-
ఈ సామీప్యం వెనుక మతలబు ఏంటి?
చైనాపై తాను పూర్తిగా ఆధారపడటం ద్వారా అంతర్జాతీయంగా ఏకాంతవాసం నుంచి బయటపడటం సాధ్యపడదని పాక్ అర్థం చేసుకుంటోంది. దీనివల్లే పాక్ స్వరంలో గణనీయ మార్పు రావడమే కాకుండా భారత్తో తన సంబంధాలు కూడా కాస్త మృదురూపం తీసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఒంటరితనంలో చిక్కుకున్న పాకిస్తాన్ అదే సమయంలో చైనాకు మరింత దగ్గర కావడాన్ని అటు అమెరికా కానీ ఇటు భారత్ కానీ కోరుకోవడం లేదు. హిందూమహాసముద్రంలో, దక్షిణ చైనా సముద్రంలో, పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాధాన్యతపై భారత్ వ్యూహాత్మక అంచనా, అంతర్జాతీ యంగా పాక్ ఒంటరి కావడం అనేవే భారత్, పాక్ మధ్య ఇటీవలి పరిణామాలకు దోహదపడ్డాయని చెప్పాలి. వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల పొడవునా కాల్పుల విరమణకు కట్టుబడటం ద్వారా శాంతిని నెలకొల్పవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ భారత్, పాకిస్తాన్లు ఫిబ్రవరి 25న సంయుక్త ప్రకటన చేశాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు తూట్లు పడి ఎంతో కాలం కాలేదు. అయినప్పటికీ ఈ అసాధారణ పరిణామానికి దారితీసిన కారణాలను అంచనా వేయడానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకించి పుల్వామా దాడులు, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిన నేపథ్యంలో ఈ సరికొత్త పరిణామాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా పాకిస్తాన్ అంతర్జాతీయ ఏకాంతవాసాన్ని ఎదుర్కొంటూ వస్తోంది. మధ్యప్రాచ్యంలో పాకిస్తాన్ ప్రాధాన్యత మసకబారిపోతోంది. చారిత్రకంగా చూస్తే యూఏఈ, సౌదీ అరేబియా దేశాలతో పాకిస్తాన్ సన్నిహిత సంబంధాలు కలిగిఉండేది. పైగా కశ్మీర్ సమస్యపై ఈ రెండు దేశాలను పాక్ బాగా ఉపయోగించుకునేది. ఎమెన్తో సౌదీ గొడవలకు సంబంధించి తటస్థంగా ఉండాలని పాకిస్తాన్ నిర్ణయించుకోవడంతో సౌదీ– పాక్ బంధాలు కాస్త గడ్డకట్టుకుపోయాయి. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో భారత్ ఆర్థిక, జనాభాపరమైన ప్రభావం ఎక్కువ కావడంతో సౌదీ అరేబియా, యూఏ ఈలతో భారత్ సంబంధం మెరుగుపడుతూ వచ్చింది. దీంతో సౌదీ అరేబియా, యూఏఈలు కశ్మీర్ సమస్యపై తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇది పాకిస్తాన్ని బాగా ఇబ్బందిపెట్టింది. అందుచేత, 2020 నవంబర్లో ఓఐసీ (ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్) దేశాల సమితిలో కశ్మీర్ అంశాన్ని కీలక ఎజెండాగా పాకిస్తాన్ ప్రతిపాదించినప్పుడు యూఏఈ, సౌదీ రెండు దేశాలూ దాన్ని వ్యతిరేకించాయి. దీంతో కశ్మీర్ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి సౌదీని విమర్శించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బీటలు వారిపోయాయి. పైగా తాను గతంలో పాకిస్తాన్కు ఇచ్చిన 3 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించేయాలని సౌదీ నిగ్గదీసింది. పైగా మధ్యప్రాచ్య రాజకీయాల్లో కీలక బిందువుగా మారుతున్న ఇజ్రాయెల్ను గుర్తించడానికి తిరస్కరించినందున పాకిస్తాన్ ఈ ప్రాంతంలో తన ప్రాముఖ్యతను కోల్పోతోంది. ఇకపోతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తూనే వస్తున్నాయి. అందుకే ఫిబ్రవరి 25న కూడా ఆర్థిక కార్యాచరణపై టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను గ్రే లిస్టులో ఉంచేసింది. అంటే ఉగ్రవాదులకు నిధులు ఇవ్వడాన్ని నిలిపివేయడంలో పాకిస్తాన్ విఫలమైతే తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని దీనర్థం. పైగా భారత్తో అమెరికా సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకుంది. చైనాకు వ్యతిరేకంగా భౌగోళిక రాజకీయపరంగా, ఆర్థికంగా భారత్ కీలకస్థానంలో ఉండటం, ఉగ్రవాదులను స్పాన్సర్ చేయడాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ విఫలం చెందడం దీనికి కారణాలు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రారంభ సంవత్సరాల్లో ఈ ధోరణి మరింత వేగం పుంజుకుంది. దీంతో అమెరికాకు పాకిస్తాన్ మరింత దూరం జరగడం, చైనాపై పాక్ ఆధారపడటం పెరగడం మొదలైంది. ఇక దక్షిణాసియాలో కూడా పాక్ మిత్రదేశాలైన శ్రీలంక, నేపాల్, మాల్దీవులు పాక్తో సంబంధాలపై భారత్ ఆందోళన పట్ల మరింత జాగ్రత్తతో ఉంటున్నాయి. ఫలితంగా ఇటీవలే శ్రీలంక పర్యటనకు వచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ షెడ్యూల్ ప్రకారం పార్లమెంటును ఉద్దేశించి చేయవలసిన ప్రసంగాన్ని శ్రీలంక రద్దు చేసింది. అదేసమయంలో భారత్ను అవమానపర్చే క్యాంపెయిన్ను పాక్ పునరాలోచించుకోవాలని పాకిస్తాన్ను కోరుతూనే కశ్మీర్పై భారత్ విధానాన్ని మాల్దీవులు బలపర్చడం విశేషం. మరోవైపు భూటాన్, బంగ్లాదేశ్, అప్గానిస్తాన్ దేశాలు కూడా పాకిస్తాన్పై సదభిప్రాయం కలిగి లేవు. భారత్ ప్రయోజనాలు, దాని భద్రతాపరమైన సమస్యలకు ప్రాధాన్యమిస్తూ భూటాన్ తన విదేశీ విధానాన్ని రూపొందించుకుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఆమెకు చెందిన అవామీ లీగ్ పార్టీ భారత్తో సంబంధాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. పైగా, అప్గానిస్తాన్ కూడా ఉగ్రవాదాన్ని, తాలిబన్లను ప్రోత్సహిస్తున్న పాక్ను దుయ్యబట్టడం కొనసాగిస్తూనే ఉంది. దౌత్యపరమైన ఈ వెనుకంజలతో పాకిస్తాన్ టర్కీ, ఇరాన్, రష్యా, చైనా దేశాలతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ కొత్త సంబంధాలు కూడా పాక్ని ఏకాంతం నుంచి బయటపడవేయలేదు. ఇస్లామిక్ ప్రపంచానికి తామే నాయకులమని భావిస్తున్న టర్కీ, ఇరాన్ ఈ క్రమంలో సౌదీ అరేబియా పాత్రను నిరంతరం ప్రశ్నిస్తూ వస్తున్నాయి. అందుచేత ఈ రెండుదేశాలతో పాక్ సన్నిహితంగా మెలి గితే అది సౌదీ, యూఏఈ దేశాలను బాగా ఇబ్బంది పెడుతుంది. మరోవైపున పాకిస్తాన్తో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకుంటున్న రష్యా.. భారత్కు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి పాక్తో మరీ అంటకాగడంపై ఆలోచిస్తోంది. ఇక స్నేహం ప్రాతిపది కన ఏర్పడిన పాక్–చైనా బంధం ఇప్పుడు పాకిస్తాన్కు వేరేమార్గం లేకుండా తప్పనిసరి పరిస్థితిలోకి నెట్టివేసింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఎంత ఎక్కువగా వేరుపడిపోతే అంతే స్థాయిలో అది చైనాపై ఆధారపడటం పెరిగిపోతుంది. అప్పులిచ్చి గుప్పిట్లో పెట్టుకునే చైనా దౌత్యం గురించి పాకిస్తాన్కు బాగానే తెలుసు. చైనాపై ఆధారపడటం వల్ల తన భద్రతా విధానాలు ఎంతగా ప్రభావితమవుతున్నాయో పాకిస్తాన్ అర్థం చేసుకుంటోంది. చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో తన పెట్టుబడుల ప్రాధాన్యతను గుర్తించిన చైనా గిల్గిత్ బాలిస్తాన్ను తన అయిదో ప్రావిన్స్గా మార్చాలని పాక్పై ఒత్తిడి చేస్తోంది. దీంతో చైనాపై తాను పూర్తిగా ఆధారపడటం, అలా చేయడం ద్వారా అంతర్జాతీయంగా ఏకాంతవాసం నుంచి బయటపడటం సాధ్యపడదని పాక్ అర్థం చేసుకుంటోంది. అందుకనే తన దౌత్యపరమైన, వ్యూహాత్మక సమాన స్థాయిని వేగవంతం చేయడంపై పాక్ మల్ల గుల్లాలు పడుతోంది. దీనిఫలితంగానే ట్రంప్ పాలన మలిదశలో యూఎస్–తాలిబన్ శాంతి చర్చలు ఫలప్రదం కావడంలో పాక్ ముఖ్యమైన పాత్రను పోషించింది. దీనివల్ల దానికి రెండు ఫలితాలు సిద్ధిం చాయి. యూఏఈతో కోల్పోయిన స్థాయిని అది తిరిగి పెంచుకుంది. ఇక రెండోది ఏమిటంటే అప్గానిస్తాన్లో అంతర్గత పరిణామాల ప్రభావంతో పాశ్చాత్య దేశాలు అక్కడినుంచి త్వరగా వెనక్కు తిరగాలని భావిస్తున్నాయి. రెండోది ఏమిటంటే, తాలిబాన్ను బలోపేతం చేయడం ద్వారా అప్గానిస్తాన్లో తనపట్ల వ్యతిరేకత ప్రదర్శించని ప్రభుత్వాన్ని ఏర్పర్చాలని పాక్ కోరుకుంటోంది. అలాగైనా అంతర్జాతీయంగా తనకెదురవుతున్న ఒంటరితనానికి దూరం కావచ్చని పాక్ భావన. దీనివల్లే పాక్ స్వరంలో గణనీయ మార్పు రావడమే కాకుండా భారత్తో ఇటీవలి పరిణామాలు కూడా కాస్త మృదురూపం తీసుకుం టున్నాయి. ఈ వ్యూహాత్మక అంచనా కారణంగానే భారత్ కూడా తన స్వరంలో కాస్త మార్పు తీసుకొస్తోంది. దక్షిణాసియా ప్రాంతంలో చైనా పెరుగుతున్న ప్రభావం, ఇటీవలి సరిహద్దు ఘర్షణల కారణంగా పాకిస్తాన్తో సంబంధాల సాధారణీకరణ కోసం భారత్ కూడా ప్రయత్నించాల్సి వస్తోంది. అంతిమంగా అంతర్జాతీయంగా ఒంటరితనంలో చిక్కుకున్న పాకిస్తాన్ అదే సమయంలో చైనాకు మరింత దగ్గర కావడాన్ని అటు అమెరికా కానీ ఇటు భారత్ కానీ కోరుకోవడం లేదు. హిందూమహాసముద్రంలో, దక్షిణ చైనా సముద్రంలో, పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాధాన్యత గురించి భారత్ వ్యూహాత్మక అంచనా, అంతర్జాతీయంగా పాక్ ఒంటరి కావడం అనేవే ఈ రెండు దేశాల మధ్య ఇటీవలి పరిణామాలకు దోహదపడ్డాయని చెప్పాలి. ఆదిత్య గౌడర శివమూర్తి వ్యాసకర్త విదేశీ వ్యవహారాల నిపుణులు (‘ది స్టేట్స్మన్’ సౌజన్యంతో) -
పాక్తో చర్చలకు ఫేస్బుక్లో ఉద్యమం
భారత విదేశాంగ దౌత్య విధానాన్ని ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా మార్చగలదా? పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై టెర్రరిస్టుల దాడి కారణంగా సందిగ్ధంలో పడిన భారత-పాక్ చర్చల ప్రక్రియను పునరుద్ధరించగలదా? దాయాదుల లాంటి ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులను కోరుకుంటున్నామని, అందుకు చర్చలే పరిష్కారమని ఆశిస్తున్నామంటూ సరిహద్దులకు ఇరువైపులున్న ఫేస్బుక్ యూజర్లు పెద్ద ఉద్యమాన్నే చేపట్టారు. 'ప్రొఫైల్ ఫర్ పీస్' అనే నినాదంతో వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. శాంతిసూక్తులు రాసిన ప్లకార్డులను పట్టుకొని దిగిన ఫొటోలను పోస్టు చేస్తున్నారు. ముంబై నివాసి రామ్ సుబ్రమణియం ముందుగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 'ఎవరో కొద్ది మంది హింసావాదుల చర్యకు మమ్మల్ని బలిచేయొద్దు. ఆ చర్య కారణంగా మా భవిష్యత్తును నిర్దేశించవద్దు. మేము శాంతిని కోరుకుంటున్నాం. టెర్రరిస్టులను చంపండి, చర్చలను కాదు' అన్న వ్యాఖ్యలతో ఆయన తన ఫొటోను పఠాన్కోట్ ఆపరేషన్ ముగిసిన వెంటనే పోస్ట్ చేశారు. అలా మొదలైన ఈ ఉద్యమం వేగంగా ఫేస్బుక్లో విస్తరించింది. పాకిస్తాన్ నుంచి కూడా యూజర్లు ఈ ఉద్యమానికి భారీ సంఖ్యలో మద్దతు పలుకుతున్నారు. 'ఓ భారత్, పాకిస్తాన్ నేతల్లారా! యుద్ధం అంటే శాంతిమృగ్యం అని అర్థం కాదు. న్యాయం జరక్కపోవడం. మెదళ్లు పుచ్చిపోయిన కొంత మంది చర్యలకు లొంగవద్దు. ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది మీరే. నాలాగా ఈ భూమ్మీద ఎంతోమంది శాంతిని కోరుకుంటున్నారు' ... అని న్యూయార్క్కు చెందిన ఓ హక్కుల సంస్థలో పనిచేస్తున్న రఫీక్ కట్వారియా తన ఫేస్బుక్ ప్రొఫైల్ ఫొటోను పోస్ట్ చేశారు. 'విద్వేషానిది ఎప్పుడూ విజయం కాకూడదు. ఇప్పుడు మీరు సుస్థిర శాంతి కోసం తీసుకునే చర్యలకు మా భవిష్యత్ తరాలు మీకు రుణపడి ఉంటాయి' అని ఢిల్లీ నివాసి, ఓ టెక్నాలజీ సంస్థ యజమాని సమీర్ గుప్తా తన ఫ్రొఫైల్లో వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య శాంతిని కోరుకుంటూ పాడిన పాట వీడియోను కూడా పోస్ట్ చేశారు. 'టెర్రరిజాన్ని చంపండి చర్చలను కాదు' అంటూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా పాకిస్తాన్ జర్నలిస్ట్ బీనా సర్వార్ పిలుపునిచ్చారు. ఇలా ఫేస్బుక్ యూజర్లు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు. ముందస్తు నిర్ణయం ప్రకారం భారత్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల మధ్య ఈ నెల 15న చర్చలు జరగాల్సి ఉంది. పఠాన్కోట్ పరిణామం నేపథ్యంలో చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడింది. పాక్ సరిగా స్పందిస్తే తప్ప ఆ దేశంతో చర్చలు ఉండబోవని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. మరోవైపు ఇదే విషయమై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం నాడు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చలు జరిపారు. చర్చల సారాంశం మాత్రం వెలుగులోకి రాలేదు. -
భారత్- పాక్ చర్చల్లో తీవ్ర ప్రతిష్ఠంభన
జాతీయ భద్రతా సలహదారు స్థాయిలో పాకిస్థాన్తో జరగాల్సిన చర్చలలో ప్రతిష్ఠంభన చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, ఆ చర్చలకు ముందుగానే కాశ్మీర్లోని వేర్పాటువాద నాయకులను పాకిస్థాన్ చర్చలకు పిలవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హురియత్ నాయకులతో చర్చించడం తగదని స్పష్టంగా చెప్పినా.. పాక్ వినిపించుకోకుండా మొండిగా ముందుకెళ్లడం, మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ లాంటి హురియత్ నేతలు కూడా తాము పాకిస్థాన్తో చర్చలకు వెళ్తామని చెప్పడం.. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చర్చలు జరగాలా.. వద్దా అనే విషయాన్ని పాకిస్థాన్ కే వదిలేసింది. వాస్తవానికి రెండు దేశాల మధ్య చర్చల విషయంలో మూడో పక్షానికి అవకాశం లేదని భారత్ ఎప్పుడూ చెబుతూ వస్తున్నా, పాక్ మాత్రం పదే పదే అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ సమస్యను ప్రస్తావించడం, మూడో పక్షం జోక్యాన్ని ఆహ్వానించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్తో శాంతియుత చర్చలకే భారత్ ఎప్పుడూ ముందుకెళ్లిందని, కానీ పాక్ ఎజెండా మాత్రం ఉగ్రవాదంతోనే ముడిపడి ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. ఏకపక్షంగా కొత్త నిబంధనలు విధించడం, ముందుగా ఒప్పుకొన్న ఎజెండాను తప్పించడం.. ఇదంతా ఏంటని ప్రశ్నించారు. పాకిస్థాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కడానికి దారి తీసిన పరిస్థితులేంటో వాళ్లే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో అజిత్ దోవల్ సమావేశమయ్యారు. -
అజెండాలో కాశ్మీర్ లేకుంటే భారత్తో చర్చల్లేవు: పాక్
పాకిస్థాన్ మరోసారి తన బుద్ధి బయటపెట్టుకుంది. తమ ఆత్మగౌరవం విషయంలో రాజీ పడేది లేదంటూ.. కాశ్మీర్ అంశాన్నిఅజెండాలో చేర్చకపోతే భారతదేశంతో చర్చల ప్రసక్తి లేనే లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని జాతీయభద్రత, విదేశీ వ్యవహారాలలో పాక్ ప్రధానమంత్రి సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ల మధ్య జరిగిన సమావేశం గురించి మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య భేటీ జరగడం మంచిదేనని, ఉద్రిక్తతలను చల్లార్చడంపైనే అందులో దృష్టిపెట్టారని అజీజ్ చెప్పారు. ముంబై ఉగ్రదాడి కేసులో లష్కరే తాయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ విచారణ గురించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. భారతదేశం నుంచి ఈ విషయంలో తమకు మరిన్ని ఆధారాలు కావాలన్నారు. మోదీతో సమావేశం సందర్భంగా.. సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్ల విషయంలో కూడా తమకు మరింత సమాచారం కావాలని నవాజ్ షరీఫ్ అడిగినట్లు ఆయన చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
గూగుల్లో మళ్లీ లేఫ్స్.. ఎందుకో తెలుసా..
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
Advertisement