తగ్గుతుందని అధికారులు తెలిపారు. దూర ప్రాంతాలకు మేలు ఐ–టిమ్స్ విధానం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు మరింత మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ టు భైంసా, భద్రాచలం టు హైదారాబాద్, కరీంనగర్ వెళ్లే ప్రయాణికులకు ఐ–టిమ్స్ సౌకర్యం ద్వారా సమయం కలిసొస్తుందని వారు అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే బస్సుల్లోనే ప్రవేశపెడతారని చెప్పారు. త్వరలో ఆర్టీసీ మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు. దీంతో బస్సుల సమయం, ఇతర వివరాలు అన్నీ మొబైల్లో చూసుకునే వీలుంటుంది. -
‘ఐ-టీమ్స్’ సంఖ్య పెంపు
సాక్షి, హైదరాబాద్: సీఆర్డీఏలో భాగం అయిన విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ (ఐ-టీమ్స్) సంఖ్యను పది నుంచి పదహారుకు పెంచారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రతి టీమ్కూ ఓ ఇన్స్పెక్టర్ను ఇన్చార్జ్గా ఏర్పాటు చేశారు. వీటిలో పని చేయడానికి నేర విభాగంలో అనుభవం ఉన్న సిబ్బందిని ఎంపిక చేస్తున్నారు. వీరు కేవలం హత్య కేసుల్ని మాత్రమే కాకుండా ఆయా పోలీసుస్టేషన్లలో నమోదయ్యే కీలక కేసులు, సంచలనాత్మక నేరాలను దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో పోలీసులపై అధికమవుతున్న శాంతిభద్రతల పరిరక్షణ డ్యూటీల ప్రభావం కేసుల దర్యాప్తుపై పడుతోంది. ఫలితంగా దర్యాప్తు దశలో ఉంటున్న కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే శాంతిభద్రతల విభాగం నుంచి దర్యాప్తు విభాగాన్ని వేరు చేయాలనే వాదనకు అనుగుణంగా విజయవాడ పోలీసు కమిషనర్గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది జూలైలోనే కమిషనరేట్ పరిధిలో 10 ‘ఐ-టీమ్స్’ ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ లో ఐదు, ఈస్ట్ జోన్లో మూడు, వెస్ట్జోన్లో రెండింటిని అమలులోకి తీసుకువచ్చారు. వీటిని విస్తరించిన గౌతమ్ ఈ టీమ్స్ సంఖ్యను 16కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ‘ఐ-టీమ్స్’లో ఉన్న అధికారులు సిబ్బందికి ఇతర విధుల నుంచి విముక్తి కల్పించాలని నిర్ణయించారు. విజయవాడ పోలీసు కమిషనరేట్లో అమలులోకి రానున్న ఈ విధానం సత్ఫలితాలనిస్తే రాష్ట్రంలో బందోబస్తు, భద్రతా విధులు ఎక్కువగా ఉండే అర్బన్ జిల్లాలతో పాటు కమిషనరేట్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement