-
కావాలని వివాదాలు చేర్చలేదు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో సాగిన 16 ఏళ్ల కెరీర్లో స్టయిలిష్ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఎప్పుడూ వివాదాల జోలికి పోలేదు. జెంటిల్మన్ క్రికెటర్గానే ఆటను ముగించాడు. ఇప్పుడు లక్ష్మణ్ కెరీర్, విజయాలు, వైఫల్యాలు, వ్యక్తిగత అంశాలతో అతని ఆత్మ కథ అందుబాటులోకి వస్తోంది. ‘281 అండ్ బియాండ్’ పేరుతో వస్తున్న ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. సీనియర్ క్రీడా పాత్రికేయుడు ఆర్. కౌశిక్ సహ రచయితగా ఉన్న ఈ పుస్తకాన్ని వెస్ట్లాండ్ పబ్లికేషన్స్ ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో తన పుస్తకం విశేషాల గురించి లక్ష్మణ్ మాట్లాడాడు. పుస్తకాన్ని సంచలనంగా మార్చేందుకు ఎలాంటి మసాలాలు దట్టించలేదని అతను అన్నాడు. చాలా ఆత్మ కథల తరహాలో పనిగట్టుకొని వివాదాలు సృష్టించే ప్రయత్నం చేయలేదని వీవీఎస్ చెప్పాడు. ‘నా పుస్తకంలో కావాలని చొప్పించిన వివాదాస్పద అంశాలు ఏవీ ఉండవు. అయితే ఇందులో ప్రతీ అక్షరం నిజాయితీగా రాశానని చెప్పగలను. అయితే నాడు స్పందించలేకపోయిన కొన్ని సందర్భాల గురించి మాత్రమే స్పష్టంగా ప్రస్తావించాను. 2000లో ముంబైలో దక్షిణాఫ్రికాతో టెస్టు తర్వాత నన్ను అనూహ్యంగా జట్టు నుంచి తప్పించడం, ఇకపై ఓపెనర్గా ఆడనంటూ కచ్చితంగా చెప్పేసిన విషయం, 2003 ప్రపంచకప్కు ఎంపిక కాకపోవడంపై నేను పడిన వేదనలాంటివి ఇందులో ఉన్నాయి. వివాదం అనే మాటను వాడను కానీ నా మనసులో అనుకున్న విషయాలు మాత్రం నిజాయితీగా వెల్లడిస్తున్నాను’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు. చిన్నప్పుడు క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడం నుంచి రిటైర్మెంట్ వరకు అనేక ఆసక్తికర అంశాలతో పాటు రిటైర్మెంట్ తర్వాతి జీవితం, కుటుంబం తదితర విశేషాలు ఇందులో ఉన్నాయని అతను వెల్లడించాడు. కేవలం క్రికెటర్లకే కాకుండా... చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించే విషయంలో తల్లిదండ్రులకు కూడా తన అనుభవాలు ఉపయోగపడతాయని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. వీవీఎస్ లక్ష్మణ్ అనగానే అందరికీ కోల్కతా 281 ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది కాబట్టి దానిని టైటిల్గా పెట్టామని వీవీఎస్ స్పష్టం చేశాడు. -
ఈసారి 10 బంతుల్లోనే ఆ రికార్డు కొట్టాలి!
న్యూఢిల్లీ: ట్వంటీ-20 మ్యాచ్ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు నిన్నటివరకు భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరిట ఉంది. దానిని ఇప్పుడు వెస్టిండిస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ సమం చేశారు. 12 బంతుల్లో అర్థ శతకం బాది తన రికార్డును గేల్ సమం చేయడం యువీకి నిరాశ కలిగించిందట. అదే 10 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి.. తన రికార్డును బద్దలుకొట్టి ఉంటే తాను మరింత ఆనందించేవాడినని యువరాజ్ చెప్పాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్లో గేల్ యూవీ రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై యువరాజ్ ట్విట్టర్లో స్పందిస్తూ '12 బంతుల్లో ఫిఫ్టీ కొట్టి గేల్ నన్ను నిరాశ పరిచాడు. కాకా(గేల్) నెక్స్ట్ టైం 10 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదు. లేదంటే ఏబీ డివీలియర్స్ ఆ ఫీట్ను సాధించే అవకాశముంది' అని పేర్కొన్నాడు. 20-20లో తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోతున్న క్రిస్ గేల్ 7 సిక్సులు, నాలుగు ఫోర్లతో ఇటీవల 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ కొట్టి యూవీ రికార్డును సమం చేశాడు. 2007లో టీ-20 వరల్డ్కప్లో ఇంగ్లండ్పై యువీ మొదట ఈ అరుదైన ఘనతను సాధించాడు. స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి.. భారత క్రికెట్ అభిమానుల మదిలో చెరుగని జ్ఞాపకాలను నమోదుచేసిన ఈ స్టైలిస్ట్ బ్యాట్స్మన్ 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. -
100 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నాడు!
కొలంబో: శ్రీలంకతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్100.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. 292/8 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి సేన మరో 20 పరుగులు జత చేసి మిగతా 2 వికెట్లు నష్టపోయింది. సెంచరీవీరుడు చతేశ్వర్ పుజారా నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు కీలక ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకోవడమే కాకుంగా చివరివరకు అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని కడ వరకు బ్యాటింగ్ కొనసాగించాడు. శ్రీలంక బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు. 100 ఓవర్ల పాటు అతడు క్రీజులో ఉన్నాడు. పూజారా 289 బంతుల్లో 14 ఫోర్లతో 145 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్ 4, హెరాత్ 3 వికెట్లు పడగొట్టారు. ప్రదీప్, మాథ్యూస్, కౌశల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement