-
ఇద్దరు అవినీతి ఇన్స్పెక్టర్ల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులను సస్పెం డ్ చేస్తూ వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. తాండూర్ సీఐ సైదిరెడ్డి, హుజూర్నగర్ సీఐ నర్సింహారెడ్డిలు అవినీతికి పాల్పడ్డట్లు అంతర్గత విచారణలో తేలింది. భారీస్థాయిలో ఇసుక దందాకు సహకరించడం, లారీలు, ట్రాక్టర్ల నుంచి డబ్బుల వసూళ్లు, గుట్కా కార్యకలాపాలు సాగిస్తున్న వారితో సంబంధాలు, మట్కా స్థావరాలు తెలిసినా కేసులు పెట్టకుండా మేనేజ్చేస్తూ రావడం లాంటి అంశాలపై పోలీసుశాఖ అంతర్గత విచారణ జరిపించింది. తాం డూర్ సీఐ సైదిరెడ్డి 3 హత్య కేసుల్లో నిందితులను కాపాడే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు రుజువు కావడంతో సస్పెండ్ చేసినట్లు ఆ శాఖ తెలిపింది. సీఐ నర్సింహారెడ్డి ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను అధికారికంగా తొలగించి అనధికారికంగా వసూళ్లు చేస్తున్నట్లు రుజువైందని అధికారులు తెలిపారు. కాకినాడలో బెదిరిం పులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యా దు వచ్చిందని, దీనిపై విచారణ జరపగా నిజమేనని తేలిందన్నారు. వీరిద్దరిపై మౌఖిక విచారణకు ఆదేశించామని, బాధితులు ఎవరున్నా నేరుగా ఐజీ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చని ఆ శాఖ తెలిపింది. -
బాబు వచ్చే...జాబు పోయే!!
గృహనిర్మాణ సంస్థలో 149 మంది వర్క్ ఇన్స్పెక్టర్ల తొలగింపు రిటైర్మెంట్ పేరుతో 200 మంది అంగన్వాడీ ఉద్యోగులు ఇంటిదారి ఆదర్శ రైతులు 1551 మంది తొలగింపు మచిలీపట్నం : పోయి ఉన్న ఉద్యోగాలను పీకేశారు.జిల్లా గృహనిర్మాణ సంబాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందంటూ ఎన్నికల్లో ప్రకటనలు గుప్పించారు. టీడీపీ సర్కారు వచ్చాక కొత్తవి ఇవ్వడం స్థ 2007 నుంచి 149 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు. టెక్నికల్ ఉద్యోగులకు నెలకు రూ.9 వేలు, నాన్టెక్నికల్ ఉద్యోగులకు రూ.7,500 చొప్పున వేతనం ఇచ్చేవారు. 2014 అక్టోబర్ 14 నుంచి 70మంది వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించారు. ఆదర్శరైతులదీ ఇంటిదారే: జిల్లాలో 2007-08లో 2,365 మంది ఆదర్శరైతులను నియమించారు. 2014 -15 నాటికి వీరి సంఖ్య 1551 మందికి పడిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 జూన్లో వారందరినీ విధుల నుంచి తొలగించారు. అంగన్వాడీలకు పదవీ విరమణ: టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచరుకు రూ.7వేల వరకు, ఆయాకు రూ.4,700 వేతనం ఇస్తామని చెప్పింది. మినీ అంగన్వాడీల్లో పనిచేసే టీచరుకు రూ.6,400 ఇస్తామని, సెప్టెంబర్ నుంచి ఈ వేతనాలు అమలుచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే పెంచిన వేతనం ఇవ్వకపోగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ వయసు ప్రకటించారు. జిల్లాలో 135మంది టీచర్లు, 65 మంది ఆయాలను తొలగించారు. గాలిలో ఫీల్డు అసిస్టెంట్లు :జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 167 మంది ఫీల్డు అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం గాలిలో పెట్టింది. 7వేల పనిదినాలు లక్ష్యం చేరుకోలేదని కొంతమందిని, సక్రమంగా పనిచేయడం లేదని మరికొందరిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోంది. సీఎస్పీలూ ఇంటికే: జిల్లావ్యాప్తంగా 1100 మంది కష్టమర్ సర్వీస్ ప్రొవైడర్లు (సీఎస్పీ)లను ప్రభుత్వం తొలగించింది. వారు గ్రామాల్లో, పట్టణాల్లో లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు అందజేసేవారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement