-
ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు
న్యూఢిల్లీ: ప్రజలు దేశంలో ఎక్కడ్నుంచి అయినా రేషన్ సరుకులు తీసుకునేందుకు వీలుగా ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు(వన్ నేషన్–వన్ రేషన్ కార్డ్) విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఇందుకు 2020, జూన్ 30 వరకూ గడువిస్తున్నట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కేరళ, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, రాజస్తాన్ రాష్ట్రాల్లో రేషన్ సరుకులు ఎక్కడి నుంచైనా తీసుకునే సదుపాయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయని వెల్లడించారు. ‘2020, జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకావాలి. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మేం ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాశాం. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళ్లే నిరుపేదలు రేషన్ సరుకులు పొందలేక ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడుతుంది. మా ప్రభుత్వం తొలి 100 రోజులు ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చాం’ అని పాశ్వాన్ పేర్కొన్నారు. రేషన్ కోసం ఆధార్ చూపాల్సిందే.. ఈ నూతన విధానంలో ఓ రాష్ట్రంలోని ప్రజలు మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు రేషన్ సరుకుల కోసం ఆధార్కార్డును చూపాల్సి ఉంటుందని పాశ్వాన్ తెలిపారు. తమ పేర్లు రిజస్టరైన రేషన్షాపుల్లో అయితే కేవలం రేషన్ కార్డు చూపిస్తే సరిపోతుందని వెల్లడించారు. ఓ రాష్ట్రంలో ఆహారపదార్థాలను ఉచితంగా అందుకునే వ్యక్తి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు మాత్రం రూ.1 నుంచి రూ.3 వరకు కనీసధరను చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.. ‘రేషన్కార్డుదారుల్లో 89 శాతం మంది ఆధార్తో అనుసంధానమయ్యారు. దేశవ్యాప్తంగా 77 శాతం రేషన్ షాపుల్లో పాయింట్ ఆఫ్ సేల్స్(పీవోఎస్) యంత్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 22 రాష్ట్రాల్లోని రేషన్ షాపుల్లో 100 శాతం పీవోఎస్ యంత్రాలను అమర్చారు. కాబట్టి కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఎలాంటి ఇబ్బందిలేదు’ అని పేర్కొన్నారు. ఈ పథకం దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పాశ్వాన్ చెప్పారు. కుటుంబంలో ఒకరు మరో రాష్ట్రానికి వలసవెళ్లి మొత్తం రేషన్ సరుకులు అక్కడే కొనేయకుండా 50 శాతం గరిష్ట పరిమితి విధిస్తున్నామని తెలిపారు. ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని పాశ్వాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం కింద 80 కోట్ల మందికి రేషన్షాపుల్లో తక్కువ ధరలకే ఆహారపదార్థాలను అందజేస్తోంది. -
బల్దియాలో బయోమెట్రిక్
ఉద్యోగుల వేలి ముద్రలు సేకరిస్తున్న అధికారులు రెండు రోజుల్లో వినియోగంలోకి కోల్సిటీ : రామగుండం బల్దియా బయోమెట్రిక్ అమలుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. దీంతో ఉద్యోగులకు బయోమెట్రిక్ భయం పట్టుకుంది... సమయపాలన పాటించకుండా, విధులకు సక్రమంగా రాకండా తప్పించుకు తిరుగుతున్న వారి బండారం బయోమెట్రిక్తో బయటడనుంది. – మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగులు, సిబ్బంది సమయపాలనకు థంబ్ఇంప్రేషన్ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కమిషనర్ డి.జాన్శ్యాంసన్ తెలిపారు. పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారిశుధ్య కార్మికుల నుంచి గురువారం వేలిముద్రలు శానిటేషన్ ఇన్స్పెక్టర్లు కిశోర్, పవన్ సేకరించారు. కార్యక్రమాన్ని కమిషనర్ స్వయంగా పరిశీలించారు. తాత్కాలిక కార్మికులతోపాటు పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగులు, అధికారుల వేలి ముద్రలు సేకరిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. తొలత పారిశుధ్య కార్మికులకు శుక్రవారం నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 364 మంది ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు, 56 మంది పీహెచ్ వర్కర్లకు కార్పొరేషన్ కార్యాలయం, గోదావరిఖని పోచమ్మగుడి ఆవరణ, ఎన్టీపీసీ, రామగుండం, ౖయెటింక్లయిన్కాలనీలలో ఐదుచోట్ల జోన్లవారీగా ఇక నుంచి బయోమెట్రిక్ యంత్రం ద్వారా హాజరు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. సమయపాలన పాటించడంతోపాటు హాజరు రిజిస్టర్ అక్రమాలను అరికట్టడానికి దోహదపడుతుందని తెలిపారు. రెండ్రోజుల్లో మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక, శాశ్వతపు ఉద్యోగులు, అధికారులకు కూడా వేలి ముద్రలు సేకరించి త్వరలో చేయనున్నట్లు తెలిపారు. రెండుసార్లు వేలిముద్రల సేకరణ... ఇదే తరహాలో గతంలో కూడా అధికారులు బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేస్తామని చెప్పి పది బయోమెట్రికల్ యంత్రాలను కొనుగోలు చేశారు. శానిటేషన్ కార్మికుల నుంచి వేలిముద్రలు సేకరించారు. అయితే ఈ బయోమెట్రిక్ యంత్రాలు మోరాయించడంతో వాటిని నిలిపివేశారు. ఇప్పుడు మరోసారి కొత్త యంత్రాలను తెప్పించిన అధికారులు వేలిముద్రలను సేకరిస్తున్నారు. ఈసారైనా అధికారులు చిత్తశుద్ధితో వేలిముద్రల యంత్రాలను వినియోగంలోకి తీసుకొస్తారో లేదో వేచి చూడాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement