-
రాంచీలో ఢమాల్.. వైజాగ్ లో క్లైమాక్స్
నాలుగో వన్డేలో న్యూజిలాండ్ విజయం ►19 పరుగులతో భారత్ ఓటమి ►సిరీస్ 2-2తో సమం ►చివరి వన్డే శనివారం చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ సమష్టిగా రాణించింది. టెస్టు సిరీస్ క్లీన్స్వీప్ను మరపించేలా వన్డేల్లో స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించింది. రాంచీలోనే సిరీస్ను ముగించాలన్న భారత ఆశలపై నీళ్లు జల్లుతూ నాలుగో వన్డేలో నెగ్గింది. దీంతో సిరీస్ ఫలితం కోసం శనివారం వైజాగ్లో జరిగే ఐదో వన్డే వరకూ ఆగాల్సిందే. బ్యాటింగ్కు ప్రతికూలంగా మారిన పిచ్పై లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్మెన్ తడబడ్డారు. రహానే, కోహ్లి మెరుగ్గా ఆడినా, ఇతర ఆటగాళ్ల వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. కివీస్ వ్యూహాత్మక బౌలింగ్, అద్భుత ఫీల్డింగ్కు భారత్ తలవంచింది. సిరీస్ మొత్తం విఫలమైన గప్టిల్ తొలిసారి న్యూజిలాండ్ను ఆదుకుంటే... సౌతీ, నీషమ్ చక్కగా బౌలింగ్ చేసి కివీస్ను రేసులో నిలబెట్టారు. రాంచీ: సొంతగడ్డపై భారత కెప్టెన్ ధోని పూర్తిగా నిరాశపర్చగా, జట్టు కూడా విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది. ధోని సేన స్థారుుకి తగ్గట్లుగా ఆడకపోవడంతో నాలుగో వన్డే న్యూజిలాండ్ వశమైంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో కివీస్ 19 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (84 బంతుల్లో 72; 12 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. అనంతరం భారత్ 48.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే (70 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఫలితంతో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచారుు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన ఐదో వన్డే ఈ నెల 29న విశాఖపట్నంలో జరుగుతుంది. తొలి వికెట్కు భారీ భాగస్వామ్యం భారత పర్యటనలో ప్రాక్టీస్ మ్యాచ్ సహా మొత్తం ఏడు సార్లు టాస్ ఓడిపోరుున న్యూజిలాండ్ ఎట్టకేలకు ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు మూడు మార్పులు చేయగా, అనారోగ్యంతో ఉన్న బుమ్రా స్థానంలో ధావల్ భారత జట్టులోకి వచ్చాడు. తొలి 15.2 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు స్కోరు... వికెట్ నష్టపోకుండా 96 పరుగులు. ఈ ఆరంభం చూస్తే ఆ జట్టు కనీసం 300 పరుగులు దాటుతుందనిపించింది. కానీ మరో సారి మిడిలార్డర్ వైఫల్యంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. మధ్య ఓవర్లలో మన స్పిన్నర్లు పూర్తిగా కట్టి పడేశారు. ఇన్నింగ్స తొలి ఓవర్ను ఉమేశ్ మెరుుడిన్గా వేసినా... ధావల్ వేసిన తర్వాతి ఓవర్లో గప్టిల్ మూడు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. ధావల్ తర్వాతి ఓవర్లోనూ లాథమ్ (40 బంతుల్లో 39; 4 ఫోర్లు) మరో రెండు బౌండరీలు బాదాడు. 29 పరుగుల వద్ద గప్టిల్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్ను మిశ్రా వదిలేయడం అతనికి కలిసొచ్చింది. దూసుకుపోతున్న ఈ జోడీని ఎట్టకేలకు 16వ ఓవర్లో పటేల్ విడదీశాడు. ఆ తర్వాత గప్టిల్, విలియమ్సన్ (59 బంతుల్లో 41; 4 ఫోర్లు) కలిసి 42 పరుగులు జోడించినా పరుగుల వేగం మందగించింది. 11నుంచి 24 మధ్య 13 ఓవర్లలో స్పిన్నర్లు 50 పరుగులు మాత్రమే ఇచ్చారు. గప్టిల్ను పాండ్యా అవుట్ చేసిన తర్వాత విలియమ్సన్, టేలర్ (58 బంతుల్లో 35; 1 ఫోర్) కలిసి మళ్లీ ఇన్నింగ్సను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అరుుతే పిచ్ కూడా నెమ్మదించడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. మూడో వికెట్కు 46 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్ను పెవిలియన్కు పంపించిన మిశ్రా, తర్వాతి ఓవర్లో నీషమ్ (6) కథ ముగించాడు. వాట్లింగ్ (14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, క్రీజ్లో ఉన్నంత సేపు ప్రతీ పరుగు కోసం కష్టపడ్డ టేలర్ రనౌట్ కావడంతో కివీస్ భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది. మ్యాచ్లో ముగ్గురు భారత స్పిన్నర్లు కలిపి 28 ఓవర్లలో 107 పరుగులు మాత్రమే ఇవ్వగా... చివరి పది ఓవర్లలో కివీస్ మూడు బౌండరీలు మాత్రమే కొట్టగలిగింది. రాణించిన రహానే లక్ష్య ఛేదనలో భారత్ మరోసారి తొందరగానే రోహిత్ (11) వికెట్ కోల్పోరుుంది. అరుుతే ఆ తర్వాత రహానే, కోహ్లి (51 బంతుల్లో 45; 2 ఫోర్లు, 1 సిక్స్) మంచి సమన్వయంతో దూసుకుపోయారు. గత మూడు మ్యాచ్లలో వైఫల్యం తర్వాత ఒత్తిడిలో ఉన్న రహానే ఈ సారి స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించాడు. బౌల్ట్ వేసిన ఓవర్లో ముందుగా ఫోర్ కొట్టిన అతను, ఆ తర్వాత చూడచక్కటి అప్పర్ కట్తో సిక్సర్ బాదాడు. అనంతరం సౌతీ ఓవర్లోనూ మరో రెండు ఫోర్లు కొట్టాడు. మరో వైపు కోహ్లి చకచకా పరుగులు సాధించాడు. అరుుతే వీరిద్దరి 79 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి సోధి తెర దించాడు. దూరంగా వెళుతున్న బంతిని వేటాడి కోహ్లి కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం 61 బంతుల్లో రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అరుుతే ఏడు పరుగుల వ్యవధిలో రహానే, ధోని (31 బంతుల్లో 11) అవుట్ కావడం భారత్ కష్టాలు పెంచింది. నిలదొక్కుకునేందుకు చాలా సమయం తీసుకున్న తర్వాత ధోని క్లీన్బౌల్డయ్యాడు. అరుుతే మరికొద్ది సేపటికే సౌతీ వరుస బంతుల్లో రెండు వికెట్లతో భారత్ను దెబ్బ తీశాడు. లాథమ్ అద్భుత క్యాచ్కు మనీశ్ పాండే (12) వెనుదిరగ్గా, జాదవ్ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో అక్షర్ పటేల్ (40 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్), ధావల్ కులకర్ణి (26 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా లాభం లేకపోరుుంది. ‘వికెట్లు చేతిలో ఉంటే లక్ష్యాన్ని ఛేదించగలిగేవాళ్లం. వికెట్ నెమ్మదిగా మారుతూ రావడం వల్ల బ్యాటింగ్కు కష్టమైంది. 5-6 స్థానాల్లో ఆడిన ఆటగాళ్లకు అనుభవం తక్కువగా ఉంది. అరుుతే క్రికెట్ ఎంతో మారిపోరుున ఈ రోజుల్లో వాళ్లను భారీ షాట్లు ఆడకుండా ఆపడం మంచిది కాదు. 15-20 మ్యాచ్లు ఆడితే వారే నేర్చుకుంటారు. సిరీస్ గెలవాలంటే చివరి వన్డేలో మేం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది’ - ధోని -
‘డ్రా’తో గట్టెక్కారు
70 ఓవర్లు.... 384 పరుగుల లక్ష్యం... ఒక దశలో భారత్ స్కోరు 19 పరుగులకే 3 వికెట్లు... మరో పరాభవం తప్పదనుకుంటున్న వేళ... కోహ్లి, రహానే మళ్లీ ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులు మాటలతో కాక పుట్టించినా... భయంకరమైన బంతులతో విరుచుకుపడినా... పట్టుదలతో పోరాడి క్రీజ్లో నిలిచారు. మ్యాచ్ను ‘డ్రా’ దిశగా మళ్లించారు. కొద్దితేడాలో కోహ్లి, రహానే, పుజారా అవుటైనా... చివర్లో ఒత్తిడికి తట్టుకొని ధోని, అశ్విన్ స్ఫూర్తిదాయక ఆటతీరుతో భారత్ను గట్టెక్కించారు. విజయంతో కాకుండా ‘డ్రా’తోనే సరిపెడదామని భావించిన ఆసీస్ కెప్టెన్ స్మిత్ చాలా ఆలస్యంగా డిక్లేర్ చేయడం కూడా భారత్కు కలిసొచ్చింది. సిరీస్ 2-0తో ఆస్ట్రేలియా వశం ⇒ రాణించిన కోహ్లి, రహానే ⇒ వచ్చే నెల 6 నుంచి నాలుగో టెస్టు మెల్బోర్న్: ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మూడో టెస్టు నాటకీయ పరిణామాల మధ్య ‘డ్రా’గా ముగిసింది. ఆట మొత్తం ఆసీస్ ఆధిపత్యం చూపినా... ఆఖరి రోజు సహనంతో ఆడిన భారత్ ఓటమి నుంచి గట్టెక్కింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చకచకా వికెట్లు చేజార్చుకున్నా... చివరి సెషన్ మొత్తం నిలకడను చూపిన టీమిండియా కంగారూల విజయానికి బ్రేక్ వేసింది. దీంతో ఎంసీజీలో భారత్, ఆసీస్ల మధ్య జరిగిన మూడో టెస్టు ‘డ్రా’ అయ్యింది. ఫలితంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే స్మిత్ సేన 2-0తో కైవసం చేసుకుంది. 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 66 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. కోహ్లి (99 బంతుల్లో 54; 7 ఫోర్లు), రహానే (117 బంతుల్లో 48; 6 ఫోర్లు) మరోసారి ఆకట్టుకున్నారు. పుజారా (21), ధోని (39 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు 261/7 ఓవర్నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను 98 ఓవర్లలో 9 వికెట్లకు 318 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మార్ష్ (215 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. చకచకా... లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్కు... ఆరంభంలోనే కంగారూలు షాక్ ఇచ్చారు. కట్టుదిట్టమైన బంతులతో చెలరేగుతూ 9 ఓవర్లలోపే ధావన్ (0), రాహుల్ (1), విజయ్ (11)లను అవుట్ చేశారు. దీంతో భారత్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కోహ్లికి జత కలిసిన రహానే అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. దాదాపు మూడు గంటలకు పైగా ఓపికగా బ్యాటింగ్ చేసి చేజారిపోయిన మ్యాచ్ను ‘డ్రా’వైపు మళ్లించారు. అయితే టీ విరామం తర్వాత తొలి బంతికే కోహ్లి అవుట్ కావడంతో ఆసీస్కు విజయంపై ఆశ పుట్టింది. కానీ పుజారా నిలకడను చూపడంతో కంగారూలకు నిరాశ తప్పలేదు. దాదాపు 16.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన చతేశ్వర్ ఐదో వికెట్కు రహానేతో కలిసి 37 పరుగులు జోడించి అవుటయ్యాడు. మరో నాలుగు ఓవర్ల తర్వాత రహానే కూడా వెనుదిరగడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. అయితే చివర్లో ధోని, అశ్విన్ (34 బంతుల్లో 8 నాటౌట్) ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. చివరకు మరో నాలుగు ఓవర్ల ఆట మిగిలి ఉండగానే స్మిత్ ‘డ్రా’కు అంగీకరించాడు. ఫలితంగా 1997 తర్వాత మరోసారి మెల్బోర్న్ మైదానంలో జరిగిన టెస్టు ‘డ్రా’గా ముగిసింది. హారిస్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్లోని చివరిదైన నాలుగో టెస్టు జనవరి 6 నుంచి సిడ్నీలో జరుగుతుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 530; భారత్ తొలి ఇన్నింగ్స్: 465; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్ప్: 318/9 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యూ (బి) హాజల్వుడ్ 11; ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) హారిస్ 0; రాహుల్ (సి) వాట్సన్ (బి) జాన్సన్ 1; కోహ్లి (సి) బర్న్స్ (బి) హారిస్ 54; రహానే (సి) మార్ష్ (బి) హాజల్వుడ్ 48; పుజారా (బి) జాన్సన్ 21; ధోని నాటౌట్ 24; అశ్విన్ నాటౌట్ 8; ఎక్స్ట్రాలు: 7; మొత్తం: (66 ఓవర్లలో 6 వికెట్లకు) 174 వికెట్ల పతనం: 1-2; 2-5; 3-19; 4-104; 5-141; 6-142 బౌలింగ్: జాన్సన్ 15-3-38-2; హారిస్ 16-8-30-2; హాజల్వుడ్ 15-3-40-2; లయోన్ 12-0-36-0; వాట్సన్ 6-1-14-0; స్మిత్ 2-0-10-0. ‘ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో మేం ఎంచుకున్న మార్గాలు మాకే ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మ్యాచ్ మొత్తం కొనసాగించాలి. మ్యాచ్ ‘డ్రా’ అయినందుకు కాస్త సంతోషమే. చివరి రోజు ఆట వల్లే ఇది సాధ్యమైంది. కొత్త కుర్రాళ్లు కుదురుకోవడానికి సమయం ఇవ్వాలి’-ధోని (భారత కెప్టెన్) ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలిచినందుకు సంతోషంగా ఉంది. చివరిసారి చెత్తగా ఓడాం. మళ్లీ ఇప్పుడు అనుకున్నది సాధించాం. వచ్చేసారి భారత్కు వెళ్లినప్పుడు మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం. డిక్లేర్ విషయంలో రెండుసార్లు పునరాలోచించా. అయినప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయా. అడిలైడ్ కంటే ఈ పిచ్ కాస్త మెరుగ్గా ఉం డటంతో ఆలస్యం చేశా’ - స్మిత్ (ఆసీస్ కెప్టెన్)
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement