-
జూన్ 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
-
‘ఇంటర్’ పరీక్ష ఫీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. వచ్చే నెల 2వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 29తో ఫీజు గడువు ముగుస్తుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న వినతులను పరిశీలించిన బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తల్లిదండ్రులు సకాలంలో ఫీజు చెల్లించాలని, ఆ మొత్తాన్ని సంబంధిత ప్రిన్సిపాళ్లు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలని స్పష్టం చేసింది. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వరుసగా ఎనిమిది రోజులు పరీక్షలు జరుగుతాయి. జూన్ 1తోఅడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగుస్తాయి. జూన్ 7 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, జూన్ 3, 4 తేదీల్లో ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి. వొకేషనల్ కోర్సులకు సంబంధించి కూడా పరీక్ష తేదీలు వాటి ప్రకారమే ఉండనున్నాయి. వాస్తవానికి మే రెండో వారం నుంచే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న తప్పిదాలు, దాని ఫలితంగా దారితీసిన పరిస్థితులతో తేదీల మార్పు అనివార్యమైంది. పరీక్ష ఫీజు స్వీకరణ మొదలు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ పక్రియలో జాప్యం జరగడంతో ఈ మేరకు పరీక్ష తేదీలు ముందుకు వెళ్లాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదీ... ఫలితాల విడుదల ఆలస్యం... ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ మూడో వారంలో వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఇంటర్ ఫలితాలపై బోర్డులో నెలకొన్న గందరగోళం ఇంకా కొనసాగుతోంది. సాంకేతిక సమస్యల పరిష్కారంతోపాటు రిజల్ట్స్ ప్రాసెస్ ఎవరు చేస్తారనే దానిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. దీంతో ఫలితాల విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాల విడుదల ఆలస్యమయ్యేకొద్దీ ఆ ప్రభావం విద్యార్థులపై పడనుంది. సాధారణంగా జూన్ మొదటి వారం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. పలు రకాల సెట్లకు సంబంధించిన ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులు సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్కు హాజరవుతారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో జాప్యం జరిగితే ఆయా అభ్యర్థులు కౌన్సెలింగ్కు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 24 నుంచి నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటలకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలవుతాయి. అదే విధంగా ప్రాక్టికల్స్ జూన్ 1 నుంచి 6 వరకు నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ పరీక్ష జూన్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 8వ తేదీ జరగనుంది. ఇంటర్ ఒకేషనల్ కోర్స్ విద్యార్థులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. -
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ తొలి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ, రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత ఆలస్య రుసుం, తత్కాల్కు కూడా అవకాశం ఉండదని ఇంటర్ బోర్డు సోమవారం తెలిపింది. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement