-
'మూడేళ్లుగా భార్యాభర్తలకు పడటంలేదు'
హైదరాబాద్ : భార్యాభర్తల కలహాలే ముగ్గురు ఉసురు తీశాయని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మాదాపూర్లో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మనీష్ షాహు.. తన భార్య శ్వేతసాహు, ఐదేళ్ల కుమారుడు యాష్లను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. ముగ్గురి మృతి విషయం తెలిసి మనీష్ షాహు తండ్రి కేఆర్ షాహు, సోదరుడు ఆశీష్తో పాటు శ్వేత తండ్రి ఉమేశ్ చంద్ర గుప్తా మురాదాబాద్ నుంచి నగరానికి వచ్చారు. దంపతుల మధ్య కలహాలే ఈ ఘోరానికి కారణమని రోదించారు. 2006లో మనీష్, శ్వేతలకు పెళ్లైందని.. మొదటి నుంచి ఇద్దరికీ పడేది కాదని, ఒకరి మాటకు ఒకరు విలువ ఇచ్చేవారు కాదని పోలీసులకు తెలిపారు. మద్యం తాగే అలవాటు ఉన్న మనీష్ స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చేవాడని, ఆ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేదన్నారు. రెండు నెలల క్రితం శ్వేత భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయన్నారు. నాలుగు రోజులుగా దంపతులిద్దరికీ ఫోన్ చేసి నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయిందని వారు అన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగి.. ముగ్గురి ప్రాణాలను బలితీసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పి రోదించారు. కాగా, గురువారం పోస్టుమార్టం అనంతరం మనీష్, శ్వేత, చిన్నారి యాష్ల మృతదేహాలను పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించగా.. అంబర్పేట శ్మశాన వాటికలో ఖననం చేశారు. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
భార్య, కొడుకును హత్య చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య గచ్చిబౌలిలో దారుణం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగం.. లక్షకు పైగా జీతం.. ఇంతకన్నా ఏం కావాలి? లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవి తాన్ని అర్ధాంతరంగా ముగించాడు. కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కడతేర్చి తానూ ఉరివేసుకున్నాడు. బుధవారం వెలుగు చూసిన ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్కు చెందిన మనీష్ సాహు (35) మూడేళ్ల కిందట నగరానికి వచ్చాడు. మాదాపూర్లోని ఇమోమెంటస్ కంపెనీలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. మాదాపూర్లోనే మై హోమ్ నవద్వీప్ వరుణ బ్లాక్లోని ఫ్లాట్ నెం 108లో భార్య శ్వేత సాహు (32), కొడుకు యశ్ (5)తో కలసి అద్దెకుంటున్నాడు. శ్వేత గృహిణి కాగా, యశ్ మెరిడియన్ స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. ఈనెల 19న ఆఫీస్కు వెళ్లి వచ్చిన మనీష్ శుక్రవారం నుంచి ఆఫీస్కు వెళ్లలేదు. బుధవారం ప్రాజెక్ట్ డెలివరీ ఉండటంతో కంపెనీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ శ్రీరామ్.. మనీష్ నివాసానికి వచ్చి చూడగా డోర్ వెనక నుంచి గడియపెట్టి ఉంది. కిటికీ తలుపులు తెరచి చూడగా తీవ్ర దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ నిర్వాహకులకు విషయం చెప్పారు. వారు వచ్చి కిటికీలోంచి చూడగా మనీష్ కిటికీకి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా శ్వేత, కొడుకు యశ్లు మంచంపై నిర్జీవంగా పడిఉన్నారు. మనీష్ నైలాన్ తాడుతో కిటికీకి ఉరివేసుకున్నాడు. ముగ్గురి శరీర భాగాలు ఉబ్బిపోయి ఉండడంతో నాలుగు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. భార్య శ్వేత రెండుచేతుల మణికట్టుపై పదునైన కత్తితో కోయగా తీవ్ర రక్తస్రావమైనట్టుగా ఉంది. కొడుకు యశ్ తలకు, ముక్కు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి కొడుకును హతమార్చినట్లు తెలుస్తుంది. వారిద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను రెండు చేతుల మణికట్టుపై కోసుకున్న మనీష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు తెలిపారు. మనీష్, శ్వేత కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఠాణాకీడ్చిందని..?: రెండు నెలల నుంచి దంపతుల మధ్య ఏదో ఒక విషయుంపై గొడవలు జరుగుతున్నారుు. భర్త తనను వేధిస్తున్నాడని శ్వేత మాదాపూర్ పోలీసులను ఆశ్రరుుంచింది. దీనిపై స్పందించిన పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ చేసి పంపించారు. తనను పోలీసు స్టేషన్ కీడ్చిందని భార్యపై మరింత కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడా అనే సందేహాలు కలుగుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement