-
మార్చి 15 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. మొత్తం 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. పరీక్షల ఏర్పాట్లపై బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. పరీక్షల కోసం తీసుకున్న జాగ్రత్తలు, విద్యార్థులకు ఇచ్చే సూచనలను పరీక్షల విభాగం డైరెక్టర్ జయప్రదాభాయ్ మీడియాకు వివరించారు. పకడ్బందీ ఏర్పాట్లు: మంత్రి సబిత ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లు పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తక్షణమే స్పందిస్తాం: నవీన్ మిత్తల్ ’’ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉంటాం. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగం పని చేస్తోంది. ఎలాంటి మానసిక ఒత్తిడి అన్పించినా విద్యార్థులు కౌన్సెలింగ్ తీసుకోవాలి.. మనోధైర్యం ప్రతీ విద్యార్థికి అవసరం’’అని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అన్నారు. గంట ముందే పరీక్ష హాలుకు... ♦ విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్షహాలులోకి అనుమతిస్తారు. 9 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. విద్యార్థులు హాల్ టికెట్లపై పేరు, మీడియం ఇతర వివరాలను ముందే సరిచూసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపాల్ చేత సరిచేయించుకోవాలి. హాల్టికెట్లను ్టటbజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా అనుమతిస్తారు. ♦ ఏ విధమైన ప్రింటింగ్, చేతిరాత మెటీరియల్, సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్ష హాలులోకి అనుమతించరు. ♦ జిల్లా పరీక్షల కమిటీ(డీఈసీ)ని ప్రతీ జిల్లాలో నియమించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి, నోడల్ అధికారి, ఇద్దరు ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్ ఇందులో ఉంటారు. వీరితోపాటు జిల్లాస్థాయి హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ♦ రెవెన్యూ, విద్య, పోలీసు శాఖల నుంచి ఒకరు చొప్పున 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రాల్లో 200 సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. ♦ జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీలో అన్ని శాఖల అధికారులుంటారు. వారు ఆర్టీసీ, హెల్త్, విద్యుత్ సేవలు అందిస్తారు. అన్ని ప్రాంతాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పరీక్షకేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తారు. ప్రతీ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. -
వీడని సస్సెన్స్..! ఇంటర్ పరీక్షలు జరిగేనా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఆ దిశగానే అధికారులు ఆలోచిస్తున్నారు. కరోనా కేసుల వ్యాప్తి తగ్గకపోవడంతో ప్రభుత్వం కూడా ఇంటర్ పరీక్షలను వాయిదా వేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వచ్చే నెల 4వ తేదీ నుంచి నిర్వహించాల్సిన 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఇక పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా వారికి మార్కులను కేటాయించాలని నిర్ణయించింది. ఈ నేఫథ్యంలో రాష్ట్రంలోనూ పరీక్షల నిర్వహణపై నేడో, రేపో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిర్వహణ ఇబ్బందికరమే... కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరమేనన్న భావనలో అధికారులు ఉన్నారు. ప్రత్యక్ష బోధన లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ బోధన అంతంతగానే కొనసాగుతోంది. విద్యార్థులందరికి ఆన్లైన్ పాఠాలు అందడం లేదు. టీశాట్ వీడియో పాఠాల ప్రసారాన్ని విద్యార్థులంతా చూడటం లేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లోనూ పరీక్షలు ఎలా రాయాలన్న ఆందోళన నెలకొంది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహణ ఇబ్బందికరమేనన్న ఆలోచన అధికారుల్లో ఉంది. షెడ్యూలు ప్రకారం మే 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను, 2వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయా పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రోజు విడిచి రోజు చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నందున ప్రతిరోజు 5 లక్షల మంది విద్యార్థులు వస్తారని, భౌతికదూరం పాటించడం కష్టమేనన్న భావన నెలకొంది. బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించేప్పుడు, పరీక్ష కేంద్రాల్లోనూ ఇబ్బందికరమేనని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణ సమయంలో ఏర్పాటు చేసే 1,350 కేంద్రాలకు బదులు రెట్టింపు కేంద్రాలను ఏర్పాటు చేసినా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనన్న ఆలోచన అధికారుల్లో ఉంది. కేంద్రమే వద్దనుకున్నపుడు రాష్ట్రంలో ఎలా? కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పుడే పరీక్షల నిర్వహణ అవసరమా? అన్న భావన విద్యాశాఖ వర్గాల్లో నెలకొంది. కేంద్ర ప్రభుత్వమే జూన్లో పరిస్థితి సమీక్షించి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించడం అవసరమా? అన్న భావన అధికారుల్లో నెలకొంది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో నేడో రేపో తేలనుంది. ఇక రాష్ట్రంలో 260 సీబీఎస్ఈ స్కూళ్లు ఉండగా అందులో 15 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వారందరికి పరీక్షలు రద్దయ్యాయి. 12వ తరగతి చదివే మరో 10 వేల మంది విద్యార్థులు జూన్ వరకు వేచి చూడాల్సిందే. టెన్త్ పరీక్షలపై వేచి చూద్దామా? సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో టెన్త్ పరీక్షల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. షెడ్యూలు ప్రకారం మే 17వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అంటే మరో నెల రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయం తీసుకుంటుందా? కొన్ని రోజుల తరువాత కరోనా కేసుల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుందా? అనేది త్వరలోనే తేలనుంది. అయితే విద్యాశాఖ వర్గాలు మాత్రం పదో తరగతి పరీక్షలు అవసరమే లేదని, విద్యార్థులందరిని పాస్ చేస్తే సరిపోతుందన్న భావనలో ఉన్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షలు జరిగేనా? ఈనెల 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ మూడో దఫా పరీక్షలపైనా కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షలను షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తారా? లేదా? అన్నది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఆదమరిస్తే అంతే! -
మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు 2021 మే ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ సోమవారం తాత్కాలిక షెడ్యూల్ను విడుదల చేశారు. గతేడాది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనందున అప్పుడు ఫస్టియర్ పరీక్షలు రాసిన వారు ఈ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించారు. మార్చి 31 నుంచి ప్రాక్టికల్స్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ఆదివారాలు సహా ఏప్రిల్ 24 వరకు జరుగుతాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో.. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు జరుగుతాయి. ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ పేపర్లు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్ష మార్చి 24న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. -
60% కంటే తక్కువ హాజరుంటే..
శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇంటర్ సైన్స్ విద్యార్థులకు 60 శాతం హాజరు ఉంటేనే వార్షిక పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోకి రానుంది. గతేడాది కూడా ఈ నిబంధన ఉన్నప్పటికీ అప్పట్లో ఆన్లైన్ హాజరు విధానం లేకపోవడం వల్ల కచ్చితంగా అమలయ్యేది కాదు. ఈ ఏడాది బయోమెట్రిక్, ఆన్లైన్ హాజరును ప్రవేశపెట్టడంతో విద్యార్థి హాజరు ఎప్పటికప్పుడు తెలిసిపోతోంది. దీంతో ఇకపై 60 శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలయ్యే అవకాశం ఉంది. సైన్స్ తప్ప మిగిలిన ఇతర సబ్జెక్టుల విద్యార్థులకు 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే వారి నుంచి కాండినేషన్ ఫీజు వసూలు చేసి పరీక్షకు అనుమతిస్తారు. 10 రోజులు హాజరు తక్కువగా ఉంటే రూ.200, 18 రోజులు హాజరు తక్కువగా ఉంటే రూ.250, అంతకంటే హాజరు తక్కువగా ఉంటే రూ.400 కాండినేషన్ ఫీజుగా వసూలు చేస్తారు. డిసెంబర్ 28 వరకు గడువు ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగిసినా, రూ.2,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించే అవకాశాన్ని ఇంటర్ బోర్డు తాజాగా కల్పించింది. వచ్చే ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో తొలిసారిగా జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 2019 ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. వీలైనంత వరకు ఈ పరీక్షలను ప్రభుత్వ కళాశాలల్లోనే నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఆదేశాలను జిల్లా అధికారులకు జారీ చేసింది. సెకండియర్కు గ్రేడింగ్ విధానం ఈ ఏడాది నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. గతేడాది మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేశారు. పరీక్షల నిర్వహణపై సందేహాలు వచ్చే ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి మాసాంతం నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. మార్చి నెలలో ఎన్నికలు వస్తే ఇంటర్ పరీక్ష నిర్వహణ కష్టసాధ్యమవుతుందని పలువురు అధ్యాపకులు చెబుతున్నారు. -
ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ టైమ్టేబుల్ విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి పరీక్షలు ప్రారంభమై మార్చి 18తో ముగియనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏడాది జనవరి 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, జనవరి 30న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement