-
ఇండియా ఫండ్ ఫెస్ట్కు 6,527 దరఖాస్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ స్ట్రాటజీ కన్సల్టింగ్ కంపెనీ నేషియో కల్టస్ నిర్వహిస్తున్న ఇండియా ఫండ్ ఫెస్ట్కు 21 దేశాల నుంచి 6,527 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 663 కంపెనీలు షార్ట్లిస్ట్ కాగా, మోస్ట్ ఫండబుల్ స్టార్టప్స్ జాబితాలో 42 నిలిచాయని ఫెస్టివల్ మెంటార్ నళిన్ సింగ్ తెలిపారు. మే 12న బెంగళూరులో జరిగే ఫెస్ట్లో ఏంజెల్ ఇన్వెస్టర్లు, పెట్టుబడి సంస్థలతో ఈ 42 కంపెనీలు భేటీ అవుతాయని చెప్పారు. నేషియో కల్టస్ రూపొందించిన ఫండింగ్ రెడీనెస్ స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన కంపెనీలకే ఇన్వెస్టర్లు నిధులు సమకూరుస్తారని వివరించారు. మోస్ట్ ఫండబుల్ స్టార్టప్స్ జాబితాలో షోస్క్వేర్డ్, బ్లూ వాటర్ ఆల్కలైన్ సొల్యూషన్స్ తదితర 8 కంపెనీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందినవని ఫెస్టివల్ చైర్మన్ దినేశ్ సింగ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వ్యాపారానికి ఉన్న శక్తి, ఉత్పాదన, సేవల పరిపక్వత, మార్కెట్ అవకాశాలు, ఎంత పెట్టుబడి పెట్టొచ్చు, బలాలు, సవాళ్లు, వ్యవస్థాపకుల సామర్థ్యం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఫండింగ్ రెడీనెస్ రిపోర్టును నేషియో కల్టస్ తయారు చేస్తోంది. -
కంపెనీలకు ఫండింగ్ రెడీనెస్ రిపోర్ట్
⇒ రూపొందిస్తున్న నేషియో కల్టస్ కన్సల్టెన్సీ ⇒ మే 12న ఇండియా ఫండ్ ఫెస్ట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందే. లేదంటే అంచనాలు తారుమారు అవుతాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజీ కన్సల్టింగ్ సేవల్లో ఉన్న నేషియో కల్టస్ కన్సల్టెన్సీ ‘ఫండింగ్ రెడీనెస్’ పేరుతో రిపోర్టులను రూపొందిస్తోంది. వ్యాపారానికి ఉన్న శక్తి, ఉత్పాదన, సేవల పరిపక్వత, మార్కెట్ అవకాశాలు, ఎంత పెట్టుబడి పెట్టొచ్చు, బలాలు, సవాళ్లు, వ్యవస్థాపకుల సామర్థ్యం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ రిపోర్టును తయారు చేస్తోంది. ఇలా నివేదికను తయారు చేయడం ప్రపంచంలో తొలిసారి అని నేషియో కల్టస్ కన్సల్టెన్సీ పార్టనర్ నళిన్ సింగ్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లతోపాటు నిధుల కోసం చూస్తున్న కంపెనీకి ఇది ప్రయోజనాన్ని చేకూరుస్తుందని చెప్పారు. బిజినెస్, ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ నిపుణులు ఈ నివేదికను రూపొందిస్తారని వివరించారు. 50 కంపెనీలకు ఫండింగ్.. నేషియో కల్టస్ మే 12న బెంగళూరులో ఇండియా ఫండ్ ఫెస్ట్ను నిర్వహిస్తోంది. ఇప్పటికే 5 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఫండింగ్ రెడీనెస్ స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన 50 కంపెనీలకు ఫెస్ట్ రోజే నిధులు సమకూరుస్తారు. ఫెస్ట్కు భారత్తోపాటు వివిధ దేశాల నుంచి 200 మంది ఇన్వెస్టర్లు వస్తున్నారని కంపెనీ పార్టనర్ దినేశ్ సింగ్ తెలిపారు. విశేషమేమంటే లక్నో, పట్నా, ఇండోర్, చండీగఢ్, అహ్మదాబాద్, హైదరాబాద్ నుంచి దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. భారత్తోపాటు పలు దేశాల్లోని 225 నగరాలు, పట్టణాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వైజాగ్, విజయవాడ సంయుక్తంగా 25వ స్థానంలో, వరంగల్ 30వ స్థానంలో నిలిచాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటు హక్కును వినియోగించుకోవాలి
14న భద్రకాళికి నాయీబ్రాహ్మణుల సేవలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ సందడి
పటిష్ట ఏర్పాట్ల మధ్య ఈవీఎంల కమిషనింగ్
ఫ్లయింగ్ స్క్వాడ్ అప్రమత్తంగా ఉండాలి
No Headline
నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళిక
ఉన్నత స్థాయికి ఎదగాలి
ఆయిల్పాం రైతులు జాగ్రత్తలు పాటించాలి
4వేల బస్తాల జొన్నల కొనుగోలు
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement