-
మేఘాలయ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: అక్రమ బొగ్గు తవ్వకాలను అరికట్టడంలో విఫలమైనందున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన రూ .100 కోట్ల జరిమానాను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)లో జమ చేయాలని మేఘాలయ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. అక్రమంగా సేకరించిన మొత్తం బొగ్గును కోల్ ఇండియాకు అప్పగించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంబంధిత అధికారుల అనుమతులకు లోబడి ప్రైవేటు, కమ్యూనిటీ యాజమాన్యంలోని భూముల్లో మైనింగ్ ఆపరేషన్ రాష్ట్రంలో కొనసాగడానికి ధర్మాసనం అనుమతించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జనవరి 4న మేఘాలయ ప్రభుత్వానికి జరిమానా విధించింది. మేఘాలయలో పెద్ద సంఖ్యలో గనులు అక్రమంగా పనిచేస్తున్నాయని మేఘాలయ అంగీకరించింది. గౌహతి హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కకోటి నేతృత్వంలోని కమిటీ నివేదిక ప్రకారం, మేఘాలయలో 24 వేల గనులుండగా, ఎక్కువ భాగం అనుమతులు లేనివేనని పేర్కొంది. -
జోరుగా బొగ్గు దందా!
కొండపాక:అక్రమ బొగ్గు దందా మళ్లీ పడగ విప్పింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ అక్రమ వ్యాపారం మళ్లీ యథేచ్ఛగా కొనసాగుతోంది. బొగ్గు అక్రమ దందా వల్ల పరిశ్రమలకు తీరని నష్టం వాటిల్లుతోంది. దళారుల హస్తలాఘవంతో నాసిరకం బొగ్గును వినియోగించడం వల్ల బాయిలర్ల ద్వారా సరియైన మోతాదులో స్టీం ఉత్పత్తి కాక తీవ్ర నష్టం వాటిల్లుతోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. బొగ్గు వ్యాపారంపై గతంలో మండలానికి చెందిన ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ ఉన్నతాధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి కఠినంగా వ్యవహరించారు. దీంతో బొగ్గు దందా కొంతకాలం నిలిచిపోయినా విషయం పాతబడడం, అప్పుడున్న అధికార వ్యవస్థ మారడంతో మళ్లీ ఊపందుకుంది. మరోవైపు అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొండపాక మండలంలోని రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న లకుడారం, తిమ్మారెడ్డిపల్లి, దుద్దెడ, కుకునూర్పల్లి గ్రామాలు బొగ్గు అక్రమ వ్యాపారానికి కేంద్రాలుగా మారాయి. ఈ గ్రామాల్లో రాత్రి వేళ భారీ ఎత్తున బొగ్గు వ్యాపారం సాగుతోంది. హైదరాబాద్ ప్రాంతంలోని పరిశ్రమలకు వెళ్లే లక్షల రూపాయల విలువైన బొగ్గు దళారుల పాలవుతోంది. అధికారులు పట్టించుకోకపోవడం.. ఈ వ్యాపారం కాసులు కురిపిస్తుండడంతో దళారులు అనతికాలంలోనే లక్షలు ఆర్జిస్తున్నారు. కొన్నేళ్ల కిందట దుద్దెడలో ఒకటి, రెండు కేంద్రాలతో ప్రారంభమైన ఈ వ్యాపారం అనతికాలంలోనే పలు గ్రామాలకు విస్తరించి సుమారు 30 దుకాణాల వరకు విస్తరించింది. దోపీడీ జరుగుతున్నది ఇలా... మంచిర్యాల, బెల్లంపల్లి, గోదావరి ఖనీ, చందాపూర్ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ పారిశ్రామిక వాడకు నిత్యం వందలాది లారీల బొగ్గు సరాఫరా అవుతోంది. దళారుల మాయాజాలం వల్ల ఈ బొగ్గులో కొంతభాగ ం అక్రమార్కుల పాలవుతోంది. మార్గమధ్యంలో అక్రమంగా వెలసిన బొగ్గు దుకాణాల్లో డ్రైవర్లు రూ. 350 నుంచి 400లకు క్వింటాలు చొప్పున అర టన్ను నుంచి రెండు టన్నుల వరకు నాణ్యమైన బొగ్గును అమ్ముతారు. అనంతరం తూకంలో వ్యత్యాసం రాకుండా దుకాణాల్లో ఉండే నాసిరకం బొగ్గు పొడినిగానీ, నీటిని చల్లడం ద్వారా సరిచేస్తారు. దళారులు అలా తీసిన బొగ్గును క్వింటాలుకు రూ. 600 వరకు ఇటుక బట్టీల నిర్మాణాలకు, ఇతర చిన్న చిన్న పరిశ్రమలకు విక్రయిస్తారు. బొగ్గు వ్యాపారులు డ్రైవర్లకు అడ్వాన్సుల రూంలో కొంత డబ్బు ముట్టజెప్పి తమ వైపు తిప్పుకుంటారు. గతంలో కిరాయి ట్రాక్టర్లతో బొగ్గును తరలించిన దళారులు నేడు సొంత లారీలతో గాజుల రామారం, గండిమైసమ్మ ప్రాంతంలోని పరిశ్రమలకు తరలిస్తూ లాభాలు గడిస్తుండటం గమనార్హం.మండల పరిధిలో 20కి పైగా ఉన్న బొగ్గు దుకాణాల్లో ప్రతీరోజూ రాత్రికి రాత్రే సుమారు 50 టన్నులకుపైగా బొగ్గును డంపు చేస్తున్నారు. తెల్లవారేసరికి ఆ బొగ్గును వ్యాపారులు లోడ్ చేసి అమ్ముతున్నారు. చీకటి మాటునే రోజుకు లక్షల విలువైన, పరిశ్రమలకు చెందిన బొగ్గు చేతులు మారుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా బొగ్గు లారీల రాకపోకల వల్ల గ్రామాలకు వెళ్లే రోడ్లు ఛిద్రమవుతున్నాయనీ, ఈ విషయంలో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement