-
ఐదో తరగతి వరకు చదివి...
మహబూబాబాద్ రూరల్: అంతర్ జిల్లా నేరస్తుడు అంగడి సూరయ్య అలియాస్ సురేష్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 36 తులాల బంగారు, 26 తులాల వెండి ఆభరణాలు (రూ. 10 లక్షల సొత్తు) స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ టౌన్ సీఐ ఎస్.ఏ జబ్బార్, సీసీఎస్ సీఐ బి. శ్రీనివాసులు, ఎస్సై జి. స్వామిదాస్, సిబ్బంది వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ శివారులో తనిఖీలు చేపట్టారన్నారు. అంతర్ జిల్లా నేరస్తుడైన, జిల్లాలోని నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అంగడి సూరయ్య అలియాస్ సురేష్ తన ద్విచక్ర వాహనంపై తొర్రూరు వైపు నుంచి మహబూబాబాద్కు వస్తున్నాడు. తొర్రూరు బస్టాండ్ సమీపంలో పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. సురేష్ను విచారించగా మహబూబాబాద్, డోర్నకల్, బయ్యారం, గూడూరు, తొర్రూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంగపేట ప్రాంతాల్లో దొంగతనాలు చేసి సంపాదించిన బంగారు వస్తువులను దాచిపెట్టి, వాటిని మహబూబాబాద్ పట్టణంలో రహస్యంగా అమ్మేందుకు వచ్చాడని చెప్పాడన్నారు. తాను చేసిన నేరాలన్ని అంగీకరించాడని, అతడి వద్ద నుంచి 36 తులాల బంగారు, 26 తులాల వెండి ఆభరణాలు (రూ. 10 లక్షల సొత్తు) స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మోటర్ సైకిల్కు కూడా పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. అంగడి సురేష్ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, ఆ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసేవాడని, అదే విధంగా ఇంట్లో నిద్రిస్తున్న వారి మెడలో ఉన్న పుస్తెలను లాక్కు పోవడం చేసేవాడన్నారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి దొంగతనాలకు పాల్పడే వాడని, కూతాటి రమేష్, అంగడి జంపయ్యతో కలిసి కూడా చోరీలకు పాల్పడ్డారన్నారు. ఇతడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు 120 కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడన్నారు. సురేష్ చేసిన నేరాల్లో మహబూబాబాద్ పట్టణంలో 4, బయ్యారంలో 3, డోర్నకల్లో 1, గూడూరులో 1, తొర్రూర్లో 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో 1, నల్గొండ జిల్లా నకిరేకల్లో 3, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేటలో 1 కేసు ఉన్నాయన్నారు. ఐదో తరగతి వరకు చదివి... చదువుమానేసి ఆటో డ్రైవర్గా పని చేస్తూ తద్వారా వచ్చిన డబ్బులు సరిపోక చెడు అలవాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలని దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడని తెలిపారు. 2010లో మహబూబాబాద్ పట్టణంలో దొంగతనాలు చేసి పట్టుబడి జైలు జీవితం అనుభవించాడని, హైదరాబాద్లోని వనస్థలిపురం, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో, నల్లొండ, కేసముద్రం పోలీసులకు పట్టుబడి జైలు జీవితాన్ని గడిపి వచ్చాడన్నారు. మళ్లీ మహబూబాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తుండగా అతడిపై నిఘా పెట్టి పట్టణంలో పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. రివార్డు అందజేత సురేష్ను చాకచక్యంగా పట్టుకుని అతని వద్ద నుంచి దొంగ సొత్తును రికవరీ చేసేందుకు కృషి చేసిన డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్, రికవరీ చేసిన సీసీఎస్ సీఐ బి. శ్రీనివాసులు, ఎస్సై జి. స్వామిదాసు, టౌన్ సీఐ షేక్ అబ్ధుల్ జబ్బార్, సీసీఎస్ హెచ్సీ ఇనాయత్అలీ, పీసీలు వేణుగోపాల్, ఇస్తారీ, రఘురామ్ను ఎస్పీ కోటిరెడ్డి అభినందించి రివార్డును అందజేశారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ కె. తిరుపతి, ఐటీ కోర్ సీఐ శ్యాంసుందర్, ట్రాఫిక్ ఎస్సై ఎస్. అశోక్ పాల్గొన్నారు. -
అంతర్జిల్లా దొంగ అరెస్ట్
రూ.2.80 లక్షల వస్తువులు స్వాధీనం పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి రూరల్ పోలీసులు అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.2.80 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శ్రీధర్, ఎస్ఐ రాఘవరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మిత్రులు మాలకొండారెడ్డి, తిరుపతిస్వామి అలియాస్ వంశీ చెడు వ్యసనాలకు లోనై, సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగలుగా మారారు. పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడి, వివిధ కేసుల్లో పట్టుబడి ఒంగోలు జైలుకు కూడా వెళ్లారు. జనవరి 5వ తేదీన బెయిలుపై వచ్చిన ఈ ఇద్దరూ గుంటూరు జిల్లా రేపల్లిలో పల్సర్ బైకును అదే నెల 13వ తేదీన చోరీ చేశారు. 16న తెనాలి టౌన్లో రూ.30 వేల నగదు, బంగారు చైను, ఉంగరాలు సెల్ఫోన్ దొంగిలించారు. 20న నరసరావు పేట బ్రహ్మంగారి గుడి వద్ద రూ.లక్ష విలువ చేసే యమహా ఎఫ్జెడ్ బైకు అపహరించారు. 23న డోన్ ప్రభాకర్రెడ్డి నగర్లో హోండాషైన్ బైకు, ఎల్జీ టీవీ, సెల్ఫోన్, దొంగిలించారు. అక్కడినుండి పుట్టపర్తికి వచ్చి మండల పరిధిలోని పెడపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 25వ తేదీన కొత్తచెరువులో ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన ఇద్దరూ మామిళ్లకుంట క్రాస్ లోని పెట్రోలు బంకు వీధిలో రాజశేఖర్ ఇంటి వద్ద ఉన్న రూ.లక్ష విలువ చేసే బైకును దొంగిలించారు. దీన్ని అమ్మే ప్రయత్నంలో ఉన్న మాలకొండారెడ్డిని బుధవారం పెడపల్లిలో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఇతడి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే బైకు, సెల్ఫోన్లు, ఎల్ఈడీ టీవీ, స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తిరుపతిస్వామి అలియాస్ వంశీ మరికొన్ని సామాన్లు అమ్ముకొని వచ్చే ప్రయత్నంలో పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దొంగను పట్టుకోవడంలో సహకారం అందించిన హెడ్కానిస్టేబుళ్లు ధనుంజయ, శ్రీనివాస్, పీసీలు నాగేంద్ర, మారుతి, నరసింహలను సీఐ అభినందించారు. -
అనంతపురంలో అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
అనంతపురం : అనంతపురం నగరంలో అంతర్ జిల్లా దొంగ అమరనాథ్ నాయుడును పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. రూ. 30 లక్షల విలువైన బంగారంతోపాటు రూ. 50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. అయితే అమరనాథనాయుడిపై 63 చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యాదాద్రీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
ఉరివేసుకొని యువకుడి బలవన్మరణం
తెలంగాణను పాలించే హక్కు కాంగ్రెస్కే ఉంది
ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి
అరచేతిలో ఎన్నికల సమాచారం
ఈవీఎంల కమిషనింగ్ పరిశీలన
సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్పై రాయితో దాడి
టీ20 ప్రపంచకప్కు ఉగ్ర ముప్పు
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement