-
‘రక్షణ’కు అమెరికా సాంకేతికత
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సంబంధాల్లో మరో గొప్ప ముందడుగు పడింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన, క్లిష్టమైన సాంకేతికతను అమెరికా భారత్కు సమకూర్చే చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఢిల్లీలో గురువారం ఫలప్రదంగా జరిగిన ఇరు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల(2+2) మంత్రుల తొలి సమావేశం ఇందుకు వేదికైంది. కామ్కాసా(కమ్యూనికేషన్స్, కంపాటిబిలిటీ, సెక్యూరిటీ అగ్రిమెంట్)గా పిలిచే ఈ ఒప్పందంపై చాన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మధ్య హాట్లైన్ ఏర్పాటు, రష్యా నుంచి భారత్ కొనుగోలుచేయనున్న ఎస్–400 క్షిపణులు, హెచ్–1బీ వీసా, సీమాంతర ఉగ్రవాదం, ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి, ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న యత్నాలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. భారత్ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మైకేల్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్లు చర్చల్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది రెండు దేశాల త్రివిధ దళాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. రష్యాతో సంబంధాలను అర్థం చేసుకుంటాం.. ఇంధన అవసరాల కోసం ఇరాన్పై ఆధారపడుతున్న సంగతిని భారత్ అమెరికా దృష్టికి తీసుకెళ్లగా, ఈ విషయంలో సాయం చేస్తామని అమెరికా భారత్కు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి క్షిపణుల కొనుగోలు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు భారత్–రష్యాల చారిత్రక సంబంధాలను అర్థం చేసుకుంటామని అమెరికా పేర్కొన్నట్లు వెల్లడించాయి. అమెరికాతో వ్యూహాత్మక సహకారంపై రష్యాతో సంబంధాలు ఎలాంటి ప్రభావం చూపవని భారత్ అమెరికాకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. చర్చలు ముగిసిన అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో సుష్మా స్వరాజ్ తొలి 2+2 భేటీ అజెండాపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నియంత్రించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపునకు భారత్ మద్దతిస్తుందని తెలిపారు. కామ్కాసా ఇరు దేశాల సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పోంపియో పేర్కొన్నారు. భారత రక్షణ సామర్థ్యం, సన్నద్ధతను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. కామ్కాసా అంటే.. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి భారత్కు అత్యాధునిక మిలిటరీ కమ్యూనికేషన్ పరికరాలు అందుతాయి. ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కీలక సమాచారాన్ని సంకేత భాషలో పంచుకునేందుకు వీలు కలుగుతుంది. సత్వరమే అమల్లోకి వచ్చే ఈ ఒప్పం దం పదేళ్లపాటు అమల్లో ఉంటుంది. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే యుద్ధ విమానాలు, ఇతర హెలికాప్టర్లలో అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను అమరుస్తారు. సి–17, సి–130జే, పి–81 విమానాలతో పాటు, అపాచె, చింకూర్ హెలికాప్టర్లలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఇరు దేశాల సైనికుల మధ్య సమాచార మార్పిడి మరింత విస్తృతం అవుతుంది. ఉదాహరణకు భారత్ వైపు చైనా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు రావడాన్ని అమెరికా యుద్ధ విమానాలు గుర్తిస్తే భారత్కు ఆ సమాచారం క్షణాల్లోనే చేరిపోతుంది. శత్రు దేశాల యుద్ధ విమానాల ఉనికిని పసిగట్టే సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేయొచ్చు. -
భారత్-అమెరికా బంధం మరింత పటిష్టం
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వాషింగ్టన్: భారత్- అమెరికా సంబంధాలు గతంకన్నా ఇప్పుడు మరింత బలోపేతం అయినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పలు రంగాల్లో రెండు దేశాలూ సన్నిహిత సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయన్నారు. కేవలం ప్రభుత్వం-ప్రభుత్వ స్థాయి సంబంధాలతోనే ఆగిపోకుండా... ప్రజలు సైతం ఈ బంధం పట్ల హర్షం, ఆమోదం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి ఆర్థికమంత్రి ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా భారత దౌత్య కార్యాలయంలో ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఒక విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒబామా ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతోపాటు, ఇరు దేశాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... * ఇక్కడకు వచ్చిన అమెరికా ప్రభుత్వ సీనియర్లను చూస్తుంటే... రెండు దేశాల సంబంధాలు ఏ స్థాయిలో బలపడ్డాయో అర్థం అవుతుంది. * పలు రంగాల్లో పురోభివృద్ధి ఉంది. దేశం ఒక గణనీయమైన మార్పు దిశగా అడుగులు వేస్తోంది. * భారీ సంస్కరణల అమలుతో పలు ప్రాజెక్టుల్లో పురోగతికి కేంద్రం చొరవలు తీసుకుంటోంది. ముఖ్యంగా మౌలిక రంగం వృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. * భారత్కు 10 శాతం వృద్ధి సాధించే సత్తా ఉంది. దేశంలో పెరుగుతున్న అవసరాలను నెరవేర్చుకోడానికి కూడా ఈ స్థాయి వృద్ధి సాధన అవసరం. * వాషింగ్టన్లో పర్యటన సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలపై జరిగిన ఒక ప్రత్యేక సుదీర్ఘ సదస్సులో కూడా జైట్లీ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement